'''చర్ల గణపతిశాస్త్రి''' ([[జనవరి 1]], [[1909]] - [[ఆగష్టు 16]], [[1996]]) వేద పండితుడు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంథాల అనువాదకుడు.
ఈయన [[జనవరి 1]], [[1909]] సంవత్సరంలో [[చర్ల నారాయణ శాస్త్రి]] మరియు వెంకమ్మ దంపతులకు [[పశ్చిమ గోదావరి]] జిల్లాలోని [[కాకరపర్రు]] గ్రామంలో జన్మించాడు. గ్రామంలో ప్రాథమిక విద్యానంతరం, కాకినాడలో[[కాకినాడ]]<nowiki/>లో విద్యార్థిదశలో ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి స్వాతంత్ర్యోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. ఈయన వేదుల సూర్యనారాయణ మూర్తి కుమార్తె సుశీలను వివాహం చేసుకున్నాడు.
ఈయన జీవిత కాలమంతా [[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం]] వేద పండితుడుగా, మత సంబంధ సలహా సంఘ సభ్యుడుగా మరియు [[తిరుమల తిరుపతి దేవస్థానాలు]] ఆస్థాన విద్వాంసుడుగా తన అనుభవాన్ని పంచాడు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈయనను [[కళా ప్రపూర్ణ]]తో గౌరవించింది. [[భారత ప్రభుత్వం]] ఈయనను [[పద్మ భూషణ్ పురస్కారం]]తో సత్కరించింది.
ఈయన [[ఆగష్టు 16]], [[1996]] సంవత్సరంలో పరమపదించాడు.