రఘుపతి వెంకయ్య నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[బొమ్మ:telugucinema_raghupathivenkayya.JPG|right|thumb|తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు[http://www.telugupeople.com]]]
 
రఘుపతి వెంకయ్య స్వస్థానం [[మచిలీపట్నం]]. 1886లో తన 17వ ఏట వెంకయ్య ఫొటోలు[[ఫొటోగ్రఫీ|ఫొటో]]<nowiki/>లు తీయడం మొదలుపెట్టాడు. 1910లో ఒక 'క్రోమో మెగాఫోను'ను, 4000 అడుగుల ఫిలిమ్‌ను విదేశాలనుండి తెప్పించుకొని వాటిని ప్రదర్శించడం ఆరంభించారు. ఒక టూరింగ్ టెంట్ ద్వారా ప్రదర్శనలిస్తూ ఆయన అప్పటి మూగసినిమాలకు [[సంగీతము|సంగీతం]] వంటి ఆకర్షణలు జోడించేవాడు.
 
1912లో [[మద్రాసు]]లో 'గెయిటీ' అనే సినిమా థియేటర్ (ప్రదర్శన శాలను) నిర్మించారు. తరువాత 'క్రౌన్', 'గ్లోబ్' సినిమాహాళ్ళను కూడా నిర్మించారు.
తన కుమారుడు ''ఆర్.ఎస్.ప్రకాష్''ను [[సినిమా]] నిర్మాణం నేర్చుకోవడానికి విదేశాలు పంపాడు. ప్రకాష్ [[జర్మనీ]], [[ఇటలీ]], [[అమెరికా]] దేశాలు పర్యటించాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శకుడు 'సిసిల్ బి డెమిల్లి' (Ceicil B.Demille) 'టెన్ కమాండ్‌మెంట్స్'(Ten Comamndments) చిత్రాన్ని నిర్మిస్తున్నపుడు ప్రకాష్ ఆయన క్రింద కొంతకాలం పనిచేశాడు.
{{తెలుగు సినిమా సందడి}}
 
ప్రకాష్ తిరిగి వచ్చిన తరువాత ఈయన దక్షిణభారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ 'Star of the East' ను స్థాపిచాడు. 1921లో [[భీష్మప్రతిజ్ఞ]] మూగచిత్రాన్ని నిర్మించారు (ఇది మూగచిత్రం గనుక "మొదటి తెలుగువాడి సినిమా" అనడం ఉచితం). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. 'డి కాస్టెల్లో'(De Castello)అనే ఆంగ్లయువతి [[గంగ]] పాత్రను ధరించింది. తరువాత ఈ తండ్రీకొడుకులు [[మత్స్యావతార్]], [[నందనార్]], [[గజేంద్రమోక్షం]] వంటి మరికొన్ని మూగసినిమాలను తీశారు. తరువాత ప్రసిద్ధులైన [[సి.పుల్లయ్య]], [[వై.వి.రావు]]లూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
 
 
తరువాత తమిళ సినిమా నిర్మాత ఎ.నారాయణన్‌తో కలిసి 'గ్యారంటీడ్ పిక్చర్స్ కార్పొరేషన్' , 'జనరల్ ఫిల్మ్ కార్పొరేషన్' స్థాపించారు. [[విశ్వామిత్ర]], [[మాయామధుసూదన]], [[పాండవ నిర్వహణ]], [[రాజ్ ఆఫ్ రాజస్థాన్]] వంటి మరికొన్ని మూగసినిమాలు తీశారు.
 
1941 లో తన 69వ ఏట రఘుపతి వెంకయ్య మరణించారు. అప్పులవారికి చాలామొత్తాలు చెల్లించవలసినందున ఆయన చివరికాలానికి ఏమీ ఆస్తి మిగలలేదు అంటారు.
 
==రఘుపతి వెంకయ్య అవార్డు==
ఆయన సేవలను గుర్తించిన అంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1980 వ సంవత్సరములో[[సంవత్సరము]]<nowiki/>లో [[రఘుపతి వెంకయ్య అవార్డు]] ను నెలకొల్పినారు. సినీ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ బహుమతి ప్రధానం చేస్తారు.
 
వెంకయ్య తరువాత ప్రకాష్ తన సినీ ప్రయోగాలను మరింత ముందుకు తీసుకొని వెళ్ళారు. వెల్లవేసిన తెల్లటి గోడమీద సినిమా 'ప్రొజెక్ట్' చేసేవాడు. అలా దానిని 'గోడమీది బొమ్మ' అనేవారు. ప్రకాష్ [[కాకినాడ]] దగ్గర [[భక్త మార్కండేయ]] సినిమా తీశారు. అందులో [[కాకినాడ రాజారత్నం]] అనే ఆవిడ ఒక ముఖ్యపాత్ర ధరించింది. ఈమే తెలుగు సినిమాకు మొదటి కథానాయిక.
 
[[దస్త్రం:Raghupati Venkayya.jpg|thumbnail|రఘుపతి వెంకయ్య చిత్రపటం]]
పంక్తి 28:
 
 
* సినిమా థియేటర్లు కట్టడంలో, [[సినిమాలు]] తియ్యడంలో వెంకయ్య పడిన కష్టాలూ, అవస్థలూ అన్నీ ఇన్నీ కావు. ఎలక్ట్రిసిటీ ఇన్‌స్పెక్టర్లూ, శానిటరీ ఇన్‌స్పెక్టర్లూ ప్రతీసారీ వచ్చి ‘అది మార్చు, ఇది మార్చు’ అని పేచీలు పెట్టేవారుట. ఒక థియేటర్‌ కట్టడానికి అంగీకరించి, లైసెన్స్‌ ఇచ్చిన తర్వాత కూడా అధికారులు ఏవో అవాంతరాలు, అభ్యంతరాలు చెప్పేవారనీ, అలా ఒక థియేటర్‌ , నిర్మాణం మధ్యలో ఆగిపోయి తీవ్రమైన నష్టం కలిగించిందనీ, ఈ బాధలు భరించలేక ఇంకొకరైతే, ఈ వ్యాపారానికి స్వస్తి చెప్పేవారనీ, తాను పట్టుపట్టి అంతుచూడాలనుకున్నాననీ, సాధించగలిగాననీ - వెంకయ్య రాసుకున్నారు.
 
 
* ‘భీష్మప్రతిజ్ఞ’ తర్వాత వెంకయ్య, ప్రకాశ్‌ కలిసి గజేంద్రమోక్షం, మహాత్మా కబీర్‌దాస్‌, స్టేజ్‌గర్ల్‌, కోవలన్‌ వంటి మూకీలు ఎన్నో తీశారు. ఈ మూకీలకి ఉత్తరభారతదేశంలో మంచి గిరాకీ వుండేది. అయినా కంపెనీకి ఆర్థికమైన నష్టాలు కలగడంతో 1924 లో ‘కోర్ట్‌’ చేతిలోకి వెళ్లిపోయింది! ప్రకాశ్‌ వేరే కంపెనీలకి కొన్ని చిత్రాలు డైరెక్టు చేశారు. 1931లో టాకీ వచ్చిన తర్వాత కూడా మూకీల నిర్మాణం కొనసాగింది. మద్రాసులో[[చెన్నై|మద్రాసు]]<nowiki/>లో తయారైన చివరి మూకీచిత్రం ‘విష్ణులీల’ . 1932 లో ప్రకాశే డైరెక్టు చేశారు. ఐతే, ‘భీష్మప్రతిజ్ఞ’కి ముందే ప్రకాశ్‌ ‘మీనాక్షి కళ్యాణం’ అన్న చిత్రం తీస్తే కెమెరా సరైనది కానందువల్ల ఆ బొమ్మ రానేలేదుట! మళ్లీ విదేశాలువెళ్లి వేరే కెమెరా కొనుక్కొచ్చి ముందుగానే ప్రయోగాలు చేసి, ‘భీష్మప్రతిజ్ఞ’ తీశారు. ఇలాంటి ఆర్థికమైన నష్టాలూ, శ్రమతో కలిగిన కష్టాలూ ఎన్నో. అందుకే, దక్షిణ భారతదేశంలోని సినిమా అభివృద్ధికి ప్రకాశ్‌ ‘మేజర్‌ ఫోర్స్‌’ అని అప్పటి జర్నలిస్టులూ, రచయితలూ కొనియాడారు.
 
 
* ప్రకాశ్‌ దగ్గర పనిచేసిన [[సి.పుల్లయ్య|సి. పుల్లయ్య]], వై.వి. రావు దర్శకులై తెలుగుచిత్రాలు తీస్తూవుండగా, ప్రకాశ్‌ తమిళచిత్రాలే ఎక్కువగా తీశారు. 1938 - 39 ప్రాంతాల ‘[[బారిస్టర్‌ పార్వతీశం]]’, ‘చండిక’ చిత్రాల్ని ప్రకాశ్‌ చేపట్టారు. [[బళ్ళారి రాఘవ|బళ్లారి రాఘవాచార్యరాఘవాచార్]]<nowiki/>య, [[పసుపులేటి కన్నాంబ|కన్నాంబ]] వంటి నటులతో, ‘చండిక’ నిర్మిస్తే, హాస్య సన్నివేశాలతో ‘బారిస్టర్‌ పార్వతీశం’ నిర్మించారు. రెండూ 1940లో విడుదలైనాయి.
 
 
పంక్తి 43:
 
 
* 1956లో ప్రకాశ్‌ ’మూన్రుపెణగళ్‌‘ తమిళచిత్రం ,’ దేవసుందరి‘[[దేవసుందరి]]‘ తెలుగుచిత్రం ప్రారంభించారు. ’మూన్రుపెణగళ్‌‘ ఆ సంవత్సరంలోనే విడుదలైంది గాని ఆయన మృతి చెందడంతో ’దేవసుందరి‘ మాత్రం 1960లో విడుదలైంది.