పరవస్తు వెంకట రంగాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
వెంకట రంగనాధస్వామి అయ్యవార్లు (1875 -1918) రంగాచార్యుల వారి జేష్ఠ పుత్రులు. మహా మహోపాధ్యాయ బిరుద విరాజితులగు రంగాచార్యుల వారు తమ జీవిత చరమదశలో [[పెద్దాపుర సంస్థానం]] పరిశిష్టమైనటువంటి కోఠాం ఎస్టేటు వారి ఆస్థానమున పండితులుగా వుండిరి. <ref>ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణము - డా తూమాటి దోప్పన్న పేజి నం 275 యీయున్ని వేంకట వీర రాఘవా చార్యులు, పరవస్తు పండిత త్రయము, ఆంధ్రప్రత్రిక సంవత్సరాది సంచిక, [[అంగీరస]], 1932, పుటలు, 181-184.</ref>
 
ఎనిమిదేళ్ల వయసులోనే సంస్కృతములో 'కుంభకర్ణ విజయము' అనే కావ్యమును[[కావ్యము]]<nowiki/>ను రచించాడు. [[ఉర్లాం]], [[విజయనగరం]] మరియు [[మైసూరు]] మహారాజులు ఈయనను గౌరవించి సత్కరించారు. అన్నింటి కంటే మించి ఈయన శతావధానములో నిష్ణాతుడై ''మహా మహోపాధ్యాయ'' అన్న బిరుదు పొందినాడు. ఈయన తెలుగు సాహిత్యములో శ్రేష్ఠ గ్రంధాలుగా ఎన్నదగిన ''కమలిని కలహంసము'', ''వేద రహస్యము'' మరియు ''మంజుల నైషదము'' లను రచించాడు.
 
తెలుగు వాజ్ఞ్మయము వ్యాపనకు ఈయన సలిపిన [[కృషి]] అత్యంత ప్రశంసనీయము. రంగాచార్యులు [[భారతదేశము]]లో క్రైస్తవ మత బోధనలను వ్యతిరేకించాడు. హిందూ తత్వము మరియు సంస్కృతులకు గట్టి మద్దతునిచ్చాడు. ఈయన చివరి రోజులు [[తుని]]లో గడిపాడు.
 
పూర్వము తెలుగులో పదకోశములు పద్య రూపములోనే ఉండేవి. తరువాత అకారాది క్రమములో [[నిఘంటువులు]] వ్రాసే ప్రయత్నము జరిగినది. [[రాబర్ట్ కాల్డ్వెల్]] గారు, [[చార్లెస్ ఫిలిప్ బ్రౌన్]] గారు ఈ విషయములో ప్రధమముగా కృషి చేసిన మహనీయులు.
 
[[పరవస్తు వెంకట రంగాచార్యులు]] గారు తెలుగులో ప్రప్రధమముగా ఒక [[విజ్ఞాన సర్వస్వము]]ను ఆరంభించిన కృషీవలులు. ఆయన 40 సంవత్సరములు శ్రమించి "అ", "ఆ" వరకు మాత్రము పూర్తి చేయగలిగినారు. తరువాత బృహత్కార్యక్రమము [[కొమర్రాజు లక్ష్మణరావు]] గారు చేపట్టారు.
 
ప్రత్యేకించి ఈ "[[తెలుగు వికీపీడియా]]" కార్యక్రమము కొనసాగుతున్న నేపథ్యములో ఆయనను స్మరించుకొనుట మన కర్తవ్యము.