మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
'''మిక్కిలినేని''' గా ప్రసిద్ధులైన '''మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి''' ([[జూలై 7]], [[1916]] - [[ఫిబ్రవరి 22]], [[2011]]) ప్రముఖ తెలుగు రంగస్థల మరియు [[సినిమా]] నటులు మరియు రచయిత. వీరు [[గుంటూరు]] జిల్లా [[లింగాయపాలెం]]లో జన్మించారు. మన జానపద కళారూపాలతో ప్రభావితులై [[కపిలవాయి రామనాథశాస్త్రి]] శిష్యులైనారు. పౌరాణిక, [[జానపదము|జానపద]] సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యానంతరం నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడినాడు. [[ప్రజానాట్యమండలి]] రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. [[ఆంధ్ర ప్రభ]]లో 400 మంది నటీనటుల జీవితాలను '[[నటరత్నాలు]]' శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు.
 
1982లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] గౌరవ డాక్టరేట్, [[కళాప్రపూర్ణ]] బిరుదుతో తెలుగువారు ‘మిక్కిలి’ సంతసిం చేలా సత్కరించింది.
 
==జీవిత చరిత్ర==
"మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మరణంతో జీవించి వున్న [[తెలుగు]] సినీ కళాకారుల్లో తానే పెద్ద" అన్నారు డా. [[అక్కినేని నాగేశ్వరరావు]]. నిజమే. నాయక పాత్రలు-అనామక పాత్రలు అనే సినీ కొలమానంతో ‘అక్కినేని ఎక్కాల్సిన మెట్లూ-మిక్కిలినేని దిగాల్సిన మెట్లూ లేవు’ అనే వాడుక లోని చమత్కారమూ నిజమే. 1949లో [[కేఎస్ ప్రకాశ రావు]] [[దీక్ష]]తో మొదలై బాలకృష్ణ సినిమా [[భైరవద్వీపం]] వరకూ 400లకు పైగా తెలుగు చిత్రాల్లో నటించారు.
 
ఐదుసార్లు జైలుకు వెళ్లిన [[స్వాతంత్య్రయోధుడూ]]- [[కమ్యూనిస్టు]]. గ్రంథాలయ, హేతువాద ఉద్యమాలలో క్రియాశీల కార్యకర్త, నాటకరంగ నటుడు, ‘ఆంధ్రుల నటరత్నాలు’ తదితర రచనలను చేసినవాడు, [[ప్రజానాట్య మండలి]] వ్యవస్థాపక సభ్యుడు, ‘[[తెలుగు జానపద కళారూపాలు]]’ గ్రంథ రచయిత.
‘[[మన పగటి వేషాలు]]’, ‘[[ఆంధ్రుల నృత్యకళావికాసం]]’ తదితర పరిశోధనాత్మక గ్రంథ రచయిత. ఎనభై ఏళ్లనాడు భార్యను నాటక రంగానికి పరిచయం చేసిన ప్రజా కళాకారుడు. జీవించి ఉన్న వాళ్లల్లో ఆయనతో పోల్చదగిన వారు అరుదు!
గుంటూరు జిల్లా [[లింగాయపాలెం]]లో [[1914]] [[జూలై 7]]న జన్మించారు మిక్కిలినేని. అయినవాళ్లు నష్టజాతకుడ న్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా [[కోలవెన్ను]]లో అమ్మమ్మ గారి ఇంట ఆయన బాల్యం పాదుచేసుకొంది. [[కపిలవాయి రామనాథ శాస్ర్తి]] శిష్యరికంలో ‘మిక్కిలినేని’ ఇంటిపేరుగల వారికి గర్వకారణంగా మానులా బహుముఖంగా ఎదిగి, మంగళవారం [[ఫిబ్రవరి 22]], [[2011]] న 96వ ఏట సారవంతంగా అదృశ్యమైంది.
 
మిక్కిలినేని వంటి నూనూగు మీసాల కుర్రాళ్లను అప్పటి సంక్షుభిత సమాజం రాటుదేల్చింది. అంతర్జాతీ యంగా ఫాసిస్టులకు, దేశీయంగా బ్రిటిష్-నైజాం నియం తృత్వానికి, [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర]] ప్రాంతంలో జమీందారీల అణచివేతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుపార్టీ రూపొందించిన కళాసైన్యం ప్రజానాట్యమండలి. ఆ వాతావరణంలో భార్య సీతా రత్నాన్ని మిక్కిలినేని నాటక రంగానికి పరిచయం చేశారు. ఏడు దశాబ్దాల క్రితం ఎంతటి ముందడుగో!
 
[[పల్నాటియుద్ధం]]-[[బొబ్బిలియుద్ధం]]-[[కాటమరాజు కథ]] తదితర 30 చారిత్రక-జానపద కళారూపాల ద్వారా ప్రజలను సమీకరించిన ప్రజానాట్యమండలి 1940లలో నిషేధానికి గురైంది. ఫలితంగా కొందరు సినీరంగాన్ని ఆశ్రయించారు. వారిలో [[కేబీ తిలక్]], [[తాతినేని ప్రకాశరావు]], [[గరికపాటి రాజారావు]], [[సుంకర సత్యనారాయణ]], [[వాసిరెడ్డి భాస్కరరావు]], [[తమ్మారెడ్డి కృష్ణమూర్తి]], [[సి.మోహనదాసు]], [[టి.చలపతిరావు]], [[వి.మధుసూదనరావు]], [[మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి]] వంటి ముఖ్యులున్నారు.