యాతగిరి శ్రీరామ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
 
==ఆంధ్రకేసరి యువజన సమితి స్థాపన==
సహకారశాఖలో ఉద్యోగంచేసిన శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు 1962లో [[ఆంధ్రకేసరి]] యువజన సమితి ప్రారంభించారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారంటే అమితంగా ఇష్టపడే శ్రీ నరసింహారావు ఆయన పేరుతోనే సమితిని నెలకొల్పారు.ఎన్నో సేవాకార్యక్రమాలకు సమితి వేదిక అయింది. [[కుష్టువ్యాధి వ్యతిరేకపోరాటం|కుష్టువ్యాధి]] నివారణ పధకాన్ని 10 ఏళ్ళపాటు నిర్వహించిన సమితి సాంస్కృతిక వికాసానికి, విద్యాబివృద్దికి, సాంస్కృతిక పరిరక్షణకు కృషిచేస్తూ వచ్చింది. ఇందుకోసం ఎన్నో ఉద్యమాలను కూడా నడిపింది. వీటన్నింటికీ శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు మార్గనిర్దేశనం చేస్తూ వచ్చారు. 35గ్రామాల్లో ఈపధకాన్ని సమర్ధవంతంగా అమలు చేసినందుకు సమితి సంస్థాపకునిగా న్యూడిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఆనాటి ప్రధాని శ్రీమతి [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధి]] నుంచి 1968లో సత్కారం అందుకున్నారు.రాళ్ళబండి సుబ్బారావు [[సంగ్రహాలయం|మ్యూజియం]] ప్రభుత్వపరం కావడంలోనూ, సిటీ మున్సిపల్ హైస్కూల్ విషయంలోనూ, గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయం తదితర అంశాలలో సమితిని పోరాటదిశగా నడిపించారు.
==ఆంధ్రకేసరి విద్యాసంస్థల స్థాపన==
#ఇది చాలా యాదృచ్ఛికంగా జరిగిందనే చెప్పాలి.అప్పటికే సమితి కార్యక్రమాలకు ఊతమిస్తూ వచ్చిన ఆనాటి కేంద్రమంత్రి శ్రీ పి.వి.నరసింహారావు సమితి గౌరవ సభ్యులుగా సభ్యత్వం స్వీకరించారు.అప్పట్లొ జూనియర్ కాలేజీల కొరత వుండడం, వి.టి.కళాశాలలో బిల్డింగ్ ఫండ్ వసూలు చేస్తున్న కారణంగా సమితి ఉద్యమం చేపట్టింది.అప్పుడు ముఖ్యమంత్రిగా[[ముఖ్యమంత్రి]]<nowiki/>గా వున్న శ్రీ పి.వి.ఆంధ్రకేసరి ప్రకాశం శతజయంతి కార్యక్రమానికి కూడా వచ్చారు.సమితి తరపున కాలేజీ పెట్టమని సూచిస్తూ, కార్పస్ ఫండ్ కట్టక్కర్లేకుండా అనుమతి ఇచ్చారు.దీంతో అప్పటివరకూ సేవా కార్యక్రమాలు, ఉద్యమాలు చేస్తూ వచ్చిన సమితి తరపున కాలేజీ పెట్టించి, దిగ్విజయంగా నడుపుతున్నారు. 1972-73లో ఆంధ్రకేసరి శతజయంత్యత్సవ జునియర్ కళాశాల (ఎకెసి కాలేజీ) ఏర్పడితే, సొంత భవనాలను సమకూర్చుకుంది.ఆనాటి సమితి ప్రెసిడెంట్ ఎం ఎన్ చారి కృషి కీలకం. ఇక 1994 ఆగస్టు23న జూనియర్ కళాశాల పక్కనే డిగ్రీ కళాశాలను కళాప్రపూర్ణ వావిలాల గోపాలకృష్ణయ్య ప్రారంభోత్సవం చేసారు.ఎయిడెడ్ కళాశాలలు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ శ్రీ వైఎస్ఎన్ సమయస్ఫూర్తితో నిరాటంకగా నడుస్తున్నాయి.
==రాష్ట్రపతులు-ఫ్రధానులతో అనుబంధం==
అది యాదృచ్ఛికమో ఏమో గానీ ఇంచుమించు చాలామంది రాష్ట్రపతులు, ప్రధానులతొ అనుబంధం శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావుకి వుండడం విశేషం. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంధ్రప్రసాద్ 1955లో [[విజయవాడ]] మున్సిపల్ హైస్కూల్ లో హిందీ ప్రేమీమండలి ఉత్సవాల్లో మాట్లాడుతుంటే శ్రీ వైఎస్ఎన్ చూసారు. ఇక 1962 సెప్టెంబర్-అక్టోబర్ లలో రెండునెలల పాటు జరిగిన సహకార శిక్షణ పొందిన శ్రీ వైఎస్ ఎన్ నాయకత్వంలో ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ని కలుసుకున్నారు. అలాగే 1962లో ఆనాటి ఉప రాష్ట్రపతి శ్రీ జాకీర్ హుస్సేన్ ని ఆయన అధికార నివాసంలో, 1970లో ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ని రాష్ట్రపతి భవన్ లో కలుసుకున్నారు. అఖిల భారత కుష్టు నివారణ సంఘ్ కార్యవర్గ సమావేశం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ అధ్యక్షతన 6ఆగస్టు1983లో జరగ్గా సమితి పక్షాన శ్రీ వైఎస్ఎన్ హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి శ్రీ [[నీలం సంజీవరెడ్డి]] ముఖ్యమంత్రిగా ఉండగా, 1957 ఏప్రియల్ లో రాజమండ్రి ట్రావెలర్స్ బంగ్లాకు వచ్చినపుడు భారత్ సేవక్ సమాజ్ పట్టణ కార్యదర్శిగా వున్న శ్రీ వైఎస్ఎన్ కలుసుకుని వినతిపత్రం అందించారు. అలాగే భారత తొలిప్రధాని నెహ్రూ రాజమండ్రి ఎన్నికల ప్రచారానికి 1951డిశెంబర్లో వచ్చినపుడు చూసారు.ఇక మాజీ ప్రధాని ఇందిరా గాంంధితో డిల్లీలో సన్మానం అందుకున్నారు. ఇక మాజీ ప్రధాని పి.వి.అయితే సమితి శాశ్వత సభ్యులు కావడంతో అనుబంధం చివరివరకూ కొనసాగింది.
==స్వాతంత్ర్య సమరయోధురాండ్ర పార్కు==
ఒకరా ఇద్దరా ఏకంగా 12మంది మహిళా స్వాతంత్ర్య సమరయోధురాండ్ర పార్కుని [[రాజమండ్రి]] పాల్ చౌక్ (ఇన్నీసుపేట) లో నెలకొల్పి, విగ్రహాలు ఏర్పాటుచేయించడంలో శ్రీ వై.ఎస్.ఎన్.చూపిన చొరవ అద్వితీయం. శిలాఫలకాలపై మహిళా సమరయోధుల గురించి లిఖించారు.శ్రీ వై.ఎస్.నరసింహారావు 25 సంవత్సరాలపాటు శ్రీ [[కందుకూరి వీరేశలింగం పంతులు|కందుకూరి వీరేశలింగం]] టౌన్ హాలు ట్రస్ట్ బోర్దు కార్యదర్శిగా సేవలందించారు.టౌన్ హాలు జూబ్లి పబ్లిక్ లైబ్రెరీ అభివృద్ధికి కృషి చేసారు. టౌన్ హాలులో పుస్తక ప్రదర్శనలు నిర్వహించారు.
 
==ఇండియా ఇండిపెండెన్స్ సెంటర్==
అంతేకాదు పార్కుని ఆనుకుని ఇండియా ఇండిపెండెన్స్ సెంటర్ నెలకొల్పిన శ్రీ వైఎస్ఎన్, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలు, వాడిన వస్తువులు అన్నీ సేకరించి అందులో ఏర్పాటుచేయిస్తున్నారు. ఇంకం టాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ మేడిశెట్టి తిరుమలకుమార్ తోకల్సి'మనవావిలాల'పుస్తకం రచించారు. రాజమహేంద్రి నగరానికి సంబంధించి అన్ని విషయాలు క్రోడీకరించి, క్విజ్ మాదిరిగా "నృసింహ ప్రశ్నోపనిషత్" పేరిట 'సమాచారమ్'స్థానిక దినపత్రికలో ధారావాహికంగా అందించిన ప్రశ్నలు-జవాబులు పుస్తక రూపంలోకి తెచ్చారు. ప్రస్తుతం3వముద్రణ అయింది.ఆలాగే శ్రీ యాతగిరి శ్రీరామనరసింహారావు ధారావాహికంగా రాసిన "గుర్తుకొస్తున్నాయి"శీర్షిక ఆతర్వాత"నరసింహావలోకనం" (స్వీయచరిత్ర) పుస్తకంగా రూపుదిద్దుకుంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఎపి నూతన రాజధాని 2015లో తొలిసారి [[తుళ్ళూరు]]లో జరిగిన [[ఉగాది]] ఉత్సవంలో ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకున్నారు.
==అశీతి ఉత్సవం==
11వ శతాబ్దంనాటి శ్రీ లక్ష్మినరసింహస్వామి విగ్రహంగల ఉత్తరాదిమఠానికి అధికారిగావున్న శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు 80 వ పుట్టినరోజు (అశీతి) సందర్భంగా 2016అక్టోబర్ 1శనివారం రాత్రి గోదావరిగట్టు టి.నగర్ శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవాసమితి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు శ్రీ బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఎంపీ శ్రీ [[మాగంటి మురళీమోహన్]], ఎం.ఎల్.సి.లు శ్రీ సోము వీర్రాజు, ఆదిరెడ్డి అప్పారావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.సారథ్య సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ ఫణి నాగేశ్వరరావు స్వాగతం పలికారు. సారథ్య సంఘ అధ్యక్షులు డాక్టర్ కర్రి రామారెడ్డి దాదాపు 40నిమిషాలసేపు శ్రీ వైఎస్ జీవన రేఖలపేరిట రూపొందించిన మల్టీమీడియా ప్రదర్శన ఇచ్చారు.
==తనకన్నా పెద్దవాళ్లకు సత్కారం==
ఇక ఈ వేడుకలో తనకన్నా పెద్దవాళ్ళైనా మాజీ ఎం.ఎల్.ఏ శ్రీ చిట్టూరి ప్రభాకరచౌదరి (95 సంలు), స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ ముళ్ళపూడి సూర్యనారాయణ (93 సంలు, వైద్యులు డాక్టర్ పెద్దింటి సీతారామ భార్గవ (92 సంలు, విద్యావేత్త ఆచార్య జోస్యుల సూర్య ప్రకాశరావు (89 సంలు), సీనియర్ న్యాయవాది శ్రీ పోతుకూచి సూర్యనారాయణ మూర్తి (87 సంలు, నాణాల సేకరణ కర్త శ్రీ పేరిచర్ల సూర్యనారాయణరాజు (84 సంలు), ఆడిటర్ శ్రీ ద్రోణంరాజు సుందర రామారావు (81సంలు) లను శ్రీ వై.ఎస్.ఎన్. సత్కరించారు. శ్రీ యాతగిరి రవితేజ సహకరించారు.
 
==ప్రత్యేక సంచిక ఆవిష్కరణ==
[[తెలుగు వెలుగు]] డాక్టర్ అరిపిరా ల నారాయణరావు సంపాదకత్వంలో శ్రీ వైఎస్ నరసింహారావు పై రూపొందించిన ప్రత్యేక సంచికను ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్; శ్రీ వైఎస్ రచించిన నృసింహ ప్రశ్నఉపనిషత్ తృతీయ ముద్రణను మాజీ ఎంపీ శ్రీ ఉండవల్లి అరుణకుమార్, స్వాతంత్ర్య సమరంలో వీరవనితలు పుస్తకాన్ని మాజీ ఎం ఎల్ ఏ శ్రీ కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. శ్రీ వైఎస్ నరసింహారావు గురించి డాక్టర్ అరిపిరాల నారాయణరావు రచించిన ఎదురీత పుస్తకాన్ని అశీతి ఉత్సవ సారథ్య సంఘ గౌరవ అధ్యక్షులు పురప్రముఖులు శ్రీ డి బి వేంకటపతి రాజు, ఆవిష్కరించారు. ఇన్ కంటాక్స్ ప్రిన్సిపాల్ కమీషనర్ శ్రీ మేడిశెట్టి తిరుమల కుమార్ ఇన్ కం టాక్స్ ప్రిన్సిపాల్ కమీషనర్ శ్రీ జి.వి.గోపాలరావు, సుప్రసిద్ధ సాహితీ వేత్త శ్రీ రాపాక ఏకాంబరాచార్యులు, మాజీ ఎం.ఎల్.సి. శ్రీ కందుల దుర్గేష్, సారథ్య సంఘం గౌరవ మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి, భారత భారతి ఆచార్య శలాక రఘునాధ శర్మ, ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షురాలు శ్రీమతి కోసూరి చండీప్రియ, సారథ్య సంఘ కోశాధికారి శ్రీ పొలసానపల్లి జగ్గారావు, ఆతిధ్య సంఘ సభ్యులు- కార్పొరేటర్ శ్రీ మాటూరి రంగారావు, కార్పొరేటర్ శ్రీ కొమ్మా శ్రీనివాసరావు, ప్రకాశం జాతీయ పరిషత్ కార్యదర్శి శ్రీ భయపుర్నేని సూర్యనారాయణ వేదికపై ఆశీనులయ్యారు.ఆంధ్రకేసరి సంస్థల సభ్యులు, ప్రముఖులు, శ్రీ వై.ఎస్.ఎన్. కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ నరసింహారావుని పలువురు ఘనంగా సత్కరించారు.
 
==మూలాలు==