వులిమిరి రామలింగస్వామి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
వైద్య శాస్త్రంలో కీలకరంగమైన పాథాలజీలో పరిశోధనలు నిర్వహించిన ఈయన తొలుత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో పాథాలజిస్ట్ గా (1947-54) పనిచేశారు. డిప్యూటీ డైరక్టర్ పదోన్నతి పొంది మూడు సంవత్సరాలు పరిశోధనలు నిర్వహించారు. 1954 లో [[ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్]] లో ప్రవేశించి పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉండి, తమ ప్రతిభాసంపన్నతను చూపారు. [[ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్]] లో ప్రొఫెసర్ ఎమెరిటస్ గా రాణించారు.
 
ప్రొఫెసర్ రామలింగస్వామి రోగ నిదాన శాస్త్రం అభివృద్ధికి అంకిత భావంతొ ఎనలేని సేవలు అందించారు. మన దేశంలో, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో యువ ప్రాయానికి ఎదుగుతున్న పిల్లల్లో విస్తృతంగా వ్యాపిస్తున్న వ్యాధులకు కారణమైన ప్రోటీన్, కాలరీ పోషకాహార లోపం (శరీర కణజాలములకు తగిన మాంసకృత్తులు, శక్తి ప్రమాణములు లోపించుట) అంశం మీద ఉన్నత స్థాయి అధ్యయనాలు, ప్రయోగాలు చేసి పరిష్కార మార్గాలు తెలిపారు. ఈయన పరిశోధనా ఫలితాల ద్వారా [[ప్రోటీన్]] లు, కాలరీల లోపం వలన మానవ శరీరం ఎంతగా ప్రతిస్పందిస్తుందో అవగాహనకు రావడం జరిగింది. [[పోషకాహార లోపం|పోషకాహార]] లోపములకు సంబంధించిన పాథోఝికియాలజీ అంశం మీద సుదీర్ఘ పరిశోధనలు జరిపారు హిమాలయన్ ఎండెమిక్ గొయిత్రి (హిమాలయ ప్రాంతంలో ఎల్లప్పుడూ ప్రబలి ఉంచే [[గొంతు]] కణితి (థైరాయిడ్ గ్రంథి పెరుగుట) వ్యాధి) కు కారణాలు అన్వేషించి, పరిష్కార మార్గాలు తెలిపారు. అయొడైజ్డ్ [[ఉప్పు]] వాడకాన్ని అమలు చేయటమే ఈ తరహా వ్యాధులకు పరిష్కారమని తొలిసరిగా నిర్దేశించారు. ఈయన తమ పరిశోధనలన్నిటి ఆధారంగా 140 కి పైగా పరిశోధనా పత్రాలను వెలువరించారు. వైద్య శాస్త్రానికి సంబంధించిన పలు ప్రామాణిక గ్రంథాలలో కొన్ని అధ్యాయాలను రచించారు. ఈయన మేథా సంపత్తికి, పరిశోధనా ఫలితాలకు దేశ విదేశాలలో నీరాజనాలందాయి.
 
==గౌరవాలు==