నువ్వే నువ్వే: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కథ |
|||
పంక్తి 2:
{{Infobox film
| name = నువ్వే నువ్వే
| image =
| imdb_id =
| writer = [[త్రివిక్రమ్ శ్రీనివాస్]]
పంక్తి 20:
'''''నువ్వే నువ్వే''''' [[త్రివిక్రమ్ శ్రీనివాస్]] నటించి దర్శకత్వం వహించిన తెలుగు సినిమా. సినిమాలో [[తరుణ్]], [[శ్రియా సరన్|శ్రియ]], [[ప్రకాష్ రాజ్]] ముఖ్యపాత్రలు ధరించారు.
== కథాంశం ==
అంజలి (శ్రీయ) విశ్వనాథ్ (ప్రకాష్ రాజ్) అనే ఒక ధనవంతుడి కూతురు. విశ్వనాథ్ కి కూతురంటే ప్రాణం. ఆమెకు భర్తయ్యే వాడు తనకు అన్ని విధాలా నచ్చాలనీ, తనకు ఎదురు చెప్పకూడని వాడు అయ్యుండాలని అతని కోరిక. రిషి (తరుణ్) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన సరదా అబ్బాయి. అతని తండ్రి (చంద్రమోహన్) కి ఒక దుకాణం ఉంటుంది. రిషి సీనియర్ గా ఉన్న కళాశాలలో అంజలి కూడా చేరుతుంది. చిన్న చిలిపి తగాదాల తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. అంజలి పుట్టిన రోజున ఆమెకు ఆశ్చర్యానికి గురిచేద్దామని ఆమెకు చెప్పకుండా రిషి ముంబైకి తీసుకెళ్తాడు. ఈ సంఘటనతో విశ్వనాథ్ కి తన కూతురు ప్రేమలో పడిందని అర్థం అవుతుంది.
విశ్వనాథ్ రిషిని తన ఇంటికి పిలిపించి తన కూతురుని పెళ్ళి చేసుకుని పోషించడానికి అతని అర్హతలేమిటో నిరూపించుకోమంటాడు. అందుకు రిషి సరైన సమాధానం చెప్పకపోవడంతో ఒక కోటి రూపాయలు అతనికిచ్చి తన కూతురిని మరిచిపొమ్మంటాడు. రిషి ఆ డబ్బును తిరిగిచ్చేస్తాడు. తన పడే బాధ ఎలా ఉంటుందో తెలియాలని విశ్వనాథ్ ఒక యాచకుడిని రిషి చెల్లికి పెళ్ళిసంబంధంగా తీసుకెళ్తాడు. దాంతో రిషి కుటుంబం చాలా బాధ పడుతుంది. రిషి విశ్వనాథ్ ఆఫీసుకు వెళ్ళి అక్కడి కంప్యూటర్లు, వస్తువులు ధ్వంసం చేసే వస్తాడు. తన చెల్లిలికి, బిచ్చగాడికీ మధ్య ప్రేమ లేదనీ, కానీ తనకు, అంజలికి మధ్య ప్రేమ ఉందని వాదిస్తాడు. అంజలి రిషిని తలుచుకుని బాధ పడుతుంటుంది. కూతురు బాధను చూడలేని విశ్వనాథ్ ఆమెను తన దగ్గర పనిచేసే వేరే అతనికి ఇచ్చి పెళ్ళి చేయాలని చూస్తాడు. అంజలి నేరుగా రిషి ఇంటికి వెళ్ళిపోయి వెంటనే తనను పెళ్ళి చేసుకోమని కోరుతుంది. కానీ రిషి అది సరైన పద్ధతి కాదని ఆమెకు నచ్చజెప్పి ఆమెను తిరిగి వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాడు. చివరికి అంజలికి రిషి పట్ల ఉన్న ప్రేమను తెలుసుకుని విశ్వనాథ్ వాళ్ళిద్దరి పెళ్ళి జరిపించడంతో కథ ముగుస్తుంది.
==తారాగణం==
* తరుణ్
* శ్రీయ
* ప్రకాష్ రాజ్
*[[చంద్రమోహన్]] - తరుణ్ తండ్రి
*[[సుధ (నటి)]] - తరుణ్ తల్లి
|