వేదాంతం కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Vedantam kamaladevi.jpg|right|thumb|వేదాంతం కమలాదేవి]]
'''వేదాంతం కమలాదేవి''' (1897 - 1940) ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు మరియు ప్రముఖ సంఘసేవకురాలు.ఆమె ఆదర్శ కాంగ్రేసువాదిగా సంఘంలో తమకంటూ ఒక ప్రత్యెక స్థానం సంపాదించుకొన్న సుప్రసిద్ధ [[తెలుగు]] మహిళలలో ఒకరు.
==జీవిత విశేషాలు==
ఆమె [[1897]] [[మే 5]] వ తేదీన కడప జిల్లా [[రాజంపేట]] తాలూకా [[నందలూరు]] గ్రామంలో భ్రమరాంబ, ప్రతాపగిరి గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించారు.<ref>కమలాదేవి, వేదాంతం (1897 - 1940), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ. 63-64.</ref> ఈమెకు 12 ఏటనే వేదాంతం కృష్ణయ్యతో [[పెళ్ళి|వివాహం]] జరిగింది. వైద్యవిద్య చదువుతున్న భర్తకు తోడుగా [[కలకత్తా]]లో ఉంటున్నప్పుడు అక్కడి ప్రముఖ సంఘ సేవికురాలు శ్రీమతి సుప్రభాదేవితో ఏర్పడిన పరిచయసాన్నిహిత్యం వలన విశేషంగా ప్రభావితమైంది.
==స్వాతంత్ర్యోద్యమంలో..==
1920 లో [[కాకినాడ]]లో స్థిరపడిన పిమ్మట జాతీయోద్యమపోరాటంలో పాల్గొనడం ప్రారంభించారు.విదేశీ వస్త్ర బహిష్కరణ, నూలు వడకడం, ఖద్దరు ప్రచారం చేసారు. దేశ బాందవి [[దువ్వూరి సుబ్బమ్మ]] గారిని ఆదర్శంగా తీసుకొని 1921 లో [[సహాయ నిరాకరణోద్యమం]]లో పాల్గొన్నారు. తిలక్ స్వరాజ్య నిధికి అనేకమంది దాతల నుండి భారీ విరాళాలు స్వీకరించి గాంధీజి ప్రశంసలను పొందారు. 1923 లో [[కాకినాడ]]లో అఖిల భారత కాంగ్రేస్ సభలు జరిగినప్పుడు మహర్షి [[బులుసు సాంబమూర్తి]] ప్రోత్సాహంతో మహిళా కార్యకర్తల దళానికి నాయకురాలిగా విశెషసేవలు అందించారు<ref>[https://books.google.co.in/books?id=5dqRvDui1-4C&pg=PA71&lpg=PA71&dq=vedantam+kamaladevi&source=bl&ots=y1DI5gDZrx&sig=aSMTsWwj8nEYC4sdw7I_nrXGnM0&hl=te&sa=X&ved=0CB4Q6AEwAGoVChMIt8KqyqCKxwIVRAqOCh3N-wHL#v=onepage&q=vedantam%20kamaladevi&f=false salt satyagraha in the costal andhra districts]</ref>.
పంక్తి 9:
ఒక ప్రక్క స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటూనే, మహిళలలో జాగృతికై కృషి చేసారు.స్రీలలో జాతీయభావాలు ప్రేరేపించేవారు.ప్రాథమిక విద్యావ్యాప్తికి తోడ్పడ్డారు. [[పక్షవాతం]]తో సరిగా తిరగలేని స్థితిలో కూడా సేవానిరతిని కోల్పోలేదు. అస్వస్థత కారణంగా తన స్వగృహం ఆనంద నిలయాన్నే అనాథ శరణాలయంగా మార్చి సేవాకార్యక్రమాలు నిర్వహించేవారు.
 
[[ఉప్పు సత్యాగ్రహం]] ఉద్యమాన్ని విశాఖపట్నంలో నిర్వహించే బాధ్యతను బులుసు సాంబమూర్తి అప్పచెప్పినపుడు ఆ బాధ్యతను చక్కగా నిర్వహించారు. [[ఉప్పు సత్యాగ్రహం]]లో భాగంగా [[నౌపడ]] లోని ఉప్పు క్షేత్రాల దగ్గర సత్యాగ్రహం చేసి అక్కడే 1930 మే 20 న అరెస్ట్ అయ్యారు<ref>[https://books.google.co.in/books?id=JT_qqzH3f3IC&pg=PA138&lpg=PA138&dq=vedantam+kamaladevi&source=bl&ots=P5e42_SAKn&sig=mi1wPwK2mmv8OmWTzaDBa8pi2rk&hl=te&sa=X&ved=0CCMQ6AEwAWoVChMIt8KqyqCKxwIVRAqOCh3N-wHL#v=onepage&q=vedantam%20kamaladevi&f=false Gandhi, Women, and the National Movement, 1920-47]</ref>.ఫలితంగా [[రాయవెల్లూరు]]లోరాయవెల్లూరులో 6 నెలల పాటు జైలుశిక్ష అనుభవించారు. 1931 లో [[ఇచ్చాపురం]]లో జరిగిన గంజాం జిల్లా మహిళాసభకు అద్యక్షత వహించారు. 1932 లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం తీవ్రదశలో ప్రభుత్వం కాంగ్రెసు సమావేశాలకు అడ్డుపడుతున్నప్పుడు ప్రకటించిన చోటులో కాకుండా వేరొక చోటులో కాంగ్రేసు సమావేశాలు జరిగేవి. ఆ పద్ధతిలో వేదాంతం కమలాదేవి [[గుంటూరు]]లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ మహా సభను తెల్లవారుజామున ప్రకటించిన ప్రకారమే నిర్విఘ్నంగా జరిపి తన అద్యక్షతన తీర్మానాలు అమోదించారు. మళ్ళీ రెండవసారి రాయవెల్లూరులో 6 నెలలు జైలుశిక్ష అనుభవించారు. జైలు నుండి విడుదలైన తరువాత తన [[ఆరోగ్యము|ఆరోగ్యం]] సహకరించకున్నా రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రేసు ప్రచారం చేసారు. 1935 చట్టం ప్రకారం 1937 లో జరిగిన ఎన్నికలలో కాంగ్రేసు అభ్యర్థుల విజయానికి ఎంతో కృషి చేసారు.
 
ఆమె 1929లో, 1930లో,1934లో అఖిల భారత కాంగేసు స్థాయి సంఘ సభ్యులుగా ఉన్నారు. మూడుసార్లు [[కాకినాడ]] మున్సిపల్ కౌన్సిలర్ గా ఉన్నారు. ఢిల్లీలో [[సరోజినీ నాయుడు]] పర్యవేక్షణలో జరిగిన జాతీయ మహాసభలో ఉత్తేజపూరితమైన ప్రసంగం చేసినందులకు ఈమెకు 6 నెలలు [[కారాగారము|జైలు]] శిక్ష విధించారు.
 
ఈమె [[1940]], [[జూలై 14]] వ తేదీన తన 43 వ ఏట [[పక్షవాతం|పక్షవాత]] కారణంగా మృతిచెందారు.
 
[[మహాత్మా గాంధీ]] పిలుపికి స్పందించిన మహిళగా స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొని జైలు శిక్షలనుభవించి, సేవా నిరతితో సంఘ సేవా కార్యకలాపాలతో పాల్గొన్న శ్రీమతి వేదాంతం కమలాదేవి భావితరం మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వేదాంతం_కమలాదేవి" నుండి వెలికితీశారు