గౌతు లచ్చన్న: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
'''గౌతు లచ్చన్న''' ([[ఆగష్టు 16]], [[1909]] - [[ఏప్రిల్ 19]], [[2006]]) [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో [[సర్దార్ వల్లభభాయి పటేల్|సర్ధార్ వల్లభాయ్ పటేల్]] తరువాత [[సర్దార్]] అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి . లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్. '''సర్దార్ గౌతు లచ్చన్న''', [[వి. వి. గిరి|వి.వి.గిరి]], [[సుభాష్ చంద్రబోస్|నేతాజి సుభాష్ చంద్రబోస్]]<ref>[http://www.glowfoundations.com/biodata.html Latchanna organised reception at Eluru to the soldiers of the Azad Hind Fauz founded by Netaji Subash Chandra Bose]</ref>, [[జయంతి ధర్మతేజ]], మొదలగు అనేకమంది జాతీయ నాయకులతో కలిసి [[భారత స్వాతంత్ర్యోద్యమము|భారత దేశ స్వాతంత్ర్య పోరాటాలలో]] పాల్గొని, అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళాడు. [[టంగుటూరి ప్రకాశం|ప్రకాశం పంతులు]] మరియు [[బెజవాడ గోపాలరెడ్డి|బెజవాడ గొపాలరెడ్డి]] మంత్రివర్గంలో మంత్రి పదవి నిర్వహించిన లచ్చన్న, మద్యపాన నిషేధం విషయంలో [[టంగుటూరి ప్రకాశం|ప్రకాశం పంతులు]]<nowiki/>తో విభేదించి, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, ప్రకాశం ప్రభుత్వ పతనానికి కారణభూతుడయ్యాడు. చిన్న [[రాష్ట్రాలు]] కావాలన్నాడు. [[తెలంగాణ|తెలంగాణా]] కొరకు [[మర్రి చెన్నారెడ్డి]]<nowiki/>తో చేతులు కలిపాడు. [[తెలంగాణ|తెలంగాణా]] రాష్ట్ర అవసరాన్ని, ఔచిత్యాన్ని వివరిస్తూ పుస్తకం వ్రాశాడు. [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధి]] అత్యవసర పరిస్థితి విధించినప్పుడు వ్యతిరేకించి, స్వేచ్ఛ కోసం పోరాడాడు. [[చరణ్ సింగ్|చౌదరి చరణ్ సింగ్, ]] [[జయప్రకాశ్ నారాయణ్|జయప్రకాష్ నారాయణ]], మసాని లతో పనిచేశాడు.
 
తెలుగు వారి రాజకీయ జీవనములో స్వాతంత్ర్యానికి ముందు, తరువాత ప్రభావితము చేసిన నాయకుడు లచ్చన్న. కేవలము స్కూల్ విద్యకే పరిమితమైనా, [[ఎన్.జి.రంగా|ఆచార్య రంగా]] ప్రథమ అనుచరుడుగా, తెలుగులో మంచి ఉపన్యాసకుడుగా, రాజాజి ఉపన్యాసాల అనువాదకుడిగా, చరిత్ర ముద్ర వేయించుకున్న బడుగువర్గ పోరాట జీవి లచ్చన్న.
పంక్తి 47:
అతను నడిపిన హరిజన సేవా సంఘాలు, చేపట్టిన హరిజన రక్షణ యాత్రలు ప్రజలను బాగా ప్రభావితం చేశాయి. [[బారువా]] గ్రామ వీధుల్లో యువజనులను వెంట వేసుకొని భజన గీతాలు పాడుతూ వెళుతుంటే గ్రామమంతా దద్దరిల్లుతున్నట్లు కనిపించేది. సవర్ణులలో ఆశ్చర్యం, హరిజనులలో ఆశలు రేకెత్తించేవి. రాత్రి పాఠశాలలు నిర్వహించి బడుగు వర్గాల విద్యాభివృద్ధికి అతనెంతో కృషి చేశాడు. హరిజనులకు దేవాలయాలలో ప్రవేశం కలిగించాడు. లచ్చన్న చేసిన ఆర్థిక సహాయంతో కుశాగ్రబుద్ధులైన ఎందరో హరిజన విద్యార్థులు ఉన్నత స్థానాల నలంకరించారు.
[[ఎన్.జి.రంగా|ఆచార్య రంగా]]<nowiki/>తో లచ్చన్న స్నేహం రాష్ట్ర రాజకీయాలలో ఒక నూతన శకాన్ని ఆరంభించింది. [[మహాత్మాగాంధీ]], పండిట్ [[నెహ్రూ]] గురు శిష్య సంబంధం లాంటిదే రంగా- లచ్చన్నల సంబంధం. [[నిడుబ్రోలు]]<nowiki/>లో రంగా స్థాపించిన రైతాంగ విద్యాలయంలో తొలిజట్టు విద్యార్థులలో లచ్చన్న ఒకడు. ఆ విశ్వవిద్యాలయంలో పొందిన [[శిక్షణ]] అతని భావి జీవితానికెంతో ఉపకరించింది. జమీందారీ వ్యతిరేక పోరాటానికి ఆయనను నడుము బిగించేటట్లు చేసింది. [[1935]]లో రాష్ట్రంలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ శాఖ ఏర్పడినప్పుడు దానికి అతను సభ్యుడుగా ఎన్నికయ్యాడు. ఆ రోజుల్లో రైతు సంఘాలు [[కాంగ్రెస్ పార్టీ]]లోని అంగాలే. [[1939]]లో [[త్రిపుర|త్రిపురలో]] జరిగిన అఖిలభారత కాంగ్రెస్ మహాసభ, కిసాన్ సభలను ఆంధ్రలోని పలాసాలో జరపాలని తీర్మానించారు. [[రాహుల్ సాంకృత్యాయన్]] ఈ సభలకు అధ్యక్షత వహించాడు. ఈ సభలు జయప్రదం కావడానికి ప్రధానకారకుడు లచ్చన్నే. దీనితో ఆయన పేరూ, ఆయన కార్యదీక్ష దేశమంతటా తెలిసింది. లచ్చన్న అనేక కిసాన్ ఉద్యమాలు నడిపి ఆ రోజుల్లో జమీందార్ల పక్కల్లో బల్లెంగా తయరైనాడు.
 
స్వాతంత్ర్యోద్యమంలో చివరి పోరాటం [[క్విట్ ఇండియా]] ఉద్యమం. [[1942]]లో జరిగిన ఈ ఉద్యమంలో పాల్గొన్న లచ్చన్నను ప్రభుత్వం అతి ప్రమాదకరమైన వ్యక్తిగా గుర్తించి, ఆయనను పట్టి యిచ్చిన వారికి పదివేల రూపాయల బహుమతిని ప్రకటించింది. చివరకు ప్రభుత్వమే అతనిని బంధించి మూడేళ్ళు జైల్లో ఉంచి [[1945]] అక్టోబరులో విడుదల చేసింది. ఆనాటి నుంచి లచ్చన్న ఆంధ్ర అగ్రనాయకులలో ఒకరైనాడు. [[1947]]లో లచ్చన్న ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడయ్యాడు.
 
==రాజకీయ జీవితం==
[[1950]]లో [[ఆచార్య రంగా]] కృషి కార్ లోక్ పార్టీని స్థాపించినప్పుడు అందులో లచ్చన్న ప్రధాన పాత్ర పోషించాడు. [[1953]] అక్టోబరు 1 న [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం]] ఏర్పడింది. [[చెన్నై|మద్రాసు]] ప్రభుత్వం నుంచి ఆంధ్రులకు రావలసిన ఆస్తుల విభజనను పరిశీలించడానికై ఏర్పడిన ఆంధ్రసంఘంలో కాంగ్రెస్ నుంచి [[నీలం సంజీవరెడ్డి]], ప్రజా పార్టీ నుంచి [[తెన్నేటి విశ్వనాధం]], కృషి కార్ లోక్ పార్టీనుంచి లచ్చన్న సభ్యులు. [[టంగుటూరి ప్రకాశం|ప్రకాశం]] పంతులు మంత్రివర్గంలోనూ, [[బెజవాడ గోపాలరెడ్డి]] మంత్రివర్గంలోనూ, లచ్చన్న మంత్రిగా పనిచేశాడు.
 
[[1961]]లో [[రాజాజీ]] స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీకి [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రశాఖకు సర్దార్ గౌతు లచ్చన్న అధ్యక్షుడు. [[1978]]లో లచ్చన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార [[ప్రతిపక్ష నాయకుడు]]గా ఉన్నాడు. పభ్లిక్ అక్కౌంట్స్ ఛైర్మన్ గా ఆ రోజుల్లో పనిచేశాడు. కొంతకాలం బహుజన పార్టీలో పనిచేసిన లచ్చన్న ఆ తరువాత అన్ని రాజకీయ పార్టీలతో తెగతెంపులు చేసుకుని, పార్టీలకు అతీతంగా బడుగు వర్గాల సంక్షేమానికి కృషి చేస్తూ వచ్చాడు.
 
మన దేశంలో సర్దార్లంటే ఇద్దరే. ఒకరు [[సర్దార్ వల్లభభాయి పటేల్]]. మరొకరు సర్దార్ గౌతు లచ్చన్న. ఒకరిది దేశస్ధాయి, మరొకరిది రాష్ట్ర స్థాయి. సర్దార్ అంటే సేనాని. స్వాతంత్ర్యోద్యమ పోరాట వీరునిగా ఎన్నో ఉద్యమాలు నడిపిన కురువృద్ధుడు సర్దార్ గౌతు లచ్చన్న. జమీందారీ వర్గాల వ్యతిరేక పోరాట వీరునిగా ప్రజాహృదయాలలో ఆయన స్థానం చెక్కు చెదరనిది.
"https://te.wikipedia.org/wiki/గౌతు_లచ్చన్న" నుండి వెలికితీశారు