దత్తాత్రేయ స్వామి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
===జననము===
[[అత్రి మహర్షి]] అతి ఘోరమైన [[తపస్సు]] చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమంటారు. [[అత్రి మహర్షి]] ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడుగా జన్మించి సమస్త ప్రజలకు సర్వదు:ఖాలను పోగొట్టగల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు. ఇది ఇలా ఉండగా అనసూయాదేవి [[సుమతి]] అనే పతివ్రత వలన [[సూర్యోదయం]] ఆగిపోగా, ఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది. ఈ కార్యానికి సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదించగా మరల తన భర్తకోరిన వరాన్నే కోరుతుంది.
 
ఆ వ్రత ఫలితంగా [[మార్గశిర పౌర్ణమి]] రోజు సద్యోగర్భంలో అనసూయాత్రులకు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించాడు. ఆ బాలునికి మూడు తలలు ఆరు చేతులు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/దత్తాత్రేయ_స్వామి" నుండి వెలికితీశారు