దోమా వేంకటస్వామిగుప్త: కూర్పుల మధ్య తేడాలు

43 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
ఆంధ్ర విశ్వ విద్యాలయానికి [[అనకాపల్లి]] వాస్తవ్యులు రేపాక సత్యనారాయణ రచించిన గ్రంథం ఆధారంగా ఈయన “కన్యకాపురణ పరిశీలన” అనే సిద్ధాంత గ్రంథం రాసి “ఎం.ఫిల్” పట్టాని పొందాడు. ఇతని ఉద్యోగపర్వం 1916 వ సంవత్సరంలో ప్రారంభమైంది. కంచి పచ్చయప్ప ఉన్నత పాఠశాలలో, [[మద్రాసు]] క్రైస్తవ కళాశాలలో, [[పెరంబూరు]]లోని కళాశాల, [[విజయవాడ]]లో యస్.ఆర్.ఆర్ సి.వి.ఆర్ కళాశాల మొదలగు చోట్ల [[తెలుగు]] పండితుడిగా, ఆంధ్రోపన్యాసకునిగా పనిచేసాడు. 1933 లో విద్వాన్ పట్టాని పొందినాడు. గుప్త 2-2-1938లో [[మహాత్మా గాంధీ]]ని కలసి తెలుగు భాషకే ప్రత్యేకమైన అవధాన కళ గురించి వినిపించగా అది విన్న మహాత్ముడు, ఆశ్చర్యపడి అవధాన విద్యను అభ్యసించేందుకు శారదోపాసన అవసరమౌతుందని అభిప్రాయ పడ్డాడు.
సాహితీ ప్రముఖులుగా ప్రశస్తిగన్న [[ఉన్నవ లక్ష్మీనారాయణ]], [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]], [[చిలుకూరి నారాయణరావు]], [[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]] మొదలైనవారు ఇతని అవధానసభల్లో అగ్రాసనాధిపులు గానో పరీక్షకులు గానో ఉండి సభలను రంజిపజేసినారు.
[[తిరుపతి వేంకటకవులు]] గుప్త యొక్క విద్యగురువులు. గుప్త చేసే ప్రతి అవధానంలో ప్రారంభంలో ఈ కవుల గురించి ఏదో ఒక [[పద్యము]] చెప్పి గురుస్తుతి చేసేవాడు.
గుప్త తమ జీవిత కాలంలో దాదాపు 49,000 పద్యాలు వ్రాశాడంటే ఎంత ప్రతిభావంతుడో అర్థమవుతుంది.
 
==అవధాన ప్రస్థానం==
ఇతడు తన 16 యేటనే [[అవధానాలు]] చేయడం ప్రారంభించాడు. ఇతడు సుమారు 300 అష్టావధానాలు, శతావధానాలు నిర్వహించాడు. ఇతడు చేసిన అవధానాలలో [[గుంటూరు]] ఆవధానాలు, [[చీరాల]] అవధానం, జాండ్రపేట అవధానం, [[చెన్నై|మద్రాసు]] అవధానం, [[రాజమండ్రి]] అవధానం ముద్రించబడ్డాయి. ఇతర అవధానాలలోని పద్యాలను సుపద్యమంజరి అనే పేరుతో ప్రకటించాడు<ref name="అవధాన సర్వస్వము">{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యాసర్వస్వము|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=165-170|edition=ప్రథమ|accessdate=23 July 2016|chapter=అవధాన విద్యాధరులు}}</ref>.
 
ఇతడు పూరించిన కొన్ని అవధాన పద్యాలు:
2,07,767

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2092459" నుండి వెలికితీశారు