కలుపు మొక్క: కూర్పుల మధ్య తేడాలు

223.182.98.187 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2033510 ను రద్దు చేసారు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సబ్యు → సభ్యు, చేసినది. → చేసింది. using AWB
పంక్తి 5:
గింజలు ముదిరాక [[ఎలుకలు]] బాధ మరొకటి వుంది. ఎలుకలు గట్టుల్లో [[బొరియ]]లు చేసుకొని రాత్రి వేళల్లో వరి కంకులను కొరికి తమ బొరియల్లో దాచు కుంటాయి. ఈ విధంగా కూడా రైతుకు పంట నష్టం. ఎలుకలను చంపడానికి ఈ రోజుల్లో ప్రభుత్యం ఉచ్చులను, విషపు బిళ్లలను సరపరా చేస్తున్నది. ఇంకా కొన్ని నివారణ మార్గాలను ప్రచారం చేస్తున్నది. కాని ఆ రోజుల్లో [["ఇర్ల వాళ్ళు"]] ఎలుకలను పట్టడాని పలుగు, పార, చిన్న గునపం తీసుకొని పొలాల వెంబడి సతీ సమేతంగా తిరుగుతూ [[ఎలుక బొరియ]] కనబడితె అందులోకి [[పొగ పెట్టి]] త్రవ్వి ఎలుకలను పట్టి, అవి ఆ బొరియల్లో దాచి పెట్టిన వరి కంకులను చేజిక్కించుకునే వారు. పొగ పెట్టడాన్ని "ఊదర పెట్టడం" అంటారు. ఒక చిన్న మట్టి కుండకు కింది వైపున చిన్నని రంధ్రం చేస్తారు. ఆ కుండలో పిడకలు కొన్ని వేసి నిప్పుపెట్టి దాని నిండుకు కొంత గడ్డిని, పచ్చి ఆకులను వేసి కుండ మూతిని ఎలుక బొరియకు బోర్లించి చుట్టు మట్టి కప్పి వెనక వున్న రంధ్రంద్వారు ఊదుతారు. అప్పుడు దట్టమైన పొగ ఎలుకల బొరియలంతా వ్వాపిస్తుంది. ఊపిరాడని ఎలుకలు ఎక్కడో ఒక చోట బయటకు వస్తాయి . అప్పుడు వాటిని పట్టుకుంటారు. కొన్ని [[ఊపిరాడక]] లోపలే చని పోతాయి. ఆ బొరియలను త్రవ్వి చనిపోయిన ఎలుకలను పట్టు కుంటారు. ఆ రోజుకి వారి కుటుంబానికి కావలసిన తిండి గింజలు, కూరలోకి ఎలుకల మాంసం దొరుకు తుంది. ఇప్పటికి వీ ఎలుకలను మెట్ట పైర్లలో, ఇతరత్రా ఎలుకలు, పిట్టలను పడుతున్నారు. ఈ [[ఇర్ల వాళ్ళు]] ఒక జాతి ప్రజలు. వారి వృత్తి కేవళం తేనె తీయడం, ఎలుకలను పట్టడం, చిన్న చిన్న అడవి జంతువులను, పిట్టలను వేటాడ్డం. వీరు పల్లెలకు దూరంగా అడవులకు దగ్గరగా నివసిస్తుంటారు.
 
వరికంకులు గింజ కట్టి ముదిరి పైరు ఎర్ర బారితే ఇక ఆ పొలానికి నీరు పెట్టడం మానేస్తాడు రైతు. ఇక పది రోజుల్లో కోతకు సిద్దం అవుతుంది. కూలీలలు పిలిచి, తన కుటుంబ సబ్యులతోసభ్యులతో కలిసి [[కొడవళ్లు]] తీసుకొని వరికోతకు ఉపక్రమిస్తాడు రైతు. పొలం అంతా కోసి ''వాదులు'' (కుప్పలు) వేసి నాలుగు రోజులు ఎండనిచ్చి వాటిని మోపులు కట్టి ఐదారు మోపులను పొలంలోనె వదిలి మిగతా అన్నీంటిని కళ్ళం లోనికి చేర్చి కూలీలను పెట్టి తనూ ఒక చెయ్యీ వేసి వాది కొట్టి (నూర్చి) గింజలను వేరు చేస్తారు. పొలంలో వదిలిన ఈ ఐదారు మోపుల వృత్తి పరి వారికి [[మేర]] కొరకు వదిలేస్తారు. [[చాకలి]], [[మంగలి]], [[కుమ్మరి]], [[వడ్రంగి]], [[నీరుగట్టోడు]], మొదలగు వారు తలా ఒక మోపు వాలిళ్లకు తీసుకెళ్ళి దాచుకొని, అలా అందరి దగ్గరనుండి మోపులు తెచ్చి ఒక రోజున వాటిని నూర్చి వడ్లను వేరు చేసుకుని ఉపయోగించు కుంటారు. రైతు తన కల్లంలో వున్న ఆ గింజలనుండి తాలు, తప్పలను వేరు చేయడానికి [[తూర్పార పట్టు]] తారు. ఆ వడ్లను బస్తాలకు నింపి తన ఎడ్ల బండి మీద ఇల్లు చేరుస్తారు. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసుకొని కొత్త వడ్లను దంచి బియ్యం చేసి ఆ బియ్యాన్ని [[పొంగలి]] పెట్టి అనగా ఆ బియ్యంలో బెల్లంవేసి అన్నం వండి నట్టింట దేవునికి ''తళిగ'' వేసి దండం పెట్టుకొని ఆ కొత్త బియ్యం అన్నాన్ని తింటారు. కొన్ని ప్రాంత రైతులు అవకాశాన్ని బట్టి అనేక రకాల పంటలను పండిస్తారు. కాని వరి పంట ఇంటి కొచ్చిన వేళ మాత్రమే ఇటువంటి పూజా కార్యక్రమం చేస్తారు. మొక్క పోకుండా పంట ఇల్లు చేరినందున రైతు కళ్లల్లో ఆనంద వెల్లి విరుస్తుంది. గింజలు తీసిని వరిగడ్డిని..... ఇంత వరకు ఆ పొలంలో కూలి చేసిన వారి కుటుంబాలు ఒక రోజున వచ్చి ఆ గడ్డిని కళ్లంలో వేస్తు ఎద్దులతో తొక్కించి విదిలించి కట్టలుగా కట్టి ఆ ప్రక్కనె [[వామి]] (కుప్ప) వేస్తారు. కల్లం అడుగున ఆ గడ్డిలో మిగిలిన గింజలు రాలి వుంటాయి. వాటిని బాగు చేసుకొని వాళ్ళు తీసు కెళ్లతారు. పొలం విస్థీర్ణాన్ని బట్టి వారికి ఆ గింజలే ఒకటి రెండు బస్తాలు దొరుకు తాయి. ఆ రోజుల్లో వడ్ల నుండి బియ్యాన్ని వేరు చేసె యంత్రాలు లేవు. వడ్లను [[ఏతం]]తో దంచే వారు. ఇది నీరు తోడే ఏతమే కాని దీనికి నీరు తోడే [[బాన]] స్థానంలో పెద్ద రోకలి వుంటుంది. కింద పెద్ద రోలు వుంటుంది. అందులో పెద్ద మొత్తంలో వడ్లను పోసి పెద్ద [[రోకలి]]తో దంచు తారు. కాని సాధారణంగా ప్రతి ఇంట్లోను రోలు -- రోకలి వుంటుంది. రోట్లొ వడ్లను పోసి ఆడవాళ్ళు రోకలితో దంచు తారు. ఈ పని ఆడవారు మాత్రమే చేస్తారు. ఒకే సారి ఇద్దరు ముగ్గురు కూడా కలిసి దంచు తారు. కొంత సేపు దంచాక దానిని [[చేట]]లతో [[చెరిగి]] బియ్యాన్ని, పొట్టును వేరు చేస్తారు. [[రోకలి]]ని పెద్ద కర్రమానుతో చేస్తారు. దానికి క్రింద పెద్దది, పైన చిన్నది అయిన [[పొన్ను]] వుంటుంది అది ఇనుముతో చేసినదిచేసింది. ఈ [[రోకలి]]తో అనేక రకాల జొన్నలు, సజ్జలు వంటి గింజలను పప్పులను కూడా దంచు తారు. బియాన్ని పిండి చేయాలంటే కూడా [[రోలు]], [[రోకలి]] అవసరమే. ప్రస్తుతం అన్నింటికి యంత్రాలు వచ్చాయి. రోలు, రోకలి మూల పడ్డాయి. ఇది నీరే ప్రదాన అవసరమైన వరి పంట పండించడంలో కొన్ని ప్రాంతాల రైతుల కడగండ్లు వర్ణనాతీతం. వర్షాభారంతో నీరె లేనప్పుడు ఇక వరి ఎక్కడ పండు తుంది. అంచేత ప్రస్తుతం వరి వేసే రైతే కొన్ని ప్రాంతాలలో లేడు. జలాశయాలు, నదులు, కాలువలు వున్న ప్రాంతాలలోనే రైతులు వరి పండించు చున్నారు. అప్పట్లో బియ్యం కొరకు రైతు అంగడి కెళితే అదో అవమానం, నామోషి. ఇప్పుడు అదే రైతు రేషన్ బియ్యం కొరకు అంగలార్చడం, అవి చాలక అంగట్లో బియ్యం కొరకు వెళ్లక తప్పడం లేదు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కలుపు_మొక్క" నుండి వెలికితీశారు