భండారు అచ్చమాంబ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
'''భండారు అచ్చమాంబ''' ([[1874]] - [[1905]]) తొలి తెలుగు కథా రచయిత్రి. ఈమె ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కూర్చిన [[కొమర్రాజు వేంకటలక్ష్మణరావు]]కు అక్క.
==జీవిత విశేషాలు==
అచ్చమాంబ [[గురజాడ అప్పారావు]] కన్నా పదేళ్ళ ముందే 1902 [[నవంబరు]] నెలలో రాసిన కథ ‘ధన త్రయోదశి’ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు. ప్రథమ స్త్రీవాద చరిత్ర కారణి. అయితే ఈ కథ గ్రాంధిక భాషలో వుంది. అచ్చమాంబ [[1874]] వ సంవత్సరంలో [[కృష్ణా జిల్లా]] [[నందిగామ]] దగ్గర [[పెనుగంచిప్రోలు]]లో పుట్టింది. ఈమెకు ఆరేళ్ళ వయసపుడే తండ్రి చనిపోయాడు. 10వ ఏటనే ఈమెకు పెళ్ళయ్యింది. పెళ్ళయ్యే నాటికి అచ్చమాంబ ఏమి చదువుకోలేదు. ఆమె తల్లి, [[తమ్ముడు]] కూడా ఆమెతో పాటే ఉండేవారు. ఆమె తమ్ముడికి చదువు చెప్పించారు కానీ ఈమెను ఎవరూ ప్రోత్సహించలేదు. [[ఎమ్. ఏ]] చదివిన తమ్ముడితో పాటు కూర్చుని తానే చదువుకుంటూ [[తెలుగు]], [[హిందీ]] నేర్చుకొన్నది. ఆమెకు [[ఇంగ్లీషు]], [[గుజరాతీ]]భాషలలో కూడా ప్రవేశం ఉంది.<ref>https://tethulika.wordpress.com/2016/08/14/%e0%b0%ac%e0%b0%b9%e0%b1%81-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7%e0%b0%be%e0%b0%95%e0%b1%8b%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97| బహుభాషాకోవిదులైన తెలుగు రచయితలు</ref>. 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి [[మచిలీపట్నం]]లో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎన్నో స్త్రీల సంఘాలు ఏర్పరచింది. చిన్న వయసులో [[కుమారుడు]], కుమార్తె మరణించడం ఆమెకు తీవ్రమైన దు:ఖాన్ని కల్గించింది. అనాథ పిల్లల్ని చేరదీసి చదువు చెప్పించేది. ఆమె ఇంట్లో ఎపుడు ఐదారుగురు పిల్లలుండి చదువుకుంటూ వుండేవారు. [[1905]] [[జనవరి 18]]వ తేదీన ముఫ్ఫై ఏళ్ళకే మరణించింది.
వివిధ భాషలలో స్త్రీ సాహిత్యం వ్రాసిన రచయిత్రుల గురించి [[భండారు అచ్చమాంబ]] రచనల ద్వారా మనకు తెలుస్తుంది.<ref>{{cite journal|title=ప్రథమ స్త్రీవాద రచయిత్రి - భండారు అచ్చమాంబ|journal=భూమిక|pages=43|doi=జనవరి-మార్చ్ 1993|accessdate=28 December 2014}}</ref>
 
[[కొమర్రాజు వేంకటలక్ష్మణరావు]], ఆయన అక్క భండారు అచ్చమాంబల పరస్పరానురాగం అందరినీ ఆకర్షించేది. ఆమె తమ్ముని విద్యాభివృద్ధికి పాటుపడింది. అక్కగారి సాహిత్యకృషికి, విజ్ఞానానికి [[తమ్ముడు]] చేయూతనిచ్చేవాడు. తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ ''అబలా సచ్చరిత్రమాల'' అనే గ్రంథాన్ని రచించింది. ఇందులో సుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంథాన్ని [[కందుకూరి వీరేశలింగం]] పంతులు తమ ''చింతామణి ముద్రణాలయం''లో ప్రచురించాడు.
 
== అచ్చమాంబ భావాలు==
#స్త్రీల [[బుద్ధి]] పురుష బుద్ధి కన్న మందమనియు, స్త్రీల మెదడు మస్తిష్కము, పురుషుల మస్తిష్కము [[మెదడు]] కన్న బలహీనమగుటచే దక్కువ తూగుననియు వ్రాయు వ్రాత బక్షపాతము కలదనుట నిర్వివాదమే- స్త్రీలు నైసర్గిక మూఢురాండ్రనుటకంటె బాల్యము నుండియు వారికి విద్యాగంధమే సోకనియ్యనందున మూఢురాండ్రుగా నున్నారనుట మంచిది- చిన్నతనమున బాలురు బాలికలు సమబుద్ధి కలవారుగా నున్నను శాస్త్ర విషయముల బ్రవేశ పెట్టనందున [[బురుషులు]] జ్ఞానాధికులును ఎట్టి తెలివిగలదైనను కన్న తల్లిదండ్రులే యామెను పైకి రానీయక మూల మూలల నణగదొక్కుటచే బాలిక మూర్ఖురాలును అగుచున్నవారు. స్త్రీ యభివృద్ధి లేకుండుటకిట్లు మగవారి పక్షపాతమే మూలం కాని మరొకటి కాదు. పురుషులా పక్షపాతమును విడిచిరేని స్త్రీలు విద్యావతులయి భర్తలకర్ధాంగులన్న నామును సార్థకము జేతురు.
#స్త్రీలు అబలలనియు, బుద్ధి హీనులనియు వివేకశూన్యులనియు, సకల దుర్గుణములకు -నివాస స్థలమనియు గొందరు నిందింతురు. స్త్రీలపయిన మోపబడిన ఈ దోషారోపణములన్నియు నబద్ధములనియు స్త్రీలలో నత్యంత శౌర్యధైర్యవతులును, అసామాన్య విద్యావిభూషితులునూ… బూర్యముండిరనియు, నిపుడున్నారు.
#స్త్రీలకు విద్య నేర్పిన యెడలను, వారికి స్వాతంత్య్రమోసగిన యెడలను, వారు చెడిపోవుదురనియు, బతుల నవమానించెదరనియు, గుటుంబ సౌఖ్యమును నాశనము చేసేదరనియు గొందరు మహానుభావులు వక్కాణించెదరు. ఈ యారోపణములన్నియు నిరర్థకములనియు, స్త్రీవిద్య దురాచార ప్రతీకారానుకూలమగునే కాని దురాచార ప్రవృత్త్యనుకూలము గానేరదనియు స్త్రీ విద్యా స్వాతంత్య్రముల వలన దేశమునకు లాభమే గాని నష్టముంగలుగనేరదనియు, స్త్రీ విద్య యత్యంతావశ్యకం.
"https://te.wikipedia.org/wiki/భండారు_అచ్చమాంబ" నుండి వెలికితీశారు