త్రిజట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[File:Trijatha solo.jpg|thumb|right|200px|త్రిజట]]
'''త్రిజట''', [[రామాయణం]]లో ఒక వృద్ధ రాక్షస స్త్రీ పాత్ర. రావణుడు [[సీత]]ను ఎత్తుకొని పోయి
==సుందరకాండలో==
కామాతురుడైన [[రావణుడు]] సీతను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. సీత ఒక గడ్డిపరకను అడ్డముగా పెట్టుకొని, రావణుని ధర్మహీనతను, భీరత్వాన్ని నిందించింది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నించ సాగారు. రావణునికి వశం కాకపోతే ఆమెను తినేస్తామని బెదరించారు. భయంతో, ఆశను కోల్పోయిన సీత ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకొన్నది. సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంత మిగిలిన రాక్షస స్త్రీలను గద్దించి, [[సీత]] వంటి పుణ్య స్త్రీకి హాని చేయడం [[రాక్షస]] జాతికి వినాశకరమని హెచ్చరించింది. తనకు వచ్చిన కలలో ఇలా జరిగిందని చెప్పింది -
"వేయి హంసలు పూన్చిన తెల్లని ఏనుగుదంతపు పల్లకీలో రామలక్ష్మణులు లంకకు వచ్చారు. తెల్లని పర్వతాగ్రంపై సీత ఆసీనయై ఉంది. ఆమె సూర్య చంద్రులను స్పృశించింది. నాలుగు దంతాలు కలిగిన తెల్లని ఏనుగు నెక్కి, రాముని ఒడిలో సీత యున్నది. సీతారామలక్ష్మణులు అధివసించిన భద్రగజం ఆకాశంలో లంకపైభాగాన నిలిచింది. ఎనిమిది వృషభములు పూన్చిన రథంపై రాముడు తెల్లని వస్త్రాలతో, సీతా లక్ష్మణులతో లంకలో కనిపించాడు. తరువాత వారంతా పుష్పకం ఎక్కి [[ఉత్తర]] దిశగా వెళ్ళారు.
"ఎర్రని వస్త్రములు ధరించి, తైలము పూసుకొని రావణుడు మత్తిల్లి పుష్పకంనుండి క్రింద పడ్డాడు. గాడిదలు పూన్చిన రధంలో ఉన్నాడు. అతని మెడలో త్రాడు కట్టి, నల్లని వస్త్రములు ధరించిన ఒక స్త్రీ దక్షిణానికి లాగుచుండెను. అతడు దుర్గంధ నరక కూపంలో పడిపోయాడు. రావణుడు పందినెక్కి, కుంభకర్ణుడు పెద్ద ఒంటెనెక్కి, ఇంద్రజిత్తు మొసలినెక్కి దక్షిణ దిశగా పోయారు. విభీషణుడు మాత్రం తెల్లని
ఇలా చెప్పి, తమను ఆపదనుండి కాపాడమని సీతాదేవిని వేడుకొనమని తక్కిన రాక్షస కాంతలకు త్రిజట హితవు పలికింది. భయంకరమైన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు.
పంక్తి 16:
వారందరూ సీతను [[పుష్పక విమానం]]పై తీసుకొని వెళ్ళి యుద్ధరంగంపైన ఆపారు. దే్హమంతా బాణాలు కప్పివేయగా నేలపైబడియున్న రామలక్ష్మణులను చూచి సీత విలపించసాగింది. అప్పుడు సీతను త్రిజట ఇలా ఊరడించింది-
వైదేహీ! నువ్వు అనవుసరంగా శోకించకు. నీ [[భర్త]] విగత జీవుడు కాలేదు. రామలక్ష్మణులు కేవలం వివశులైయున్నారనడానికి నాకు పెక్కు లక్షణాలు కనిపిస్తున్నాయి - వీరి ముఖాలలో ఇంకా కోప చిహ్నాలు కనిపిస్తున్నాయి. నీరి ముఖాలలో ఇంకా కళ తప్పలేదు. సైన్యం చెల్లా చెదురు కాకుండా వారిని శ్రద్ధగా కాపాడుకొంటున్నది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ దివ్యమైన పుష్పకం భర్తృహీనను మోయదు. కనుక [[రాముడు|రామ]] [[లక్ష్మణుడు|లక్ష్మణులు]] బ్రతికే ఉన్నారని కచ్చితంగా చెప్పగలను. ఇదంతా నేను నీమీది స్నేహంతో చెబుతున్నాను. నేను ఏనాడూ అబద్ధం ఆడను. నీవు శీలవతివి గనుక నా మనసును ఆకర్షించావు - అని సీతను అనునయించింది. సీత తన చేతులు జోడించి ''నీ మాటే సత్యం కావాలి'' అంది.
==ప్రస్తావన==
ర|| విభీషణుని కూఁతురు. సీత రావణునిచేత పట్టువడి ఉండు
==విశేషాలు==
గుంటూరు శేషేంద్ర శర్మ వివరణ ప్రకారం త్రిజటా స్వప్నము [[గాయత్రీ మంత్రము|గాయత్రీ మంత్ర]] సంయుక్తము. రామాయణంలోని 24 వేల శ్లోకాలలో 12001వ శ్లోకం త్రిజటా స్వప్నంలో ఉంది. కనుక రామాయణం అనే హారానికి ఇది నాయక మణి. "త్రిజట" అనుటలోనే
==ఇవి కూడా చూడండి==
|