సూరపనేని లక్ష్మీపెరుమాళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
 
== జీవిత విశేషాలు ==
చిన్నతనం నుండి [[పాటలు]] పాడడంలో ప్రావీణ్యం సంపాదించి జిల్లాలోని విజ్ఞానిక ఉద్యమం వైపు ఆకర్షితుడై ప్రాచీన కళారూపాల్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు. వీరు బుర్రకథకులుగా [[సుంకర వాసిరెడ్డి]] రచించిన "కష్టజీవి" బుర్రకథను చెబుతూ నాటి కరువు పరిస్థితులను, యుద్ధాల భీభత్సాన్ని నాటి రాజకీయాల్ని, భూస్వామ్య వర్గాల దోపిడీ విధానాన్ని లంచగొండి తనాన్ని కళ్ళకుకట్టినట్లు చిత్రించినట్లు ప్రదర్శించేవారు. కరువు ప్రాంతాల సహాయ కార్యక్రమాలలో పనిచేశారు.
 
కృష్ణా జిల్లా [[ప్రజా నాట్యమండలి]] లో ప్రధాన బాధ్యతలను నిర్వహించారు. సుంకర వాసిరెడ్డి రచించిన "ముందడుగు" నాటకాన్ని [[కోడూరు అచ్చయ్య]] గారి దర్శకత్వంలో అద్వితీయంగా ప్రదర్శించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఆ నాటకంలో వీరు కథానాయకుని ముసలి తల్లిగా నటించి మెప్పించారు. వీరు "మా భూమి" నాటకంలో దాదా పాత్రను అంతే చక్కగా పోషించారు.
 
తర్వాత [[మద్రాసు]] చేరి దాదాపు 50 [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమాలలో పాత్రలు పోషించారు. వీరు బడుగు రైతు, రైతు కూలీ, పెద్ద సంసారాన్ని ఈదలేక అవస్థపడుతున్న సగటు మనిషి తరహా పాత్రలు ధరించడానికి పెట్టింది పేరు. వీరు ధరించిన పాత్రలలో [[రోజులు మారాయి (1955 సినిమా)|రోజులు మారాయి]] (1955) లో కథానాయకుని తండ్రి పాత్ర, [[వరకట్నం (సినిమా)|వరకట్నం]] (1968) లో కథానాయకురాలి తండ్రి పాత్ర, [[ప్రజానాయకుడు]] (1972) చిత్రంలో కోటేశు పాత్రలు ముఖ్యంగా చెప్పుకోదగ్గవి.
 
== మరణం ==