కుమారజీవుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో (2), ) → ) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం (2), ) → ) using AWB
పంక్తి 31:
కుమారజీవుని 7సంవత్సరాల వయసులో ఇతని తల్లి జీవిక తన భర్త నుండి అనుమతి పొంది బౌద్ధ సన్యాసినిగా మారి కూచాలోని సియోలి (Tsio-li) సన్యాసినుల మఠంలో చేరింది. ఏడు సంవత్సరాల చిరుప్రాయంలోనే కుమారజీవుడు బౌద్ధ సూత్రాలను వల్లెవేస్తూ అసాధారణ ప్రజ్ఞా పాటవాలను కనపరచడంతో, తల్లి జీవిక ఇతనిలోని ప్రతిభను గుర్తించి బౌద్ధ సిద్ధంతాలతోను, చింతనలోను చక్కని ప్రావీణ్యం నేర్పించాలనే నిశ్చయించింది.
===[[కాశ్మీర్]] లో విద్యాభ్యాసం===
కుమారజీవుని విద్యాభ్యాస నిమిత్తం 9 సంవత్సరాల వయసులో అతనిని తోడ్కొని తల్లి జీవిక [[మధ్య ఆసియా]] నుండి ప్రయాసభరితమైన ప్రయాణం సాగించి బుద్ధుడు జన్మించిన భారతదేశానికి చేరుకొంది. కుమారజీవుడు ముందుగా తండ్రి స్వస్థలం అయిన కాశ్మీర దేశంలో ప్రసిద్ధ బౌద్ధాచార్యుడు అయిన ‘బందుదత్తు’ని వద్ద సంస్కృతం అభ్యసించాడు. స్థవిరవాదుల సంప్రదాయానికి చెందిన నికాయాలను దీర్ఘ ఆగమ, మధ్యమ ఆగమ, ఖుద్దక ఆగమాలను నేర్వడమే కాకుండా భారతీయ వైద్యం, ఖగోళం, జ్యోతిషం, తర్కం, గ్రంథ వివరణ, వ్యాఖ్యాన రీతులలో ప్రావీణ్యం సంపాదించాడు. కాశ్మీర రాజు సమక్షంలో జరిగిన విద్వత్ గోష్ఠిలో పాల్గొన్న కుమారజీవుడు పిన్న వయసులోనే తన వాదనాపటిమతో అనేకమంది బౌద్దేతర గురువులను ఓడించడంతో అతని పేరు ప్రసిద్ధమైంది. 3 సంవత్సరాల తదనంతరం భారత దేశంలోభారతదేశంలో విద్యను పూర్తి చేసుకొని తన తల్లితో కలసి కుమారజీవుడు తిరిగి కూచా రాజ్యానికి పయనమైనాడు.
 
===కాష్గర్ లో విద్యాభ్యాసం===
పంక్తి 42:
హీనయానం (స్థవిర వాదం) నుంచి మహాయాన బౌద్ధానికి మారిన తరువాత కుమారజీవుడు తన మనోవైఖిరిని వివరిస్తూ “బంగారాన్ని (మహాయానం) ఎరుగని వ్యక్తి, ఇత్తడిని (స్థవిరవాదం) చూసి అదే గొప్పదని భ్రమపడినట్టుగా, తానింతకాలం వున్నానని, చివరకు మహాయాన ప్రభావంతో తాను విముక్తుడు అయినట్లు” వెల్లడించాడు.
 
తుర్పాన్ లోవున్న ఆనతి కాలంలోనే మాధ్యమిక బౌద్ధానికి చెందిన ఆచార్య [[నాగార్జునుడు]], ఆచార్య [[ఆర్యదేవుడు]] మొదలగు ఉద్దండుల గ్రంథాలను అభ్యసించాడు. మహాయాన బౌద్ధం నేర్చుకోవడానికి భారత దేశంభారతదేశం నుండి తన తొలి గురువు బందదత్తుని ఆహ్వానించి వాదనలో గురువుని మెప్పించగలిగాడు. క్రమేణా తుర్పాన్ రాజ్యంలో కుమారజీవుని పేరు ప్రఖ్యాతులు ఉత్తర చైనాకు, తూర్పు ఆసియాకు విస్తరించాయి. తూర్పుఆసియా నుండి అనేకమంది అతని వద్దకు బౌద్ధదర్మం నేర్చుకోవడానికి రాసాగారు.
 
కూచా రాజు పోషుయ్ (Po-shui) ఆహ్వానం మేరకు స్వదేశం చేరుకొన్న కుమారజీవుడు అక్కడ బౌద్ద సన్యాసినిగా మారిన రాకుమారికి ధర్మోపదేశం చేసాడు. 20 సంవత్సరాలు వచ్చేసరికి కుమారజీవుడు పూర్తి బౌద్ద సన్యాసిగా మారాడు. కూచా రాజాస్థానంలో దేశ, విదేశీ బౌద్ద వేత్తలతో బౌద్ద తాత్విక చర్చలు నిర్వహిస్తూ ప్రోత్సాహించేవాడు. కుమారజీవుడు కూచా రాజ్యంలో వుంటన్నప్పుడు అతని ప్రజ్ఞా పాటవాలను విన్న ఉత్తర చైనా చక్రవర్తి ‘ఫు జియన్’ (Fu Jian), బౌద్ధ సూత్రాలను [[చైనా]] భాషలోనికి అనువదించగల సమర్ధుడిగా కుమారజీవుని భావించి, తన రాజధాని ‘చాంగన్’ (Changan) కు పంపించవలసినదిగా కూచా రాజును కోరాడు. కాని కూచా రాజు నిరాకరించడంతో చక్రవర్తి కోపోద్రికుడయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/కుమారజీవుడు" నుండి వెలికితీశారు