నెల్లుట్ల రమాదేవి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
'''నెల్లుట్ల రమాదేవి''' తెలుగు [[కవయిత్రి]], కథకురాలు, ఉపన్యాసకురాలు మరియు కార్టూనిస్టు. <ref>[http://soyi.discover-telangana.org/2007/06/north_telangana_story_writers_2/ ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం – 2]</ref>ఆమెకు 2013 సంవత్సరానికి గాను [[తెలుగు విశ్వవిద్యాలయం]] వారు 'కథ' విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.<ref>[http://www.andhrabhoomi.net/content/telugu-varsity-1 తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన]</ref>ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈమె కథలు, కవిత్వం రాయడమేకాక కార్టూన్‌ ప్రక్రియలోకూడా ఆమెకు మంచిప్రవేశం ఉంది. రమణీయం, మనసు భాష, మనసు మనసుకూ మధ్య పుస్తకాలను వెలువరించారు.
 
==జీవిత విశేషాలు==
రమాదేవి [[వరంగల్‌]] లోని [[స్టేషన్‌ఘన్‌పూర్‌]] లో రామచంద్రరావు,శకుంతలాదేవి దంపతులకు జన్మించారు.తండ్రి వ్యవసాయం చేయిస్తూ కరణంగా ఉండేవారు. ఆమె పాఠశాల విద్యను స్టేషన్‌ఘన్‌పూర్‌లో పూర్తిచేసారు.బాల్యం నుండి ఆమెకు మిమిక్రీ అంటే ఆసక్తి ఎక్కువ. చదువు విషయంలో ఆమె తల్లి ఆమెను ప్రోత్సహించేది. ఆమె తల్లి పుస్తకాలు, [[నవల]]లు బాగా చదివేది. పిల్లలను కూడా చదివేందుకు ప్రోత్సహించేది. పత్రికలలో గల కార్టూన్లు చూసి ఆసక్తి కనబరచేవారు. ఇంటర్ చదువుతున్నప్పుడు మొదటిసారి కార్టూన్ వేసారు. 1978 లో ఆమె మొదటి కార్టూన్ [[స్వాతి]] పత్రికలో అచ్చువేయబడినది. ఆమె కళాశాల విద్య [[హైదరాబాదు]]లోని [[రెడ్డి మహిళా కళాసాల]]లో జరిగింది.
ఆమె వివాహం 1983 లో దేవేందర్ తో జరిగింది. ఆమె భర్త [[ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌]]లో రిపోర్టర్‌గా చేశారు. గ్రూప్‌ 2 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. ఆయన ప్రోత్సాహంతో ఆమె బ్యాంక్‌ ఉద్యోగంలో చేరారు. మొదట్లో గ్రామీణ బ్యాంక్‌లో 1984లో చేసారు. 1986లో [[ఆంధ్రాబ్యాంక్‌]] క్లర్క్‌గా చేరి ప్రస్తుతం మార్కెటింగ్‌ జోనల్‌ ఆఫీసర్‌గా చేస్తున్నారు.ఆమెకు ఇద్దరు కుమారులు(ధృవతేజ్‌, నయనదీప్‌). ఇలా ఇప్పటికీ బ్యాంక్‌ ఉద్యోగం చేసుకుంటూ సాధ్యమైనంత వరకు కార్టూన్లు వేస్తూ కవితలు,కథలు రాస్తున్నారు.
 
==కార్టూనిస్టుగా==
ఆమె ఎన్నో కథలు, కవితలు రాశారు. కాని నన్ను ఆమె కార్టూనిస్టుగా చెప్పుకోవడానికే ఇష్టపడతారు. ఎందుకంటే కార్టూన్‌ వేసేటపుడు దైనందిన జీవితంలో జరిగే విషయాలే ప్రేరణ కలిగిస్తాయి. ముఖ్యంగా ప్రయాణాల్లో, వివాహాలలో చాలా హాస్య విషయాలు కనిపిస్తాయి. ఇలాంటి వాటికి కాస్త అతిశయోక్తి జోడిస్తే హాస్యం, వ్యంగ్యం ఉంటుంది. కథ, వ్యాసం, కవిత ఇవన్నీ చెప్పే విషయాలనే ఒక చిన్న స్థలంలో[[కార్టూన్‌]] ద్వారా చెప్పవచ్చనేది ఆమె భావన.
 
==వ్యక్తిగత జీవితం==
ఆమె వివాహం 1983 లో దేవేందర్ తో జరిగింది. ఆమె భర్త [[ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌]]లో రిపోర్టర్‌గా చేశారు. గ్రూప్‌ 2 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. ఆయన ప్రోత్సాహంతో ఆమె బ్యాంక్‌ ఉద్యోగంలో చేరారు. మొదట్లో గ్రామీణ బ్యాంక్‌లో 1984లో చేసారు. 1986లో [[ఆంధ్రాబ్యాంక్‌]] క్లర్క్‌గా చేరి ప్రస్తుతం మార్కెటింగ్‌ జోనల్‌ ఆఫీసర్‌గా చేస్తున్నారు.ఆమెకు ఇద్దరు కుమారులు(ధృవతేజ్‌, నయనదీప్‌). ఇలా ఇప్పటికీ బ్యాంక్‌ ఉద్యోగం చేసుకుంటూ సాధ్యమైనంత వరకు కార్టూన్లు వేస్తూ కవితలు,కథలు రాస్తున్నారు.
==కథలు==
ఈమె కథల్లో మాతృత్వం విలువను చెప్పే స్త్రీలు, రాజకీయ నాయకుల వాగ్దానాలకు మోసపోయినవారు, బాధ్యతలేని భర్త నుండి దూరమై కుటుంబాన్ని పోషించుకునే ఇల్లాలు, కట్నం కోసం వెంపర్లాడే వ్యక్తిని భర్తగా అంగీకరించక తిరస్కరించే ఆత్మాభిమానం ఉన్న విద్యావంతులైన యువతులు ఈమె కథల్లో కనిపిస్తారు. ఇంకా పిల్లల సంతోషమే తన సంతోషంగా బ్రతికే మాతృమూర్తి, వ్యక్తిత్వమే ఊపిరిగా ఉన్న యువతులు, తనప్రేమను అర్థం చేసుకోలేని భర్తను చూసి నిస్సహాయులైన భార్యలు, వృద్ధాప్యంలో కూడా అమ్మమ్మే అమ్మవాత్సల్యాన్ని పంచే స్త్రీలు నెల్లుట్ల రమాదేవి కథల్లో కనిపిస్తారు.<ref>[http://www.bhumika.org/archives/2673 నెల్లుట్ల రమాదేవి కథల్లో స్త్రీలు]</ref>
 
==కవయిత్రిగా==
వరంగల్‌లోని [[ఆకాశవాణి]] సెంటర్‌ ఆమెను కవయిత్రిగా మార్చేసింది.ఒక సారి కార్టూనిస్టుగా వాళ్ళు ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఆమె కవితలు రాస్తానని తెలిసి కవితలు పంపమన్నారు. అప్పటి కప్పుడు రెండు కవితలు రాసుకొని చదివారామె. అప్పటి నుండి ఆమె కవితలు ఆకాశవాణిలో చదవమని అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఇలా ఆకాశవాణి వారే ఆమెను కవయిత్రిని చేశారు. దాంతో కవితలు రాయాలనే ఉత్సాహం ఆమెలో పెరిగింది. అలాగే వరంగల్‌లో ప్రతి ఉగాదికి కవితా సంపుటి వచ్చేది.దానికి కూడా ఆమె కవితలు పంపేవారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/నెల్లుట్ల_రమాదేవి" నుండి వెలికితీశారు