కొణిజేటి రోశయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
| successor3 = [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]]
}}
'''కొణిజేటి రోశయ్య ''' భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు. [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరియు [[తమిళనాడు]], [[కర్ణాటక]] రాష్ట్రాల గవర్నరుగా పనిచేశాడు. మంచి వక్తగా పేరుతెచ్చుకున్నాడు. ఇతడికి ఆర్థిక సంబంధ విషయాలు మరియు రాజకీయాలపై మంచి పట్టు ఉన్నది.
 
==నేపధ్యము==
 
'''కొణిజేటి రోశయ్య''' [[1933]], [[జూలై 4]]న [[గుంటూరు]] జిల్లా [[వేమూరు]] గ్రామములో జన్మించారు. గుంటూరు [[హిందూ కళాశాల (గుంటూరు)|హిందూ కళాశాల]] లో కామర్స్ అభ్యసించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున [[1968]], [[1974]] మరియు [[1980]]లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా [[మర్రి చెన్నారెడ్డి]] ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ మరియు రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైననూ, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి నవంబర్ 24, 2010 వరకు [[ఆంధ్ర ప్రదేశ్]] ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆగస్టు 31, 2011న రోశయ్య [[తమిళనాడు]] రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 30 ఆగస్టు 2016 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.
 
"https://te.wikipedia.org/wiki/కొణిజేటి_రోశయ్య" నుండి వెలికితీశారు