భండారు సదాశివరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
198.45.19.113 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2069424 ను రద్దు చేసారు కా |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 39:
==జీవిత విశేషాలు==
===బాల్యము, విద్యాభ్యాసము===
'''భండారు సదాశివరావు''' [[క్రోధన]] నామ సంవత్సరం [[జ్యేష్ఠ శుద్ధ షష్ఠి]]కి సరియైన [[1925]], [[మే 29]]వ తేదీన భండారు వీరరాజేశ్వరరావు, వెంకురామమ్మ దంపతులకు జన్మించాడు. ఇతనికి ఐదుగురు [[అన్నదమ్ములు]], ఐదుగురు అక్కచెల్లెళ్లు. ఇతడు ఆరువేల నియోగి. పరాశర గోత్రీకుడు.
===ఆర్.ఎస్.ఎస్.తో అనుబంధం===
1942 లో కాశీ వెళ్లిన సదాశివరావుకు ఓరుగంటి సుబ్రహ్మణ్యంతో పరిచయమైంది. అతని ద్వారా [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్|రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో]] చేరాడు. స్వయంసేవక్గా కాశీలో శాఖలో శిక్షక్, ముఖ్యశిక్షక్గా బాధ్యతలు నిర్వహించాడు. అక్కడే ఇతడికి ఒటిసి ప్రథమవర్ష పూర్తి అయ్యింది. వరంగల్లుకు తిరిగి వచ్చి రెండవ సంవత్సరం ఒటిసిలో పాల్గొన్నాడు. తరువాత నందిగామలో ప్రచారక్గా నియమించబడ్డాడు. ఆర్.ఎస్.ఎస్.పై మొదటి నిషేధం సమయంలో 6 నెలలు రాజమండ్రి, బందరు జైళ్లలో నిర్భంధంలో ఉన్నాడు.నిషేధం తొలగించబడ్డాక అనంతపురం జిల్లా ప్రచారక్గా 8 నెలలపాటు పనిచేసి 1948లో [[జాగృతి]] పత్రికను ప్రారంభించి దానికి ఆయన సహాయ సంపాదకుడిగా సేవలందించాడు. 1952-54 మధ్యలో గుంటూరు జిల్లాలో వేర్వేరు చోట్ల ప్రచారక్గా ఉన్నాడు. 1954-58ల మధ్య విశాఖ ప్రచారక్గా నియమించబడ్డాడు.
===అనంతర జీవితం===
1959లో ఇతనికి కుసుమతో [[పెళ్ళి|వివాహం]] జరిగింది.
==సాహిత్యసేవ==
జాగృతి పత్రికకు సహసంపాదకునిగా ఉన్నప్పుడు అనేక [[కథలు]] [[వ్యాసాలు]] వ్రాసేవాడు.కలం పేరుతో ఈయన చేసే రచనల్లో వ్యంగ్యం, విమర్శలు ఉండేవి. కె.ఎం.మున్షీ వ్రాసిన జైసోమనాథ్ నవలను తెలుగులో అనువదించి జాగృతిలో ధారావాహికగా ప్రకటించాడు.ఈ నవల బహుళ ప్రచారంలోకి వచ్చింది. 1958లో మహారాణాబాప్పా, మనవారసత్వం మొదలైన పుస్తకాలు రచించాడు. 1954లో భారతీయ రచయితల సమితికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈయన 1975లో జాతీయ సాహిత్య పరిషత్ను స్థాపించి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. కొంతకాలం తరువాత ఈ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నాడు. అఖిల భారతీయ సాహిత్య పరిషత్ను ఏర్పాటు చేసి దానికి కొంతకాలం ట్రస్టీగా, మరికొంతకాలం అధ్యక్షుడిగా ఉన్నాడు. వరంగల్లులో పోతన విజ్ఞానపీఠం సభ్యుడిగా ఉన్నాడు.
==రచనలు==
|