[[Image:Ramakrishna math Emblem.jpg|thumb|widthpx]]
'''రామకృష్ణ మఠము''', అనేది 19వ శతాబ్దానికి చెందిన బెంగాల్ సన్యాసికు చెందిన ఆధ్యాత్మికవేత్త [[రామకృష్ణ పరమహంస]] పురుషుల కోసం ఏర్పాటు చేసిన సన్యాసాశ్రమం పేరు. దీనికి అనుబంధ సంస్థయైన [[రామక్రిష్ణ మిషన్]], ఆయన ప్రియశిష్యుడైన [[స్వామీ వివేకానంద]] ఆయన తత్వాలను వ్యాప్తి చేయడానికి స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ.ఈ రెండు సంస్థల ప్రధాన కార్యాలయాలు [[పశ్చిమ బెంగాల్]] లోని బేలూర్ మఠం దగ్గర ఉన్నాయి. రామకృష్ణ మిషన్ ను [[మే 1]], [[1897]]లో స్థాపించడం జరిగింది. ఇవి రెండూ న్యాయపరంగా, ఆర్థిక పరంగా రెండు ప్రత్యేక సంస్థలైనప్పటికీ, చాలా కార్యక్రమాలను కలిసే రూపొందిస్తాయి, కాబట్టి వీటిని జంట సంస్థలుగా పరిగణించవచ్చు. ఈ జంట సంస్థల ప్రధాన లక్ష్యం సర్వమత సామరస్యం, సామాజిక సమానత్వం, వెల్లివిరియడం. జాతి, వర్గ, కుల, మత, ప్రాంతీయ, లింగ భేదాలు లేకుండా మానవాళి సుఖశాంతులతో జీవించడం, మానవుని సర్వతోముఖాభివృద్ధి. దీనికి భారతదేశంలో మరియు విదేశాలలో 166 కార్యాలయ శాఖలున్నాయి.<ref>http://www.belurmath.org/home.htm</ref>
== గురించి==
[[బొమ్మ:RamakrishnamathHyd.jpg.jpg|right|thumb|250px|హైదరాబాదులో గల రామకృష్ణ మఠం]]