కులగోత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
==సంక్షిప్త చిత్రకథ==
కామందు భూషయ్య ([[గుమ్మడి]]) కొడుకు రవి ([[అక్కినేని]]) [[విశాఖపట్నం]]లో చదువుకుంటున్నాడుచదువుకుంటూ ఉంటాడు. సరోజ (కృష్ణకుమారి) ఎం. బి. బి. ఎస్ చదువుతూ ఒంటరియైన తల్లితో కలిసి నివసిస్తుంటుంది. తల్లి ఆమె కోసం పెళ్ళి సంబంధాలు చూస్తుంటుంది కానీ ఆమె తండ్రి ఎవరో తెలియకపోవడంతో కులగోత్రాలు లేవని వచ్చిన సంబంధాలన్నీ వెనక్కిపోతుంటాయి. కళాశాల వార్షికోత్సవంలో శకుంటలశకుంతల దుష్యంతుడు నాటకంలో తనతోపాటు కథానాయిక వేషంలో పాల్గొన్న సరోజ ([[కృష్ణకుమారి]])ను రవి ప్రేమిస్తాడు. సరోజ తల్లి చలపతి (మిక్కిలినేని) వల్ల మోసపోతుంది. అతడు ఒకరోజున కూతురు మెడలో నగ దొంగిలించి అనుకోని పరిస్థితుల్లో భార్యను కలుసుకుంటాడు. ఆమె హెచ్చరించగా బాధతో వెళ్ళిపోతాడు.
కులగోత్రాల పట్టింపు గల భూషయ్య రవి ప్రేమను అంగీకరించడు. సరోజకు యిచ్చిన మాట ప్రకారం రవి ఇల్లు వదలి తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా సరోజను గుడిలో పెళ్ళి చేసుకుంటాడు. రవికి పోలీస్ ఇన్ స్పెక్టరుగా ఆ వ్రిలోనే వుద్యోగం వస్తుంది. రవి తన బావ (రేలంగి) స్నేహితులతో కలిసి పేకాడుతుంటే అరెస్టు చేస్తాడు. తండ్రి పట్టింపుల వల్ల రవి తన చెల్లెలు పెళ్ళికి కూడా వెళ్ళలేక బయటనుంచే అక్షింతలు వేస్తాడు.
రవిని తలుచుకొని అతని తల్లి బాధపడి అనారోగ్యంతో మంచం పట్టి మరణిస్తుంది. భార్య గతించాక భూషయ్యలో మార్పు వస్తుంది. రవికి కొడుకు పుడతాడు. భూషయ్య మమతను చంపుకోలేక దొంగచాటుగా వెళ్ళి మనవణ్ణి చూసి ఎత్తుకొని ముచటపడి వాడి మెడలో బంగారు గొలుసు కానుకగా వేస్తాడు. చలపతి భూషయ్య యింట్లో దొంగతనం చేసే ప్రయత్నంలో వుండగా రవి వచ్చి రక్షిస్తాడు. పంతాలు పట్టింపులు వదలి భూషయ్య కొడుకు, కోడలు, మనవణ్ణి యింట్లోకి ఆహ్వానిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/కులగోత్రాలు" నుండి వెలికితీశారు