గండవరం సుబ్బరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), తో → తో , ప్రతిష్ట → ప్రతిష్ఠ, → (2) using AWB
పంక్తి 42:
 
== విద్యాభ్యాసం - ఉద్యోగం ==
ఉన్నత పాఠశాల చదువు గూడూరులో పూర్తిచేసి, నెల్లూరు లోని వి.ఆర్.కాలేజీలో బి.ఏ పట్టభద్రులయ్యారు[[పట్టభద్రుడు|పట్టభద్రు]]<nowiki/>లయ్యారు. [[ఆంధ్రప్రదేశ్]] పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహాయ కార్యదర్శిగా పనిచేసి, 1995లో పదవీ విరమణ చేశారు.
 
== రంగస్థల ప్రవేశం ==
1952లోనే [[రంగస్థలం]]తో అనుబంధం ఉంది. విద్యార్థిగా[[విద్యార్థి]]<nowiki/>గా ఉన్నప్పుడే '''మమత''' అనే నాటిక రాసి స్కూలు వార్షికోత్సవాలలో ప్రదర్శింపచేసారు. నెల్లూరులో నిర్వహించిన రాష్టస్థ్రాయి నాటక పోటీల్లో '''ఏది మార్గం''' అనే నాటిక రాసి ప్రదర్శింపచేసి, ఉత్తమ నిర్వహణ బహుమతి పొందారు. నాటక రచన, పాత్ర పోషణ, విమర్శ, పరిశోధన వీరి ప్రత్యేకతలు.
 
== ఇతర రచనలు ==
‘మన ఊరు, శిఖరం కూలింది, వెంటాడే నీడలు’ అనే [[రంగస్థలం|రంగస్థల]] నాటికలు, నీరు పల్లమెరుగు, చీమలుపెట్టిన పుట్టలు, నయనతార అనే రేడియో నాటకాలు రాశారు. వెలుగుపూలు అనే కార్యక్రమానికి 105 ఎపిసోడ్‌ల స్క్రిప్ట్ రాశారు. నాటకరంగం పై సుమారు 300 వ్యాసాలు వివిధ పత్రికలకు రాశారు. తెలుగు నాటకరంగంపైన, అటు పాశ్చాత్య నాటకరంగంపైన పరిశోధన చేసి ఆధునిక తెలుగు నాటకరంగంలో 1860నుంచి 1985 వరకు వచ్చిన మార్పులు రాశారు. '''గ్లింప్సెస్ ఆఫ్ తెలుగు డ్రామా''' అనే పేరుతో ఇంగ్లీషులో తెలుగు నాటక రచయితల రచనలపైన గ్రంథం రచించారు. మూడు ప్రసిద్ధ నాటకాలు అయిన '''[[వరవిక్రయం]]''', '''నిజం''', '''[[గయోపాఖ్యానం]]''' పైన విమర్శనాత్మక గ్రంథాలు రాశారు.
 
ఆంధ్రదేశంలోని [[తెలంగాణా]], ఆంధ్రా [[రాయలసీమ]] జిల్లాలలోనే కాక రాష్ట్రేతర పరిషత్తుల్లో కూడా నిర్వహించిన ఎన్నో నాటక పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అనేక ప్రతిష్ఠాత్మక పరిషత్ నాటకాలకు 77సార్లు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అమెరికాలోని తెలుగు సంస్థ ఆటావారు 1998లో నిర్వహించిన ప్రపంచ నాటక రచన పోటీలకుకూడా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. సుమారు మూడుసార్లు [[అమెరికా]]లో పర్యటించి అక్కడి రంగస్థల విశేషాలను గమనించారు.