మద్దిపాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 159:
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామములో ఒక సేంద్రియ ఎరువుల కుటీరం నిర్మించెదరు. [10]
===కళాక్షేత్రం===
మద్దిపాడు ప్రధాన కూడలిలో 1938 లో తెలుగు చలనచిత్ర దిగ్గజాలు ఎస్.వీ.రంగారావు, భానుమతి. అక్కినేని నాగేశ్వరరావు, రాజనాల తదితర పెద్ద కళాకారులు ఇక్కడ నాటకాలు ప్రదర్సించేవారు. దొడ్డవరం గ్రామానికి చెందిన భానుమతి, తమ ప్రదర్శనలకు మద్దిపాడులో కళాక్షేత్రం ఏర్పాటుచేయాలని సమాయత్తం చేసినారు. 1940 లో అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా దీనిని ప్రారంభించినారు. నాటినుండి ఇక్కడ లెక్కలేనన్ని ప్రదర్శనలు నిర్వహించినారు. మద్దిపాడు కళాక్షేత్రం అన్ని రంగాలకు నిలయంగా ఉండేది. గ్రామములో ఎటువంటి కార్యకలాపాలు జరగాలన్నా వేదికగా ఉండేది. ఈ కళాక్షేత్రంలో నాటకాలు, నాటికలూ చాలా ప్రదర్శించి, జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది కళాకారులు గుర్తింపు పొందినారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా, పంచాయతీ ప్రాంగణంలోని ఈ కళాక్షేత్రాన్ని పూర్తిగా తొలగించినారు. దీనికి తగింజ పరిహారం కూడా అందజేసినారు. మూడు సంవత్సరాలుగా కళాక్షేత్రం నిర్మించెదమని హామీలు ఇచ్చుచున్నా గానీ ఒక్క అడుగు కూడా పని ముందుకు సాగుటలేదు. దీనితో ఈ కట్టడాల స్థలాలు ఆక్రమణలకు గురి అగుచున్నవి. కొందరు దుకాణాలు గూడా ఏర్పాటు చేసుకున్నారు. []
 
==మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/మద్దిపాడు" నుండి వెలికితీశారు