రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 80:
'''రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు''' [[పిఠాపురం]] సంస్థానాన్ని పరిపాలించినవారిలో చివరివాడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1885]], [[అక్టోబర్]], 5 న మంగాయమ్మ, రావు వేంకట మహీపతి గంగాధర రామారావు దంపతులకు జన్మించాడు. ఇతనికి ఐదు సంవత్సరాల వయసు వచ్చే సమయానికి ఇతని తండ్రి మరణించాడు. అప్పుడు గంగాధర రామారావు దత్తపుత్రుడు ఇతడు వారసుడు కాడని, రాజ్యాధికారం తనదే అని కోర్టుకు ఎక్కాడు. ఈ వ్యాజ్యం ఎక్కువ రోజులు నడిచి చివరకు విజయలక్ష్మి ఇతడినే వరించింది. ఈ వ్యాజ్యం కోర్టులో[[న్యాయస్థానము|కోర్టు]]<nowiki/>లో ఉన్నంతకాలం, అనంతరం ఇతనికి మైనారిటీ తీరేవరకు ఈ సంస్థానం కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అధీనంలో ఉన్నది. ఈ సమయంలో ఇతడు [[మద్రాసు]] లోని న్యూయింగ్టన్ కళాశాలలో ఉండి విద్యాభ్యాసం చేశాడు. ఈ సమయంలోనే [[సంస్కృతం]] , [[తెలుగు]], [[కన్నడం]], [[తమిళం]], [[ఆంగ్ల]] భాషలను నేర్చుకుని ఈ ఐదు భాషలలో ఉత్తమ గ్రంథాలను పఠించాడు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో [[కవిత్వం]] చెప్పగలిగే నేర్పును సంపాదించాడు. తర్వాత [[నూజివీడు]] సంస్థానాధిపతియైన రాజా వెంకటరంగయ్యప్పారావు ప్రథమ పుత్రిక అయిన ఆండాళమ్మను [[1906]], [[ఏప్రిల్ 2]] న వివాహం చేసుకున్నాడు. వంశాచారమును బట్టి ఆండాళమ్మ అత్తింటికి వచ్చిన వెంటనే చిన్నమాంబాదేవిగా తన పేరును మార్చుకున్నది. తర్వాత [[1907]], [[ఫిబ్రవరి 19]] న [[పిఠాపురం]] సంస్థానపు సింహాసనాన్ని అధిష్టించాడు. [[1948]] లో సంస్థానాలు, జమీందారీ వ్యవస్థ రద్దయ్యే వరకు ఇతడు పిఠాపురం మహారాజుగా వెలుగొందాడు. ఇతడికి చిన్నమాంబాదేవి ద్వారా మొదట [[1910]] లో గంగాధర రామారావు అనే పుత్రుడు జన్మించాడు. తర్వాత వారికి సూర్యారావు అనే కుమారుడు, మంగయమ్మ, భావయమ్మ, సీతాదేవి, కమలాదేవి అనే కుమార్తెలు కలిగారు. ఇతని కుమార్తె సీతాదేవి బరోడా సంస్థానపు మహారాణి అయ్యింది. [[1933]], [[మార్చి 12]] న రాణీ చిన్నమాంబాదేవి అగ్నిప్రమాదంలో మరణించిన పిదప ఇతడు సావిత్రీదేవిని వివాహం చేసుకుని రామ రత్నారావు అనే పుత్రుడికి జన్మనిచ్చాడు. ఇతడు 79 సంవత్సరాలు జీవించి [[1964]], [[మార్చి 6]] వ తేదీన మరణించాడు.
 
==దాతృత్వం==