బాలగంగాధర తిలక్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ని → ని (2), గా → గా , లను గురించి → ల గురించి , → using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| organization = [[భారత జాతీయ కాంగ్రెస్]]
}}
'''బాలగంగాధర తిలక్ / బలవంత్ గంగాధర్ తిలక్''' (Bal Gangadhar Tilak) ([[మరాఠీ]]: बाळ गंगाधर टिळक) ([[జూలై 23]], [[1856]] - [[ఆగష్టు 1]], [[1920]]) ని [[భారతజాతీయోద్యమం|భారతజాతీయోద్యమ]] పితగా పేర్కొంటారు. ఆయనకు ముందు జాతీయోద్యమం లేదని కాదు. కానీ ఆయన జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించాడు. దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో ఆయన పాత్ర అద్వితీయమైనది. అందుకే ఆయన్ను భారతదేశంలో [[బ్రిటిష్ ప్రభుత్వం|బ్రిటిష్ ప్రభుత్వానికి]] వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడు (Father of India's unrest) గా భావిస్తారు. ఈయనకు లోకమాన్య అనే [[బిరుదు]] కూడా ఉంది.
 
== బాల్యం ==
బాలగంగాధర తిలక్ [[1856]] [[జూలై 23]]వ తేదీన [[మహారాష్ట్ర]] రాష్ట్రంలోని [[రత్నగిరి]]లో జన్మించాడు. ఆయన తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ ఒక [[సంస్కృతము|సంస్కృత]] పండితుడు, మంచి [[ఉపాధ్యాయుడు]]. తన బాల్యంలో[[పిల్లలు|బాల్యం]]<nowiki/>లో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించి [[గణితశాస్త్రం]]లో ఆయన విశేష [[ప్రతిభ]] కనబరచేవాడు. చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణమాయనది. నిజాయితీతో బాటు ముక్కుసూటితనం ఆయనకు సహజం. కళాశాలకు[[కళాశాల]]<nowiki/>కు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో ఆయనొకడు.
 
తిలక్ కు పదేళ్ళ వయసున్నప్పుడు ఆయన తండ్రికి రత్నగిరి నుంచి [[పుణె]]కు బదిలీ అయింది. ఇది తిలక్ జీవితంలో పెనుమార్పు తీసుకువచ్చింది. ఆయన అక్కడ ఆంగ్లో-వెర్నాకులర్ పాఠశాలలో చేరి కొందరు ప్రసిద్ధి చెందిన ఉపాధ్యాయుల వద్ద విద్యనభ్యసించాడు. ఐతే పూణెకు వచ్చిన కొంతకాలానికే ఆయన తన తల్లిని, పదహారేళ్ళ వయసులో తన తండ్రిని కోల్పోయాడు. [[మెట్రిక్యులేషన్]] చదువుతున్నప్పుడే ఆయనకు సత్యభామ అనే పదేళ్ళ అమ్మాయితో పెళ్ళయింది. మెట్రిక్ పాసయ్యాక ఆయన దక్కన్ కళాశాలలో చేరాడు. [[1877]]లో ఆయన గణితశాస్త్రంలో ప్రథమశ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత ఆయన తనచదువును కొనసాగించి L.L.B. పట్టా కూడా పొందాడు.
<!--[[బొమ్మ:BalagangadharaTilak.jpg|right|300pix|thumb|తిలక్]]-->
 
== భారత జాతీయ కాంగ్రెస్ తో సంబంధాలు ==
తిలక్ 1890లో కాంగ్రెస్ లో సభ్యుడుగా చేరాడు. కానీ త్వరలోనే ఆయనకు కాంగ్రెస్ మితవాద రాజకీయాలపై నమ్మకం పోయింది. స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గమని ఆయన నమ్మాడు. అప్పటివరకు [[కాంగ్రెస్]] ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరివారంలో మూడు రోజులపాటు సమావేశమై బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను "pray, petition, protest" చెయ్యడానికే పరిమితమైంది. తిలక్ దాని గురించి చాలా ఘాటైన విమర్శలు చేశాడు: "మీరు సంవత్సరానికొకసారి మూడు రోజులపాటు సమావేశమై కప్పల మాదిరి బెకబెకలాడడం వల్ల ప్రయోజనం లేదు." అని, "అసలు కాంగ్రెస్ సంస్థ అడుక్కునేవాళ్ళ సంఘం (బెగ్గర్స్ ఇన్స్టిట్యూషన్)" అన్నాడు. కాంగ్రెస్ సమావేశాలను ''3-డే తమాషా''గా అభివర్ణించాడు. "స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని నేను పొంది తీరుతాను." అని గర్జించాడు. [[1907]]లో మహారాష్ట్రలోని [[సూరత్‌]]లోసూరత్‌లో జరిగిన సమావేశంలో [[కాంగ్రెసు|కాంగ్రెస్]] చీలిపోయింది. మితవాదులు కాంగ్రెస్ పై తమ పట్టును నిలబెట్టుకున్నారు. అతివాదులుగా పిలవబడే తిలక్, ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. తిరిగి [[1916]]లో [[లక్నో]]లో జరిగిన సమావేశంలో అంతా ఒకటయారు. అదే సమావేశంలో కాంగ్రెస్ కు, [[ముస్లిం లీగు]]కు మధ్య లక్నో ఒప్పందం కుదిరింది.
 
== విద్యావిధానం ==
ఆయన పాశ్చాత్యవిద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిచాడు - అది భారతీయ సాంస్కృతికవారసత్వాన్ని అగౌరవపరచి భారతీయ విద్యార్థులను చిన్నబుచ్చేవిధంగా ఉందని. ప్రజలకు మంచి విద్యను అందించడం ద్వారానే వాళ్ళను మంచి పౌరులుగా మార్చవచ్చనే ఉద్దేశం ఆయనది. ప్రతి భారతీయుడికి/రాలికి భారతీయ సంస్కృతి గురించి, భారతదేశపు ఔన్నతాన్ని గురించి బోధించాలని ఆయన ఆశయం. అందుకే [[అగార్కర్]], [[విష్ణుశాస్త్రి చిప్లుంకర్]] లతో కలిసి "[[దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ]]"ని స్థాపించాడు.
 
== పాత్రికేయవృత్తిలో ==
ఆ తర్వాత తాను నడిపిన పత్రికలు "[[మరాఠా]](ఆంగ్ల పత్రిక)", "[[కేసరి]]([[మరాఠీ]] పత్రిక)" లలో మొద్దు నిద్రపోతున్న భారతీయులను మేల్కొల్పడానికి పదునైన భాషలో బ్రిటిష్ పాలనలోని వాస్తవ పరిస్థితుల గురించి వివరంగా రాశాడు. బాల్యవివాహాలను[[బాల్యవివాహాలు|బాల్యవివాహాల]]<nowiki/>ను నిరసించి [[వితంతు వివాహం|వితంతు]] వివాహాలను స్వాగతించాడు
 
== ఇతర కార్యక్రమాలు ==
జాతీయస్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ అవకాశాన్నీ ఆయన వదిలిపెట్టలేదు. మొట్టమొదటిసారిగా [[శివాజీ ఉత్సవాలు|శివాజీ ఉత్సవాలను]], [[గణపతి ఉత్సవాలు|గణపతి ఉత్సవాలను]] పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజలను సమీకరించడం, వారిని జాతీయోద్యమం వైపు నడిపించడం ఆయనే మొదలుపెట్టాడు. తన పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే రాతలు రాసినందుకు [[1897]]లో ఆయనకు ఒకటిన్నరేళ్ళు కారాగారశిక్ష పడింది. విడుదలయ్యాక ఆయన [[స్వదేశీ ఉద్యమం|స్వదేశీ ఉద్యమాన్ని]] ప్రారంభించాడు. [[1906]]లో దేశద్రోహం నేరం క్రింద ఆయనకు ఆరేళ్ళు ప్రవాసశిక్ష విధించారు. కారాగారంలో ఉన్నప్పుడే ఆయన "[[గీతారహస్యం]]" అనే పుస్తకం రాశాడు. ఆయన చరిత్రకారుడు కూడా. [[ఆర్యులు]] [[ఆర్కిటిక్]] ప్రాంతం నుంచి వచ్చారని ఆయన అభిప్రాయం.
 
== హోంరూల్ లీగ్ ==
[[1916]] ఏప్రిల్ లో [[హోంరూల్ లీగ్]]నులీగ్ను స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ మధ్యభారతదేశంలో గ్రామగ్రామానా తిరిగాడు. [[అనీబిసెంటు]] అదే సంవత్సరం [[సెప్టెంబర్]]లో మొదలుపెట్టి హోంరూల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది. ఆ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ఒక కోర్టుకేసులో ఆయన [[లండను]]కు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే, అంటే [[1917]] ఆగస్టులో అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ [[మాంటేగు]] "బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైన భారతదేశంలో[[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి వీలుగా అన్ని పాలనాంశాల్లో భారతీయులకు అధిక ప్రాధాన్యాన్నివ్వడమే ప్రభుత్వ విధానమని" బ్రిటిష్ ప్రభుత్వం తరపున ప్రకటించాడు. బాధ్యతాయుత ప్రభుత్వమంటే ఎవరికి బాధ్యత వహించే ప్రభుత్వమో, అధిక ప్రాధాన్యమంటే ఎంత ప్రాధాన్యమో, అసలు అది ఎప్పుడిస్తారో ఏదీ స్పష్టంగా లేదు. కానీ [[బ్రిటిషు|బ్రిటిష్]] ప్రభుత్వ నిజాయితీని నమ్మిన అనీబిసెంటు ఆ ప్రకటనతో ఉద్యమాన్ని అపేసి ప్రభుత్వానికి తన మద్దతు ప్రకటించింది. అలా ఇద్దరు నాయకులదీ చెరొకదారీ కావడంతో హోంరూల్ ఉద్యమం చల్లబడిపోయింది. కానీ ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది. అందుకే [[1920]]లో ([[ఆగస్టు]] 1వ తేదీ) తిలక్ చనిపోయినప్పుడు జాతీయోద్యమం [[చుక్కాని]] లేని నావ అవుతుందని చాలా మంది భయపడ్డారు.
 
"[[మహాత్మా గాంధీ|గాంధీ]] అని ఇంకొకాయన ఉన్నాడు గానీ....అబ్బే! తిలక్ ముందర ఏపాటి?" అనుకున్నారు. కానీ "నాయకులు చరిత్రను సృష్టించరు. చరిత్రే నాయకులను సృష్టిస్తుంది." అనే మాటను నిజం చేస్తూ అతి సామాన్యుడిగా [[జీవితం]] ప్రారంభించిన గాంధీ తిలక్ మరణంతో ఏర్పడ్డ శూన్యాన్ని అసామాన్యంగా భర్తీ చెయ్యడమే గాక మహాత్ముడి స్థాయికి ఎదిగాడు.
 
==మూలా లు==
"https://te.wikipedia.org/wiki/బాలగంగాధర_తిలక్" నుండి వెలికితీశారు