యోగి ఆదిత్యనాథ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
'''యోగి ఆదిత్యనాథ్''' భారతదేశంలోణి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. భారతీయ జనతాపార్టీ నుండి ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ నియోజకవర్గం ద్వారా ఎన్నికైనారు.
==జీవిత విశేషాలు==
యోగి ఆదిత్యనాథ్‌ [[1972]] [[జూన్‌ 5]] న ప్రస్తుత ఉత్తరాఖండ్‌లోని పౌరిగడ్వాల్‌ జిల్లాలోని పాంచుర్‌లో రాజ్‌పుట్‌ కుటుంబంలో జన్మించారు. ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో గల హెచ్‌ఎన్‌బీ గర్‌వాల్ యూనివర్సిటీ నుంచి మ్యాథమెటిక్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేశారు. 26 ఏళ్లకే యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఈతలో, బ్యాడ్మింటన్‌లో ప్రావీణ్యం ఉంది. 1998లో తొలిసారిగా గోరఖ్‌పూర్‌ నుంచి ఎన్నికైనప్పుడు పార్లమెంటులో అతిపిన్న వయస్కుడు (26) ఆయనే. అదే నియోజకవర్గం నుంచి అయిదుసార్లు (1998, 1999, 2004, 2009, 2014) ఎన్నికయ్యారు.<ref>[http://telugu.oneindia.com/news/india/yogi-adityanath-maths-graduate-who-became-sanyasi/slider-pf117830-197565.html యూపీలో సవాళ్లు: దటీజ్.. యోగి ఆదిత్యనాథ్, బీజేపీయే మోకరిల్లింది!]</ref> ప్రస్తుతం గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గోరఖ్‌నాథ్ మఠాధిపతిగా సైతం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. గోరఖ్‌నాథ్ మఠాధిపతి ఆదిత్యానాథ్ అస్తమయంతో ఆయన వారసుడిగా మఠం బాధ్యతలు స్వీకరించారు.
 
==రాజకీయ జీవితం==
"https://te.wikipedia.org/wiki/యోగి_ఆదిత్యనాథ్" నుండి వెలికితీశారు