సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
చంద్రశేఖర్ [[చెన్నై]]<nowiki/>లోని హిందూ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. తరువాత చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలో [[భౌతిక శాస్త్రము|భౌతిక శాస్]]<nowiki/>త్రంలో బీయెస్సీ ఆనర్స్ పట్టా పొందాడు. ఆయన బీయెస్సీ చదివే రోజుల్లో ఆర్నాల్డ్ సోమర్‌ఫెల్డ్ అనే శాస్త్రజ్ఞుడు మద్రాసులో ఇచ్చిన ఉపన్యాసం విని ప్రేరణ పొందాడు. ప్రభుత్వ ఉపకార వేతనంతో 1930 లో ఇంగ్లండు వెళ్ళి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ట్రినిటీ కళాశాలలో ప్రొఫెసర్ ఫౌలర్ వద్ద పరిశోధన ప్రారంభించాడు.
 
ఆయనకు అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్రం అంటే ఆసక్తి. ఇంగ్లండుకు వెళ్ళక ముందే విశ్వాంతరాళంలో నక్షత్రాలు ఏర్పడే విధానం, తారలలో జరిగే పరిణామాలు, వాటి స్థిరత్వం తదితర అంశాలపై [[పరిశోధన]]<nowiki/>లు జరిపి శాస్త్రజ్ఞులలో గుర్తింపు పొందాడు. ట్రినిటీ కళాశాలలో ఆయన చేసిన పరిశోధనలకుగాను, 1933 వ సంవత్సరంలో అంతరిక్ష శాస్త్రంలో డాక్టరేట్ ప్రధానంప్రదానం చేశారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం ఇరవై మూడేళ్ళు మాత్రమే.
 
==పరిశోధనలు==