మందుముల నరసింగరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
== జననం ==
[[పాలమూరు జిల్లా]] కు చెందిన సమరయోధులలో ప్రముఖుడైన '''మందుముల నరసింగరావు''' [[మార్చి 17]], [[1896]] న ప్రస్తుత [[రంగారెడ్డి జిల్లా]] [[చేవెళ్ళ]] లో జన్మించాడు. [[తలకొండపల్లి]] మండల కేంద్రానికి చెందిన నరసింగరావు న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. [[పర్షియన్]] భాషలో కూడా ఇతను గొప్ప పండితుడు మరియు ప్రముఖ పత్రికా రచయితగా పేరుపొందాడు. 1921లో ఆంధ్రజనసంఘాన్ని స్థాపించిన వారిలో ఒకడు. 1927లో న్యాయవాదవృత్తికి స్వస్తి చెప్పి పత్రికారచన, రాజకియాలుచేపట్టారు. 1927లో [[రయ్యత్]] అనే ఉర్దూ వార్తాపత్రిక స్థాపించి సంపాదక బాధ్యతలు చేపట్టాడు<ref>పాలమూరు ఆధునిక యుగకవుల చరిత్ర, రచన ఆచార్య ఎస్వీ రామారావు, పేజీ 151</ref>. మందుముల సమరరంగంలో కూడా కీలకపాత్ర వహించి 1937లో [[ఇందూరు]] ([[నిజామాబాదు]]) లో జరిగిన 6వ [[ఆంధ్రమహాసభ]]కు అధ్యక్షత వహించాడు.<ref>చరితార్థులు మన తెలుగు పెద్దలు, రచన [[మల్లాది కృష్ణానంద్]], పేజీ 241</ref> 1938-42 కాలంలో నిజాం లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నాడు. 1947లో జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయ్యాడు. ఇవేకాక బాల్యవివాహాల రద్దుకు, వితంతు వివాహాలకు బాగా కృషిచేశాడు. 1952లో [[కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి [[కాంగ్రెస్ పార్టీ]] తరఫున [[హైదరాబాదు]] శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957-62 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేశాడు. నిజాం కాలంలోని దుష్పరిపాలనను వర్ణిస్తూ "[[50 సంవత్సరాల హైదరాబాదు]]" గ్రంథాన్ని స్వీయజీవిత చరిత్రగా రచించాడు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/మందుముల_నరసింగరావు" నుండి వెలికితీశారు