పువ్వుల సూరిబాబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
సూరిబాబు 1931 సంవత్సరంలో బాలకృష్ణ నాటక సమాజాన్ని [[గుడివాడ]]లో స్థాపించి భక్త విజయం, మాయా మధుసూదన నాటకాలను పెద్ద ఎత్తున ప్రదర్శించారు. నష్టాలతో సమాజం మూతపడింది. 1936లో [[తెనాలి]] చేరి సత్యనారాయణ నాట్యమండలి పేరుతో నాటకాలను ప్రదర్శించారు.
 
1944 సంవత్సరంలో నటీమణి రాజరాజేశ్వరిని [[పెళ్ళి|వివాహం]] చేసుకొని ఆమె పేరుమీద [[రాజరాజేశ్వరి నాట్యమండలి]]ని స్థాపించి కొప్పరపు సుబ్బారావు గారితో "తారా శశాంకం" నాటకాన్ని వ్రాయించి తానే [[దర్శకత్వం]] వహించి చనిపోయేవరకు 15 వందలకు పైగా నాటకాలు ఆంధ్రదేశమంతా ప్రదర్శించారు. ఇది కాక [[భూకైలాస్]], [[కురుక్షేత్రం]], [[విప్రనారాయణ]], [[తులాభారం]] మొదలైన పౌరాణిక నాటకాలను భారతదేశమంతా ప్రదర్శించి అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించారు.
 
వీరు చాలా విభిన్నమైన పాత్రలను పోషించారు. వాటిలో [[నారదుడు]], [[కంసుడు]], [[ధర్మరాజు]], [[విప్రనారాయణ]], బిల్వమంగళుడు, భవానీశంకరుడు, రాజరాజు, సుబుద్ధి, రామదాసు, చినరంగారావు, ధర్మారాయుడు మొదలైనవి ముఖ్యమైనవి. ఎన్ని నాటకాలాడినా, ఆయన గాత్రం కంచు గంటలా మారుమ్రోగేది. మైక్ లేకపోయినా ఒక ఫర్లాంగు దూరం వరకు పద్య పఠనము, వాచిన విధానము క్లియర్ గా వినపడేవి. పద్యాన్ని భావయుక్తంగా విరిచి పాడడంతో ప్రేక్షకులను అవలీలగా ఆకట్టుకొనేవారు.
 
1946లో [[మైసూరు]] మహారాజావారి దర్బారులో వీరి నాటకాలను ప్రదర్శించి సన్మానం పొందారు. 1957లో [[తెనాలి]]లో సూరిబాబుకి గజారోహణం, [[గండపెండేరం]] మొదలైన సన్మానాలు జరిపి ''కళావిశారద'', ''గాన గంధర్వ'' మొదలైన బిరుదులు అందుకున్నారు.
 
భారతదేశమంతా అపార ఆదరాభిమానాలను సంపాదించిన [[సూరిబాబు]] [[ఫిబ్రవరి 12]], [[1968]] న స్వర్గస్తులైనారు.
"https://te.wikipedia.org/wiki/పువ్వుల_సూరిబాబు" నుండి వెలికితీశారు