వాల్మీకి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
|||
పంక్తి 5:
== జీవిత విశేషాలు ==
మహర్షి వాల్మీకి ఎవరు?వల్మీకము నుండి వెలుపలికి వచ్చిన వారు కావున [[వాల్మీకి]].మరామరా అని తపస్సుచేసిన వారు కావున మహర్షి,రాముడి జీవితచరిత్రను
వాల్మీకిగా పిలవబడుతున్న మహర్షి పేరు ప్రాచేతసుడని ఇక్కడ మనము గుర్తించవచ్చును.ఇది వాల్మీకి తనకు తాను తన గురించి చెప్పుకున్న విషయము.ఆయన మాటలలో ఆర్ధత,నిజాయతీ ఉట్టి పడు తున్నాయి.అయితే ప్రచేతసుడు ఎవరు?ప్రచేతసుడు ఎవరి కుమారుడు?ఆయనది ఏ వంశము?ఈ విషయ ములను తెలుసుకోవటానికి అనేక పురాణములను,చరిత్రలను చదవాలి.ప్రచేతసుల గురించిన ప్రస్తావన “శ్రీ మత్భాగవతము” నందు ఉంది.
శ్రీ మత్భాగవతము వేదవ్యాసవిరచితము.వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములలో శ్రీ మత్భాగవతము ఒక గొప్ప పురాణము.
కే తే ప్రచేతసోనామ కస్యాపత్యాని సువ్ర
పంక్తి 15:
కస్యా న్వవాయే ప్రఖ్యాతా: కుత్ర వా సత్రామాసత
అర్థము: గొప్ప భగవత్
స్వధర్మశీ లై:పురుషైర్భగవాన్ పురుషోత్తమ:
పంక్తి 23:
అర్థము:క్షత్రియులైన ప్రచేతసులు తమతమ ధర్మముల మూలకముగా శ్రీ హరిని యజ్ఞ యాగాదులచే పూజించుచుండిరి.అచ్చటికి వచ్చిన నారదులు ,యజ్ఞమయుడు,పురుషో త్తముడైన విష్ణువును గురించి ఉపదేశించిరని వినియున్నాము.
ఇక్కడ తెలిసిన విషయము ప్రచేతసులు విష్ణుభక్తులు.[[క్షత్రియులు]].వీరికి విష్ణువు,యజ్ఞయాగాదుల గురించి నారదుల వారు ఉపదేశము చేశారు.
ఆ తరువాత కథా క్రమములో ధ్రువుడి తపస్సు,శ్రీ హరి ప్రత్యక్షమవటము,వరాల అను గ్రహము , ధృవ వంశవిస్తరణ,(చూడుముసూర్యవంశస్థులు,బోయలవంశక్రమము)వత్సరుడు,పుష్పార్ణుడు,సాయంకాలుడు,చక్షుడు, ఉల్కకుడు,అంగుడు,వేనుడు,పృథ్వీరాజు,విజితాశ్వుడు,పావనుడు, హవిర్ధానుడు, ప్రచేతసుడు, ప్రాచేత సులు(10మంది) అని తెలియబడతారు.వీరి జన్మవృత్తా౦తములు,అంగుడి భాధ ,వేనుడి దుశ్చర్యలు, పృథ్వీ రాజుఔన్నత్యము,నిషాదుడుఅడవులలోకి పంపబడి కిరాతరాజవ్వటము,ప్రచేతసుడికి 10 మంది ప్రాచే తసులు జననము వివరించబడ్డాయి.ఆ 10మంది ప్రాచేతసులలో 7వ(పదవ) వాడు వాల్మీకి మహర్షి.
ప్రాచేతసుడు క్షత్రియవంశములోజన్మించినాడు,నారదులఉపదేశముతోనూ,తండ్రి,తాతల,ముత్తాతల సుకృతము,శ్రీ హరి పై తరతరాల భక్తి విశ్వాసాలు వాల్మీకిమహర్షిగా రూపొందింపచేశాయి. వాల్మీకిమహర్షి యొ క్క నిజ కథ ఇది.ఈ విషయములను కప్పిపుచ్చి అనేక కథలు తరతరాలుగా ప్రాచుర్యము పొందాయి.వాల్మీకి మహర్షిగురించి ఎవ్వరూ పరిశోధనలు గావించక పోవడముతో కట్టుకథలు ఇంత వరకు ప్రాచుర్యములో ఉన్నాయి.రాముడు అనే పాత్రను లోకానికి ఆదర్శపురుషుడిగా చూపించాలనే ఆదికవి తపనే గాని ఆ పాత్రకు గుణగణాలు రూపొందిచటమే తన ధృష్టి తప్ప తన గురించి తానెవరో గొప్పలు కాదుకదా వాస్తవాన్ని కూడా చెప్పకపోవడముతో ఎవరికి తోచినది వారు ఊహాగానాలు చేశారు.మహానుభావులు ఎప్పుడూ ఇత రుల గురించి,వారి బాగు గురించి ఆలోచిస్తారే తప్ప వారి గురించి వారు తపించరు.శ్రీ షిర్డి [[సాయిబాబా|సాయి]] విష యము లో కూడా ఆయన ఎవరో,ఏ తండ్రి బిడ్డడో ఆయన చెప్పలేదు,తాను హిందూవో,ముసల్మానో కూడా తెలియ నీయక మశీదులో నివశిస్తూ,అక్కడే హిందువులకు ఆరాధ్యనీయమైన తులసిమొక్కలను,ధునిని ఏర్పరచి సర్వమానవ సౌభ్రాతత్వమును కోరిన మహనీయుడి వలె, వాల్మీకి ని పవిత్రమైన వారిగా మనము గుర్తించా లి.షిర్డిసాయి ఎంతటి మహనీయులైనా వారిని తమ వాడంటే తమవాడనీ,హిందువులలో బ్రాహ్మ ణులు షిర్డిసాయిని భరద్వాజ గోత్రోత్భవుడని అంటూంటే,ముసల్మానులు తమవాడని ఇప్పటికీ ఆయన మంది రములో నమాజు చదువుతున్నారు.ఇవన్నీ ఎవరికి వారు ఏర్పరచుకొన్న భావనలే తప్ప నిజము ఆ భగవంతులకే ఎరుక.మహర్షివాల్మీకి ఎప్పుడూ,ఎక్కడా తాను తన జీవితచరిత్రను వెలి బుచ్చక పోవటముతో కొందరు వాల్మీకి పేరు రత్నాకరుడని ఆయన పూర్వాశ్రమములో దొంగ,దారిదోపిడీదారుడని వ్రాశారు. మరి కొందరు ఆయన బ్రాహ్మణుడని,పేరు అగ్నిశర్మ అని దొంగల ముటా లో పెరిగి దొంగ అయినాడని వ్రాశారు.ఈ కట్టు కథలకు ఎక్కడా ఆధారాలు లేవు(ఇలపావులూరి పాండురంగారావు,ఆచార్య సహదేవ, జస్టిస్ భల్లా).భగవత్ గీత లో కూడా అనేక మార్పులు,చేర్పులు జరిగాయని,మూల గీతలో లేని అనేక శ్లోక ములు చేర్చబడ్డాయని డాక్టర్ రాధాకృష్ణన్,రుడాల్ఫ్ ఓటో అభిప్రాయ బడ్డారు.(దర్శనములు-మతములు-[[విజ్ఞాన సర్వస్వము]],నాలుగవ సంపుటము-ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి) వాల్మీకిమహర్షి గురించి కొందరు ఓర్వలేక,అసూయతో లేదా దొంగ కూడా తపస్సు చేసి మహర్షి కావచ్చు అనేందుకు ఉదాహరణగా చూపేందు కో అల్లిన కట్టు కథలు.
భారతీయ సాహిత్య నిర్మాతలు-వాల్మీకి అనే ఆంగ్లపుస్తకములో [[ఇలపావులూరి పాండురంగారావు]] గారు ఈ క్రింది విధముగా వాల్మీకిమహర్షి పై వ్యాఖ్యానించారు.
“వాల్మీకి తన జీవితారంభ దశలో కిరాతుడని,సప్తరుషులచే
“ కిరాతుడు” అనే పదానికి అర్థము తురాయి అనగా నెమలి పింఛము లేదా అటువంటి ఆకారములో ఉన్న పువ్వులు,ఆకులను,పక్షుల ఈకలను తల ముందు భాగములో కట్టుకొని,తల పాగ వలె ధరించి ఉన్నవాడు. ”కి” అనగా కలిగి అని,రాతుడు అనగా తురాయివాడు అని అర్థము.అంతే గాని ఈనాడు వాడుకలో ఉన్నట్లుగా కిరాతుడు అంటే కసాయి వాడు లేదా [[కోడి]],[[జింక]],[[గొర్రె]],[[బర్రె]],[[మేక]], తదితర సాధు జీవుల తలను నిష్కర్షగా నరికే వాడు అని కాదు. ఆదిమానవకాలములో అడవులలో వేటకై వెళ్ళేప్పుడు ఇతర మాంసాహార జంతువుల బారి పడకుండా ఉండేందుకో,సరదాగా ఉంటుందనో,అలంకారానికో తురాయిని కట్టుకునే వారు. కిరాతుడు అంటే హింసాత్ముడు అనే అర్థము స్ఫురిస్తే ఈరోజులలో జీవాలను (కోళ్ళు, చేపలు, రొయ్యలు, గొర్రెలు,మేకలు) పెంచి,పోషించి మార్కెట్లో అమ్మకము చేసేవారు,కొనేవారు,తినేవారు అందరూ కిరాతులే.
వాల్మీకి శబ్దము చీమల పుట్ట అనే అర్థానికి,కఠోర ధ్యానానికి,నిశ్చల తపొముద్రకు ప్రతీక.అట్టి తపో ఫలితమే వాల్మీకి మహాకవి.వాల్మీకిని మహోన్నతముగా ఆరాధించే కాళిదాసు మేఘ సందేశములోని శ్లోకభాగములో ఇలా ప్రస్తుతించాడు.(ఇలపావులూరి పాండురంగారావు)
పంక్తి 41:
కిరాతుడు ఋషిగా పరివర్తన చెండాడని చెప్పడము నిజము కావచ్చు.అంతేగాని ఆయన గురించి మరొక్క మాట దురాలోచనే.తపస్సు ఆయన ప్రధానసద్గుణము,నిరంతరాధ్యయనము,సత్ప్రవర్తనల ఫలితమే మహా ఋషిగా ఆవిర్భవింప చేశాయి.
వాల్మీకి పేరు కలిగిన వారు నలుగురైదుగురు ఉన్నారని కొందరు విజ్ఞుల(వ్యాసుడు అనిపేరు కలిగిన వారు కూడా 10 మంది ఉన్నారని) అభిప్రాయము.వారిలో రత్నాకరుడు,అగ్నిశర్మ కూడా ఉండి ఉండ వచ్చు ను. వీరు మహర్షి,ఆదికవి వాల్మీకి ఉత్ద్భోధనలకు ప్రేరితులై తమ పేర్లను వాల్మీకిగా మార్చుకొని ప్రాచుర్య ము లోనికి వచ్చి ఉంటారు.ఆకతాయి రచయతలు ఎవరో వారిని మహర్షిని ఒక్కరే అని పొర బడి ఉండవచ్చు ను.ఈ విషయము నిజమే అని నమ్మటానికి పంజాబ్ మరియు హరియానా విశ్వవిద్యాలయము వారు ఆచార్య ,డాక్టరు సహదేవ ఆధ్వర్యములో 3 సంవత్సరముల పాటు నిర్వహించిన పరిశోధనలు సహ కరిస్తున్నాయి.(మహర్షి వాల్మీకి వాస్ నెవర్ ఏ డేకోయిట్ నార్ ఏ రోడ్ సైడ్ రాబర్-జస్టిస్ భల్లా,ద [[టైమ్స్ ఆఫ్ ఇండియా]],ఇంగ్లీష్ డైలీ,22, మే,2010)[[పంజాబ్]] మరియు హరియానా హై కోర్ట్ ఆదేశాల మేరకు పంజాబ్ మ రియు హరియానా ,విశ్వవిధ్యాలయము వారు పరిశోధనలు గావించారు.డాక్టరు సహదేవ,చైర్ పర్సన్ గా, వాల్మీకి చైర్ అనే విభాగమును ,ఏర్పాటు చేసి ఈ పరిశోధనలు,అధ్యాపకులచే నిర్వహింప బడ్డాయి. క్రీ.పూ. నుండి అందుబాటులో ఉన్న వేదములు, శిలాశాసనాలు, ఉపనిషత్తులు ,పురాణములు, ఇతిహాసములు , చరిత్రలు క్షుణ్ణముగా పరిశీలించగా మహర్షివాల్మీకిని ఎక్కడా,ఎప్పుడూ దొంగగా,దారిదోపిడీదారుడిగా వ్రాయ బడి లేదు. ఈ పరిశోధన ఫలితాల ఆధారముగా జడ్జిమెంట్ ను జస్టిస్ భల్లా ఇచ్చారు.ఈ జడ్జిమెంట్ ప్రకారము వాల్మీకి మహర్షిని ఎవ్వరూ దొంగ, దారి దోపిడీదారుడు అనకూడదు. ఆవిధముగా మాట్లాడ కూడదు, నాటి కలు,టి.వి.సీరియల్స్,సినిమాలు తీయరాదు,వాల్మీకిమహర్షిని దొంగ,దారిదోపిడీదారుడు అని బోయ లను, వాల్మీకులను కించ పరిచే విధముగా మాట్లాడితే నేరము,వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకో వచ్చును . మ హర్షి వాల్మీకి గురించి కొన్ని పురాణములలో( ఆధ్యాత్మికరామాయణము,స్కాంధపురాణము,తదితర) వ్రాయ బడినట్లుగా చెబుతున్న వాటికి వాస్తవాలకు పొంతన లేదని అవి మూలపురాణములో లేవని ఆ తరువాత చేర్చబడిన అవిశ్వాస కథలని ఇతిహాసికులు,చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
వాల్మీకిమహర్షిని ఆదికవి,ఋక్షకుడు,భార్గవుడు,కవికోకిల,వాక్యావిశారదుడు,మహాజ్ఞాని,[[భగవాన్]] అని కూడా పిలుస్తారు.వాల్మీకిమహర్షి “ఓం ఐ౦ హ్రీం క్లీ౦ శ్రీ౦” అనే బీజాక్షరాలు సరస్వతీ,లక్ష్మి,మాయ కటాక్షాన్ని కలుగచేసేమంత్రాలనులోకానికిపరిచయముచేశారు.(దేవిభాగవతము,వేదవ్యాసవిరచితము,తెలుగు అనువాదము)
వాల్మీకిమహర్షి జీవించిన కాలముపై అనేక పరిశోధనలు జరిగాయి.వాల్మీకి రామాయణము క్రీ.పూ.1000 వ సంవత్సర ప్రారంభములో రచింపబడి వుంటుందని,వాల్మీకిపై విశేషపరిశోధనలు గావించిన జి.ఎస్. ఆల్టేకర్ (1895-1987) నిర్దారించారు(ఇలపావులూరి పాండురంగారావు). క్రీ.పూ.100సంవత్సరములకు చెందిన బుద్ధచరిత్ర రచయత అశ్వఘోషుడు వాల్మీకి ఆదికావ్యాన్ని గూర్చి ప్రశంశిస్తూ ఇలా వ్రాశాడు.
పంక్తి 51:
వాల్మీకి మహర్షి వద్ద శిష్యరికము గావించిన భరద్వాజుడు,లవుడు,కుశుడు మహర్షిని భగవాన్ అని సంభోదించేవారు.బ్రహ్మ సమానుడని ,బ్రహ్మ రామాయణమును వ్రాయటానికి తానే వాల్మీకి మహర్షి గా అవుతరించాడని నమ్మేవారున్నారు.”విప్రో వాల్మీకిస్సు మహాశయా”అని బ్రహ్మ సరస్వతి దేవితో చెప్పా డని, అందువలన వాల్మీకిమహర్షి విప్రుడు అని పురాణ వ్యాఖ్యాతలు చెబుతున్నారు.స్వగుణధర్మముతో బోయ వాడిగా పుట్టిన వాడు ఆదికవిగా,మహర్షిగా,బ్రాహ్మణుడిగా గుర్తించ బడ్డారని ఆయన గణకీర్తిని కొని యా డారు.
ఆదికవి వాల్మీకి ఆ రోజులలోనే “అక్షరలక్ష” అనే ఈనాటి “ఎన్ సైక్లోపెడియా బ్రిటానికా” వంటి విజ్ఞాన సర్వస్వము,సర్వశాస్త్రసంగ్రహమునువెలువరించారు.(పెదబాలశిక్ష- గాజుల సత్యనారాయణ) ఈపుస్తకము నందు భూగర్భశాస్త్రము ,రసాయనశాస్త్రము, గణితశాస్త్రము, రేఖాగణితము, బీజ గణిత ము,త్రికోణమితి, 325 రకాల గణిత ప్రక్రియలు, [[గాలి]],[[ఉష్ణము]],[[విద్యుత్ శక్తి|విద్యుత్]],జలయంత్ర శాస్త్రము,ఖనిజాలు తదితర అనేక అంశాలు వివరించబడి ఉన్నాయి.యోగవాశిష్టము అనే యోగా,ధ్యానముల గురించిన సంపూర్ణ విషయములు గల మరో పుస్తకము మహర్షి వాల్మీకి వ్రాశారు.ఈ పుస్తకము రామాయణములోని అంతర్భాగమే.రాముడు పది-పన్నెండు సంవత్సరాల వయసులో మానసిక అశాంతికి లోనై ,మానసిక ధౌర్భల్యమునకు గురి అయిన ప్పుడు వశిస్టుడి ద్వారాయోగా,ధ్యానములను శ్రీరాముడికి భోధించారు వ్రాసింది. వాల్మీకిమహర్షి, పలికింది, భోదించింది వశిస్టుడు,అందు వలన “యోగవాశిష్టము” అనే పేరు వచ్చింది. ఆదిత్య హృదయము అనెడి సూర్యస్తుతిని వ్రాసినవారు వాల్మీకి మహర్షియే.కౌసల్యా సుప్రజా రామ అనెడి సుప్రభాతమును వ్రాసిన వారు వాల్మీకియే. మహర్షివాల్మీకి “వాల్మీకి మతము”అనే దానిని నెలకొల్పారు.తొమ్మిది లక్షణాలతో జీవితమును సంస్కరించుకోవాలని,ఈ తొమ్మిది గుణములు కలిగిన వారిని,పాటిస్తున్నవారిని వాల్మీకి మత స్తులుగా గుర్తించారు. ఆటవికజీవితములో వ్యవసాయముతెలియదు. అడవులలో దొరికిన [[ఆకులు]], అల ములు,దుంపలుకాయలు,[[పండ్లు]], సాధుజీవుల (కుందేలు,కోడి,పంది, గొర్రె, మేకలువంటివి)ను పట్టి, అవి పట్టుబడక పోతే వాటితో పోరాడి స్వంతము చేసుకోవటమే అలవాటు. తమ వద్ద లేని ఇతరుల వద్ద ఉన్న వాటిని లాగుకోవటము,ఇవ్వకపోతే వారితో పొరాడి,చంపి అయినా సరే తమ స్వంతము చేసుకోవటము ఆటవికతనము,ఈ పోరాటము జరిపే,ధైర్యసాహసాలు గల వారినే “క్షత్రియులు” అని అంటారని భీష్ముడు [[మహాభారతము]] నందు క్షత్రియత్వము గురించి వివరణ ఇచ్చాడు.ఈ ఆటవికతనమును పారద్రోలి సంస్క రించటానికే వాల్మీకి తొమ్మిది లక్షణాలతో జీవనమును సాగించాలని భోదించారు.ఆటవికులలో సంస్కారము ను కలుగ చేయటానికే వాల్మీకిమతము ప్రారంభించబడింది. క్రీ.పూ.600 సంవత్సరములోనే ఆటవికులు సంస్కరించబడటము మొదలైంది అని చెప్పటానికి వాల్మీకి వ్రాసిన మొదటి శ్లోకమే గొప్ప ఉదాహరణ.ఆటవిక బాష సంస్కృతముగా రూపొందింది వాల్మీకి వలననే.”మా నిషాద”అనే పదముతో మొదలైన శ్లోకములోని మొదటి వ్యక్తి నిషాదుడే,అతనూ బోయవాడే.అజ్ఞానముతో బోయవాడు చేసిన ఆడ పక్షిని చంపటము అనే ప్రక్రియ వాల్మీకిమహర్షిలో బోయలను, ఆటవికులను సంస్కరించాలనే ఆలోచనను కలిగింప చేసి ఒక ఆదర్శ మానవుడిని నాయకుడిగా చూపించాలని “రామాయణము” వ్రాసేలా చేశాయి.
మహర్షి వాల్మీకి గురించి అనేక పరిశోధనలు తరాతరాల నుండి విశ్వవిద్యాలయాలలో, పండితుల,పీఠాధిపతుల ఆధ్వర్యములో,మానవుడిమస్థిష్కములో కొనసాగుతూనే ఉన్నాయి.ఆ మహాను భావుడి ఆశయసిద్ధి కోసము అనేక రూపకల్పనలు,నూతన ఆవిష్కరణములు జరుగుతూనే ఉన్నాయి. మానవులంతా ఆయన మతమును స్వీకరిద్దాము,శ్రీరాముడి వంటి ఆదర్శ పురుషులు అవుదాము.ప్రతి భారత మహనీయుడు-శ్రీ షిర్డీశాయీ,శ్రీరామకృష్ణపరమహంస,
==పేరు వ్యుత్పత్తి==
పంక్తి 76:
==వాల్మీకి వలస==
అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారత దేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత, మహర్షిగా మారి దండకార్యణం ([[నల్లమల]] అడవులు) గూండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలో పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి [[తమిళనాడు]] రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా [[శ్రీలంక]] ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని
== ఇవికూడా చూడండి ==
|