పి.ఎస్.ఆర్. అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
’తెలుగు నాటకవికాసం‘ అనే అంశంపై పరిశోధన చేసి 1961 లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుంచి డాక్టరేట్ పట్టా స్వీకరించాడు. తెలుగు నాటక రంగాన్ని గురించిన సర్వ సమగ్రమైన గ్రంథమిది. 1967లో ఈ గ్రంథం వెలువడిన నాటినుంచి నాటకరంగానికి ప్రామాణిక గ్రంథంగా విరాజిల్లుతుంది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
 
అప్పారావు వృత్తిరీత్యా అధ్యాపకుడు. [[భీమవరం]], [[రాజమహేంద్రవరం]], [[మద్రాసు]], [[కడప]], శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీల్లోనూ, [[చెన్నై|మద్రాసు]] ప్రెసిడెన్సి కాలేజీలోనూ కొంతకాలం ఉపస్యాసకుడిగా పనిచేశాడు. విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం లోను పాఠ్యగ్రంథ జాతీయకరణ ప్రత్యేకోద్యోగిగా పనిచేశాడు.
 
అప్పారావు 1987 లో కలకత్తాలో జరిగిన విశ్వ ఉన్నయన్ సంసద్లో ''రాష్ట్ర నాట్య సామ్రాట్'' బిరుదును, 1990లో హైదరాబాదు యువ కళావాహిని వారిచే ''నాటక రత్న'' బిరుదాన్ని, 1992 లో శ్రీకాళహస్తి భరతముని ఆర్ట్స్ అకాడెమీ వారిచే ''[[కళారత్న]]'' బిరుదాన్ని అందుకున్నాడు.<ref>[http://books.google.com/books?id=QA1V7sICaIwC&pg=PA54&lpg=PA54&dq=ponangi+apparao#v=onepage&q=ponangi%20apparao&f=false Who's who of Indian Writers, 1999: A-M edited by Kartik Chandra Dutt]</ref>
 
భరతముని ‘నాట్యశాస్త్రం’ను తెలుగులో అనువదించి ప్రపంచానికి అందించాడు. ఈ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి లభించింది.