రుక్మిణీదేవి అరండేల్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , అభ్యర్ధి → అభ్యర్థి, విద్యార్ధు → విద్యార్థు ( using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Rukmini Devi.jpg|thumb|right|రుక్మిణీదేవి అరండేల్]]
 
'''రుక్మిణీదేవి అరండేల్''' ([[ఫిబ్రవరి 29]], [[1904]] - [[ఫిబ్రవరి 24]], [[1986]]) (Rukmini Devi Arundale) [[తమిళనాడు]]లోని [[చెన్నై]]లో '''కళాక్షేత్ర''' నాట్యపాఠశాల వ్యవస్థాపకురాలు. ఆమె స్వయంగా [[నాట్యము|నృత్య]] కళాకారిణి. కళలయందు ఆమెకున్న మక్కువ ఆమెను కర్ణాటక సంగీతం, బాలే, [[భరతనాట్యం|భరతనాట్యాల]]లో ప్రావీణ్యం సంపాదించేలా చేశాయి. ఆమె భరత నాట్యం [[శిక్షణ]] కొరకు [[పాఠశాల]] స్థాపించి [[భరతనాట్యం]] ప్రాచుర్యము, గౌరవము ఇనుమడింప చేసింది. ఆమె ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ ప్రయత్నాన్ని విజయ వంతం చేసింది.
 
== జననం ==
పంక్తి 8:
 
== వివాహం ==
ఈమె తన అభిరుచులతో, ఆలోచనలతో ఏకీభవించిన అరండేల్ అనే విదేశీయుణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అప్పుడు ఆమె వయసు 16, అరండేల్ కు 40. వీరి [[పెళ్ళి|వివాహము]] పెద్దల విపరీతమైన అభ్యంతరాల మధ్య [[ముంబై]]లో రిజిస్టర్ ఆఫీసులో జరిగింది.
 
== నాట్య అభ్యాసం ==
వివాహానంతరం ఈమె తన భర్తతో[[భర్త]]<nowiki/>తో అనేక ప్రదేశాలను దర్శించే అవకాశం లభించింది. ఆమె తనకు సహజంగానే ఉన్న కళలయందున్న ఆసక్తిచేత అన్నాబావ్లే అనే రష్యా కళాకారిణి చేసిన బాలే నృత్యము పట్ల ఆకర్షితురాలై, ఆమె సహాయంతోనే ఆమె గురువైన కిళియోనర్టిని గురువుగా స్వీకరించి బాలే నృత్యాన్ని అభ్యసించింది. ఆపై అన్నాబావ్లే సలహా ననుసరించి తన భరతనాట్య శిక్షణకు కావసిన ప్రయత్నాలు ప్రారంభించింది. కాని ఆరంభంలో అనేక తిరస్కారాలను చవిచూసింది. ఆ రోజులలో స్త్రీలు నాట్యాన్ని అభ్యసించడం అవమానంగా భావించడం చేత ఆరంభంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నా, ఆమె తన పట్టు విడవకుండా మీనాక్షి సుందరం పిళ్ళై దగ్గర శిష్యరికం చేసి భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది.
 
== అరంగేట్ట్రం ==
రుక్మిణీదేవి తన మొదటి నాట్య ప్రదర్శనని, థియాసాఫికల్ సొసైటి వజ్రోత్సవాలలో ఇరవై వేల మంది ప్రేక్షకుల ఎదుట చేసి పలువురి ప్రశంశలు అందుకుంది. రామసామి అయ్యర్, శివసామి అయ్యర్ మొదలైన ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ ప్రదర్శన జేమ్స్ కజిన్స్ అనే [[ఇర్లాండ్ఐర్లాండ్]] కవిని ఆకర్షించింది.
 
== నాట్య పాఠశాల ఆరంభం ==
[[ఐర్లాండ్]] కవి ఆమె యొక్క ప్రతిభను పది మందికి పంచి పెట్ట మని, అందుకు తగిన విధంగా నాట్య పాఠశాల ఆరంభించాలని కోరిక వెలిబుచ్చాడు. కవి జేమ్స్ కోరిక ఆమెను నాట్య పాఠశాల ఆరంభించేలా ఉత్తేజ పరచింది. ఈ నాట్య పాఠశాల "ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్" అనే పేరుతో అనేక మంది ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది. తరువాత కాలంలో అదే ''[[కళాక్షేత్రం]]''గా రూపుదిద్దుకుంది.
 
== పాఠశాల నిర్వహణ ==
నాట్య పాఠశాలకు ఆమె మొదటి గురువైన సుందరం పిళ్ళై, అతని అల్లుడు చొక్కలింగం పిళ్ళై ఉపాధ్యాయులుగా ఉన్నారు. మొదటి విద్యార్థుల సంఖ్య కేవలం నలుగురే. ఈ పాఠశాలలో [[నాట్యము|నాట్యమే]] కాక [[సంగీతము|సంగీతమూ]] నేర్పుతారు. అందమైన తోటలు, తామర కొలనులు, సంప్రదాయమైన కట్టడాలు ఈ పాఠశాలను నాట్య దేవాలయంగా చేశాయి. అడుగడుగునా ఆమె [[కృషి]], [[అభిరుచి]] ప్రతిబింబిస్తూ ఈ పాఠశాల నాట్య రంగానికి ఎనలేని కృషి చేస్తూ ఉంది. ఈ పాఠశాలకు ఆమె చేసిన సేవ ఆమెను చిరకాలం గుర్తుంచుకునేలా చేసింది.
 
==రాజ్యసభలో==