మాల్గుడి కథలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
B.K.Viswanadh (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నారయణ → నారాయణ, నంకు → నానికి , తో → తో , శ్రద్ద → శ్రద్ధ, using AWB |
||
పంక్తి 1:
[[File:Malgudi kathalu.jpg|thumb|right|250px|మాల్గుడి కథలు-పుస్తకముఖచిత్రం]]
'''మాల్గుడి కథలు '''అనే కథాసంకలనపుస్తకం ప్రముఖ
భారతీయజాతికిచెంది, ఆంగ్లంలో సాహిత్యరచనకావించి, పేరుప్రఖ్యాతులు గడించిన ముగ్గురు రచయితలలో ఆర్.కె.నారాయణ్ ఒకరు.మిగతా ఇద్దరు '''ముల్క్ రాజ్ఆనంద్ ''', మరియు '''రాజారావు ''' ఈయన కథలను, నవలను ఆంగ్లంలో వ్రాసినప్పటికి, చదవటానికి ఎంతో సొగసుగా వుంటాయి ఈయన రచనలు.ఇతనికథలలోని పాత్రలు ప్రతి నిత్యం మనకు తారసపడెవే.అంతో ఇంతో వాటితో, వారితో మనకు పరిచయముంటుంది. కాకపోతే ఆవ్యక్తులజీవితపు లోతులలోకి మనకంటే లోతుగా తొంగిచూసి, అప్పటివరలు మనం చూడని మరోలోపలి వ్యక్తిత్వాన్ని మనముందు ప్రత్యక్షింపచేస్తాడు రచయిత.కథలలోని ప్రతిపాత్ర ఎదోఒకసంక్షోభాన్ని ఎదుర్కొం టుంది. అలాఎదుర్కొన్న సంక్షోభాన్ని ఆపాత్రకొన్ని సార్లు పరిష్కరించుకుంటుంది.కొన్ని సార్లు సమాధానపడుతుంది.నారాయణ్ కథలలోని పాత్రలు ఒకమనిషి వ్యక్తిత్వం యొక్క ఒక ప్రేరణకు సంబంధించి లేదా ఒక పరిస్థితికి సంబంధించినది అయ్యిండవచ్చును.
==ఆర్.కె.నారాయణ్==
నారాయణ్ పూర్తిపేరు '''రాసిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి'''.జననం అక్టోబరు 10,1906
రచయిత గురించి మరింత సమాచారానికై ప్రధాన వ్యాసం;'''[[ఆర్.కే. నారాయణ్]] చదవండి.
==అనువాద రచయిత్రి- డా.సి.మృణాళిని==
ఆర్.కె.నారాయణ్ ఆంగ్లంలో వ్రాసిన '''మాల్గుడి డేస్ '''కథాసంకలమును రసరమ్యంగా,
మృణాళిని ఉన్నతవిద్యావేత్త. [[తెలుగు]], [[ఇంగ్లీషు]], మరియు విమెన్స్టడిస్లో ఏం.ఏ (M.A) పట్టభద్రురాలు. తెలుగులో పి.హెచ్.డి.చేసారు. వీరు ఇప్పటివరకు 12 పుస్తకాలను ప్రచురించారు. కొన్నివందల సదస్సులలో పాల్కొని పత్ర సమర్పణ చేశారు. వీరి రచనలలో కొన్ని
*కోమలి గాంధారం (కథల సంపుటి)
*తాంబులం (సోషల్ సెటైర్)
*గుల్జార్ కథలు (అనువాదం)
* దిమాంక్ హూ సీల్డ్ ఫెరారీ (తెలుగు అనువాదం) మొదలైనవి.
సాహిత్యం, మహిళా అధ్యయనం, మీడియాలు మృణాళిని గారి అభిమాన విషయాలు.ప్రస్తుతం (2012 నాటికి) [[హైదరాబాద్]] లోని[[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] తులనాత్మక ఆధ్యయన కేంద్రంలో ప్రోఫెసరుగా, కేంద్రాధిపతిగా పనిచేస్తున్నారు.
==మాల్గుడి కథలు==
ఈపుస్తకంలోని కథలు '''[[మాల్గుడి]]'''అనే వూరును కేంద్రంగా చేసుకొని, ఆవూరిలోని ప్రజలజీవితంలోని సంఘటనలను ఆధారంచేసుకొని కథలల్లబడ్డాయి. రచయిత చెప్పినదానిప్రకారం ఈ మాల్గుడి అనేది తన కథలలోని కల్పితపాత్రలలా, సంఘటనలలా, తన ఊహాలనుంచిపుట్టిన కల్పిత నగరం.రచయిత మనోభావం ప్రకారం మాల్గుడి లాంటి నగరం, దానిలోని వీథులవంటివి, అందులో కనిపించే జనులు ఎక్కడైన చూడగల్మంటాడు.ఉదాహరణకు తాను [[1959]] నుంచి అప్పు డప్పుడూ నివసిస్తూవచ్చిన వెస్ట్ ట్వేంటి థర్డ్ స్ట్రీట్లో మాల్గుడి లక్షణాలున్నాయంటాడు ఆర్కే.నారాయణ్. మాల్గుడి డేస్ లోని ఈ వూరు ప్రపంచంలోని పాఠకులను ఎంతప్రభావితంచేసిందంటే, చికాగో విశ్వవిద్యాలయంప్రెస్సు ఒక సాహిత్యపత్రాన్ని చిత్రించి
ఆచార్య సి.మృణాళిని అనువాదంచేసిన, ఆర్కె, నారాయణ్ విరచితమైన ఈ పుస్తకంలో మొత్తం 32 కథలున్నాయి. అందులో మొదటి 16 కథలు '''జ్యోతిష్కుడి జీవితంలో ఒకరోజు ''' సంకలమునుండి, మరో ఎనిమిది కథలు '''లాలీరోడ్ '''సంకలమునుండి, చివరి ఎనిమిది కథలు '''అనంతర కథలు '''కథల సంకలమునుండి తెలుగులోకి అనువాదమొనర్చబడినవి.
'''అనువాదపుసక్తములోని కథలు '''
1.జ్యోతిష్యుడి జీవితంలో ఒకరోజు,2.తప్పిపోయిన ఉత్తరం,3.వైద్యుడిమాట,4.కాపదారు కానుక,5.గుడ్డికుక్క,6.ఆగంతకుడు,7.పులిపంజా,8.ఈశ్వరన్,9.పరిపూర్ణత!,10.తండ్రి సాయం,11.పాముకాటు,12.ఇంజను లోపం,13.నెలకు నలబై అయిదు,14.వ్యాపారం పోయింది,15.అత్తిలా,16.కత్తి,17.లాలీ రోడ్,18.ఆకుపచ్చనికోటు వెంట...,19.అమరజీవుల నెలవు,20.భార్య సెలవు,21.నీడ,22.ప్రియమైన బానిసత్వం,23.లీల స్నేహితుడు,24.తల్లీ కొడుకు,25.నాగా,26.సెల్వి,27.మరో అభిప్రాయం,28.పిల్లిదయ్యం,29.కొన,30.దేవుడూ, చెప్పులుకుట్టేవాడూ,31.ఆకలిగొన్న పిల్లవాడు,32.ఎమ్డెన్.
==మాల్గుడి కథలగురించి-టూకీగా==
*'''జ్యోతిష్కుడి జీవితంలో ఒక రోజు ''':ఎ న్నో ఏళ్ళక్రితం, ఈజ్యోతిష్కుడు, 200 మైళ్ళ అవలనున్న వూరినించి వచ్చాడు మల్గుడికి జ్యోతిష్యం రాకపొయిన తన మాటల చాతుర్యంతో, తెలివితేటలతో ప్రజలను మాయపెట్టి, మభ్యపెట్టి జీవనం కొనసాగిస్తున్నాడు. తన వూరినింఛి హఠాత్తుగా ఎందుకొచ్చాడో, అ జ్ఞాతంగా బ్రతుకుతున్న విషయం ఎవ్వరికి తెయదు. ఒకరోజు సాయంత్రం, చిక్కట్లు కమ్మిన వేళ తనవద్దకు జాతకం చెప్పించుకోవటానికి వచ్చిన వ్యక్తిని చూసి అవాక్కు అవ్వుతాడు. ఎవ్వరావ్యక్తి? ఏమిటాకథ?
*'''తప్పిపోయిన వుత్తరం''':ఇప్పుడంటే అంతా '''సెల్లు'''మయం.ఎవ్వరిచేతిలో చూసిన పిడెకెడంత సెల్లు చేసే హంగామా అంతాఇంతాకాదు.శుభమైన, అశుభమైన, అవసరమైన, అనవసరమైన అంతా సొల్లు సెల్లుమయమే. ఇందుగలదు, అందులేదని సందేహం వలదు, ఎందెందు చూసిన అందందే చెవికి అతుక్కుపోయి సెల్లుదర్సనమిస్తుంది.కాని 50-60సంవత్సరాలక్రితం ఒకరినుంచి మరొకరికిసమాచారాన్ని చేరవేసె ఉత్తమసాధనము '''వుత్తరము '''.అప్పటికి టెలిఫొనులు సామాన్యులకు అందుబాటులో లేనిరోజులవి.పేదవాడైన, పెద్దవాడైన సమాచారం కావాలన్నా, పంపాలన్నా తపాలే ఆధారం.అండుకే అప్పుడు ఇంటింటికి వుత్తరాలను చేరవేసె తపాలా మనిషి/పోస్ట్మాన్ (post man), ప్రతి ఇంటివారికి అవసరమైనవాడే.ప్రతిరోజు పోస్టుమేన్ వచ్చెసమయానికి అప్తుడయ్యిన మనిషికై చూసినట్లు ఎదురుచూసేవారు.పోస్టుమేన్ కూడా అలాగే గ్రామస్తులతో కుటుంబ సభ్యుడులా మెలిగేవాడు.శుభవార్తతెచ్చినప్పుడు వారిసంతోషంలో తాను పాలుపంచుకొనేవాడు, అశుభవార్త అయ్యినచో వారితోపాటూ తాను దుఃఖంలో పాలుపంచుకొనేవారు.ఈ కథలోని పోస్టుమేన్ కూడా అచ్చు ఆలాంటి వాడే.అంతరితలలో నాలికలా వుండేవాడు.ముఖ్యంగా మల్గుడిలోని, వినాయకవీధిలోని 10వ నెంబరు ఇంటిలోని
*'''వైద్యుడి మాట ''':మాటే మంత్రం.అవును నిజం.ఒకవ్యక్తిని గాఢంగా విశ్వసించినప్పుడు,నమ్మినప్పుడు ఆవ్యక్తి చెప్పెమాట నమ్మినవ్యక్తిమీద,మనస్సుమీద ప్రభావం చూపిస్తుంది.భారతంలో ద్రోణాచార్యులకు ధర్మరాజు అబద్ధము చెప్పడని పూర్తినమ్మకము.అందుకే రణభూమిలో ధర్మరాజు "ఆశ్వథామా హతః.." అనిఅనగానే ద్రోణుడు అస్త్రసన్యాసంచేసాడు.అతరువాత ధర్మరాజు "కుంజర"అంటూ అసత్యమాడినదోషం నుండి తెలివిగా తప్పించుకున్నాడు.ఈ కథలోని డాక్టరు రామన్ కూడా అబద్ధము పలకడు.తనవద్దకు వచ్చేరోగులను వారికున్న రోగతీవ్రతను బట్టి,ముందే నిజం చెప్పేవాడు.అందుకే ఆ డాక్టరు అబద్ధమాడడని అందరి నమ్మకం. అదినిజం కూడా.అలాంటి డాక్టరుకూడా అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.భారతంలో ధర్మరాజు స్వార్థంతో అబద్ధంచెప్పి,తనప్రియమైన గురువు మరణానికి కారణమైతే,ఇక్కడ డా.రామన్ మరణించే స్థితిలో వున్న తన మిత్రుని రక్షించెటందుకు,అతనిలో ఆత్మవిశ్వాసం కలిగించేటందుకు " నీకేమి కాదు, నీఆరోగ్యానికి ఏప్రమాదంలేదని" మొదటి సారి అబద్ధం చెప్తాడు.డాక్టరు మీద ఆపారనమ్మకమున్న అతని మిత్రుడు, డాక్టరే ఆశ్చర్యపడెలా ఆరోగ్యవంతుడవ్వుతాడు.మాటకున్న అపారశక్తి ఇది.
*'''గుడ్దికుక్క ''':ప్రపంచంలో అత్యంత విశ్వాసంచూపే పెంపుడుజంతువు ఏదని ప్రశ్నిస్తే అందరు ముక్తకంఠంతో చెప్పెపేరు '''కుక్క '''.అవును; ఇది అక్షరసత్యం. కాని ఈ కుక్కవిశ్వాసమే ఒకవూరకుక్కను ఎలా శాశ్విత బానిసత్వంలోకి నెట్టింది వివరించే కథ.నిజం! ఒక్కొసారి
*'''అగంతకుడు ''':ఈకథ అప్పుడేకాదు ఇప్పుడు కూడా నిత్యంజరిగే కథే.ఎక్కడంటరా?రైలులోని జనరల్ కంపార్ట్మెంటులో అనునిత్యం జరిగే సీటుకై పోరాటం.ముందెక్కినవారు సీటుఆక్రమించి కూర్చున్నతరువాత ఆతరువాత వచ్చే ప్రయాణికులు సీటుకై బుజ్జగింపులు, వేడికోలు, అర్థింపులు, ఆపై బెదరింపులు, చొక్కాచేతులు మడవటాలు, మీసాలు దువ్వటాలు, చూసుకుందామా?అంటే; ..చూచుకుందాం...ఇవన్ని..ఆనాడు ఈనాడు షరామాములే!
*'''ఈశ్వరన్ ''': అదిజూన్నెల.ఆ రోజు మాల్గుడి ఊరుఊరంతా ఆతురతాగా ఎదురు చూస్తున్నారు ఇంటర్మిడియట్ ఫలితాలకై, ఒక్క ఈశ్వర్ తప్ప.ఈశ్వర్ కూడా పరీక్ష వ్రాసాడు, కాని ఫలితానికై ఆతృతలేదు. ఎందుకంటె ఇప్పటికే ఎన్నోసార్లు ఇంటర్మీడియేట్ పరీక్ష వ్రాయడం, తప్పడంమాములై పోయింది.అందుకే అందరు ఫలితాలకై ఎదురుచూస్తుంటే, తనఫలితమేమిటో తనకుముందే తెలుసుకాబట్టి, ఏ టెన్షను లేకుండాగా సినిమాకెళ్ళాడు వరుసపెట్టి రాత్రి రెండో ఆటవరకు చూశాడు.అటుతరువాత ఇంటికెళ్లటానికి మనసొప్పక సరయు నదివడ్డుకు చేరుతాడు.తనమీద తనకే అసహ్యంవేసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని, ఆలా వుత్తరంవ్రాసింకోటుజేబులోపెట్టి, కోటును ఒడ్డునపెట్టి, మరణించటానికి సిద్ధమై, మరణించేముందు చివరిసారిగా స్కూలును, చూడాలనిపించి, స్కూలుదగ్గరకు వెళ్తాడు.నోటిసుబోర్డులో తాను సెకండు శ్రేణిలో పాసు అయ్యినట్లు తెలుసుకొని ఆనందంతో గుర్రపుస్వారీ చేస్తున్నట్లు ఉహించుకుంటూ గెంతుతూ, గెంతుతూ వెళ్ళి పొరపాటున సరయునదిలో పడిపోతాడు.ఉదయంశవమై అయినవాళ్ళకు కనిపిస్తాడు.
*
|