ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కమీషన్ → కమిషన్, → (2) using AWB
పంక్తి 32:
|mascot =
|nickname =
|affiliations = [[శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ]]
|website =
}}
==చరిత్ర==
దత్తమండలాలను ఉద్దరించి చైతన్యవంతం చేయాలనే తలంపుతో అలనాటి డి.పి.ఐ. జె.హెచ్.స్టోన్ దొరగారి ప్రమేయంతో [[అనంతపురం]] మునిసిపల్ హైస్కూలులో కాలేజి ఏర్పడింది<ref>{{cite journal|last1=ఎడిటర్|title=ఆర్ట్స్ కళాశాల చరిత్ర|journal=అనంతనేత్రం (వార్త దినపత్రిక అనంతపురం జిల్లా ప్రత్యేక సంచిక)|date=1999|page=17}}</ref>. [[1916]] [[జులై 8]]వ తేదీనాడు ద్వితీయశ్రేణి కళాశాలగా ఆవిర్భవించిన ఈ కళాశాలకు తొలి ప్రిన్సిపాల్ ఎస్.ఇ.రంగనాథన్. 41 విద్యార్థులతో, హిస్ట్రరీ, తెలుగు, కన్నడ, సంస్కృత, తత్త్వశాస్త్ర బోధనాంశాలతో ప్రారంభమైన ఈ కళాశాల ఆర్థికంగాను, అధ్యాపకుల కొరతతోను మొదట్లో కొంత ఇబ్బంది పడింది. ప్రొఫెసర్ మార్క్ హంటర్ నేతృత్వంలోని విశ్వవిద్యాలయ కమీషన్కమిషన్ అనంతపురానికి వచ్చి ఈ కళాశాలను పరిశీలించి చేసిన సిఫారసు మేరకు ఈ కళాశాల మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధం అయింది. రెండేండ్లు అనుబంధంగా ఉండి [[1918]] [[జూన్ 6]]లో ప్రథమశ్రేణి కళాశాలగా ఎదిగింది. ఈ ఎదుగుదలకు ప్రిన్సిపాల్ రంగనాథన్, డా.[[సర్వేపల్లి రాధాకృష్ణన్]], లార్డ్ పెంట్‌లెండ్ కృషిచేశారు. మొదటి ఏడేండ్లలో కళాశాల కొత్త గదుల నిర్మాణంతో ఉత్సాహంగా ముందుకు సాగింది. [[1920]] అక్టోబరు 23 న కేశవ పిళ్లై అధ్యక్షతలో తొలి వార్షికోత్సవం జరిగింది. ఈ కళాశాలకు రెండవ ప్రిన్సిపాల్‌ అరుళానందం నేతృత్వంలో భౌతికమైన వనరులు చేకూరాయి. ద్వితీయ దశకంలో కళాశాల ప్రగతి పుంజుకుంది. ఎన్.ఆర్.కృష్ణమ్మ ప్రిన్సిపాల్‌గా సుదీర్ఘకాలం పనిచేసి అభివృద్ధి దిశగా పెనుమార్పులు వచ్చాయి. అధ్యాపకులలో అంకితభావం, విద్యార్థులలో అధ్యయన కాంక్ష, పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధన, క్రీడల్లో ప్రదర్శించిన నైపుణ్యం అంతా కలిసి ఈ కళాశాల కీర్తిని పెంచాయి.
 
[[1926]]లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్ర విశ్వవిద్యాలయానికి]] అనుబంధంగా ఉన్న ఈ కాలేజి [[1930]]లో మళ్ళీ మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మార్చారు. ఆ ఏడే కళాశాలకు హాస్టల్ భవనం ఏర్పడింది. [[1940]]లో మద్రాసులోని సెయింట్ జాన్స్ దళానికి అనుబంధంగా ఈ కళాశాలలో అంబులెన్స్ విభాగం ఏర్పడింది. పేద విద్యార్థులకు విద్యార్థి వేతనం, విద్యలో వెనుకబడినవారికి ఉచితంగా ట్యుటోరియల్స్, ఫోటోగ్రఫీ క్లబ్, విహారయాత్రలు, వస్తుప్రదర్శన వంటివి ఈ కళాశాలలో ప్రవేశపెట్టి విద్యార్థులకు ఉత్తేజాన్ని కలిగించారు. [[1945]]లో మద్రాసులోని యూనివర్శిటీ ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూలు అనుబంధంగా ఈ కళాశాలలో ఒక విభాగం వెలిసింది. [[1946]]లో ప్రిన్సిపాల్ పి.ఎన్.గౌడ ఆధ్వర్యంలో రజతోత్సవ వేడుకలు జరిగాయి. [[1947]]లో ఈ కళాశాల ప్రభుత్వ కళాశాలగా మారింది. ఆంధ్రరాష్ట్ర అవతరణతో ఈ కళాశాల [[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్ర విశ్వవిద్యాలయానికి]] అనుబంధంగా ఉండి తర్వాత కొంతకాలానికి [[శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం |శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి]] అనుబంధమైంది. [[1978]]లో ఈ కళాశాల వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆ ఉత్సవాలకు అప్పటి రాష్ట్రపతి [[నీలం సంజీవరెడ్డి]] హాజరయ్యాడు. [[1981]]లో [[శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం]] ఏర్పడ్డాక ఈ కళాశాల దానికి అనుబంధ కళాశాలగా మారింది.
 
శత వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ కళాశాల ప్రస్తుతం 31 డిగ్రీ కోర్సులు, 14 పి.జి.కోర్సులు అందజేస్తున్నది. 7964మంది విద్యార్థులు ఈ కళాశాలలో చదువుకుంటున్నారు<ref>{{cite news|last1=V. K.|first1=RAKESH REDDY|title=Anantapur Arts and Science College to turn 100 years|url=http://www.thehindu.com/news/national/andhra-pradesh/anantapur-arts-and-science-college-to-turn-100-years/article6749265.ece|accessdate=27 January 2015|work=The Hindu|date=2015-01-03}}</ref>. వీరిలో 90 శాతం విద్యార్థులు ఆర్థికంగా లేదా సామాజికంగా వెనుకబడినవారు. ప్రస్తుతం ఎన్.రంగస్వామి ఈ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నాడు.
 
==జాతీయోద్యమంలో పాత్ర==
స్వాతంత్ర్యోద్యమంలో ఈ కళాశాల ముఖ్యపాత్రను నిర్వహించింది<ref>{{cite journal|last1=ఎడిటర్|title=స్వాతంత్ర్యోద్యమంలో అనంత విద్యార్థుల పాత్ర|journal=అనంతనేత్రం (వార్త దినపత్రిక అనంతపురం జిల్లా ప్రత్యేక అనుబంధం)|date=1999|page=60}}</ref>. ఈ కళాశాల 1940-43 మధ్యకాలంలో రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచింది. ఈ కళాశాల విద్యార్థులు పలువురు తమ భవిష్యత్తును లెక్కచేయకుండా జాతీయోద్యమంలో దూకారు. స్థానిక పీస్ మెమోరియల్ హాల్‌లో ఎ.పి.సి.సి సమావేశం జరిగినప్పుడు [[నీలం సంజీవరెడ్డి]], [[కల్లూరు సుబ్బారావు]], [[పప్పూరు రామాచార్యులు]], [[కడప కోటిరెడ్డి]], [[టంగుటూరి ప్రకాశం]] మొదలైన హేమాహేమీలతో పాటు ఈ కళాశాల విద్యార్థులు జీవరత్నమ్మ, ఆదిశేషయ్య పాల్గొనడం ఆ రోజులలో సంచలనాన్ని సృష్టించింది. ఆ సమావేశంలో వ్యక్తిగత సత్యాగ్రహానికి బదులు సామూహిక సత్యాగ్రహం చేపట్టాలని నిర్ణయించారు. 1940 జనవరి 28 న కళాశాల విద్యార్థులు రమేష్, టి.కె.ఆర్.శర్మ, [[ఆదిశేషయ్య]], [[జీవరత్నమ్మ]]ల ఆధ్వర్యంలో పెద్ద ప్రదర్శన నిర్వహించారు. ఆ కాలంలోనే [[ఐదుకల్లు సదాశివన్]], [[విద్వాన్ విశ్వం]], [[నీలం సంజీవరెడ్డి]]ల ఆధ్వర్యంలో [[ఆకాశవాణి]] అనే సైక్లోస్టయిల్ పత్రిక రహస్యంగా వెలువడేది. ఆ పత్రిక విద్యార్థులకు ఎంతో చైత్యన్యాన్ని పెంచింది. రాజకీయ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నందుకు [[ఆదిశేషయ్య]]ను కళాశాల నుండి బహిష్కరించారు. మహిళా విద్యార్థి జీవరత్నమ్మ ఆ రోజుల్లో విద్యార్థుల సమ్మెకు నాయకత్వం వహించింది. పోలీసులు ఆమెను చితకబాదారు. ఆ తర్వాత ఆమె రహస్యంగా జాతీయోద్యమం లోజాతీయోద్యమంలో పాల్గొనింది. ఆ రోజుల్లో ఆమెను కాలేజీ జోన్ ఆఫ్ ఆర్క్ అని పిలిచేవారు. అప్పట్లో కాలేజీ లెక్చరర్లుగా ఉన్న [[దామెర్ల రామారావు]], [[ఉపమాక సూర్యనారాయణ]] రహస్యంగా విద్యార్థులకు మార్గదర్శనం చేసేవారు. ఈ విధంగా ఈ కళాశాల జాతీయోద్యమానికి సాక్షీభూతంగా నిలిచింది.
 
==తొలి విద్యార్థిని==
పంక్తి 74:
* బి.ఎన్.రావు - రక్షణ మంత్రిత్వశాఖలో డైరెక్టరు
* [[ఎం.శాంతప్ప]] - [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం]] మాజీ ఉపకులపతి
* వి.ఆర్.వేణుగోపాల్ - రేడియో ఆస్ట్రానమీలో శాస్త్రవేత్త
* హెచ్.ఆర్.రావు - శ్రీహరికోట అటామిక్ రేంజ్‌లో సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్
* బి.మురళీధర్ - న్యూయార్క్ కార్పొరేషన్ ఆఫ్ హైడ్రాలిక్స్‌లో సైంటిస్ట్