నిజామియా పరిశోధనా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Ahmed Nisar (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
ప్రపంచంలోనే ఒక అరుదైన ఖగోళ పరిశోధనా సంస్థగా కీర్తి గడించిన వాటిల్లో మొదటిది '''నిజామియా పరిశోధనా సంస్థ'''. దీనిని నిజామియా అబ్జర్వేటరీ అని కూడా అంటారు. ఇది [[హైదరాబాద్]] లోని [[అమీర్పేట]] లో ఉంది. ఇక్కడ [[ఖగోళ శాస్త్రము|ఖగోళ శాస్త్ర]] పరిశోధనలు పెద్ద ఎత్తున జరిగాయి.
1909 ప్రాంతంలో ఇక్కడ ఖగోళదర్పణిని ఏర్పాటు చేశారు. ఇది [[భూకంపాలు|భూకంపాల]] సమాచారాన్ని, వాతావరణ ఉష్ణోగ్రతల్లోని మార్పులతో పాటు సమయాన్ని కూడా కూడా సూచించేది. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నెలకొల్పాక, ఈ సంస్థను [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] పరిధిలోకి బదిలీ చేశారు. ప్రత్యేకంగా ఖగోళ శాస్త్ర ప్రయోగశాల కలిగి ఉన్న ఘనకీర్తి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దక్కింది. నోబెల్ బహుమతి పొందిన సర్ [[సి.వి. రామన్]], ప్రొఫెసర్ [[ఎస్.చంద్రశేఖర్]] వంటి శాస్త్రవేత్తలు దీనిని సందర్శించారు. ఇందులో పనిచేసిన అనేకమంది పరిశోధకులు
== మంత్రిగారి కోరిక ==
6వ నిజాం నవాబ్ '''మీర్ మహబూబ్ అలీఖాన్''' ఆస్థాన మంత్రి '''నవాబ్ జఫర్ జంగ్'''కు ఖగోళ శాస్త్రంపై మక్కువ ఎక్కువ. ఆయన [[ఇంగ్లాండ్]]లో చదువుకున్నాడు. 15 అంగుళాల గ్రబ్ రిఫ్రాక్టర్ను ఇంగ్లాండ్ నుంచి కొనుగోలు చేసి హైదరాబాద్లో ఒక పెద్ద ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీగా నెలకొల్పాలని ప్రతిపాదించాడు. ఈ మేరకు ఆనాటి ఆరో నిజాంకు 1901 సెప్టెంబర్ 29న ఒక లేఖ రాశాడు. మీరు కనుక అనుమతిస్తే హైదరాబాద్లో మీ పేరు మీద ‘నిజామియా అబ్జర్వేటరీ’ నెలకొల్పాలని తాను భావిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నాడు. నిజాం వెంటనే అంగీకరిస్తూ ఫర్మానా విడుదల చేశాడు.
తర్వాత, నవాబ్ జఫర్జంగ్ హైదరాబాద్కు ఆగ్నేయంగా పిసల్బండలో తన సొంత ఎస్టేట్లో సంస్థని నెలకొల్పాడు. నవాబ్ జఫర్ జంగ్ మరణించాక, ఆయన [[వీలునామా]] ప్రకారం ఈ అబ్జర్వేటరీని నిజాం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అప్పట్లో నిర్జనంగా ఉన్న అమీర్పేటకు తరలించింది. తర్వాత ఈ ప్రాంతంలో సెంటర్ ఫర్ ఎకనామిక్ సోషియల్ స్టడీస్ను ఏర్పాటు చేశారు.
== అవసాన దశ ==
|