బందగి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, కూడ → కూడా (2), → using AWB |
||
పంక్తి 2:
'''షేక్ బందగి''' భూమి కోసం, భుక్తికోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం [[తెలంగాణ]] రైతాంగ సాయుధ పోరాటం సల్పిన గొప్ప పోరాట యోధుడు.
[[వరంగల్ జిల్లా]] [[దేవరుప్పుల]] మండలం కామాడ్డి గూడెంకు చెందిన ఈయన, 60 ఊళ్లకు భూస్వామి అయిన [[విస్నూర్]] దేశ్ముఖ్ [[రాపాక రామచంద్రారెడ్డి]]పై సాహసోపేతంగా పోరాడి అనూహ్య విజయం సాధించాడు. కామారెడ్డి గూడెంలో బందగీకి కొంత వ్యవసాయ భూమి ఉండేది. తన పాలివాడు అయిన ఫకీర్ ఆహ్మద్ బందగీ భూమిపై కన్నేసి దానిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించాడు. ఇతడు విస్నూర్ దేశ్ముఖ్ అనుచరుడు. బందగీ ఎదురు తిరగడంతో ఫకీర్ ఆహ్మద్ దేశ్ముఖ్కు ఫిర్యాదు చేశాడు.
==కాస్త విపులంగా==
షేక్బందాగీ సాహెబ్ పెదానాన్న కుమారుడు అబ్బాస్అలీ. ఆయన కుమారుడు ఫకీర్అహమ్మద్. ఫకీర్అహమ్మద్ విసూనూర్దేశ్ముఖ్రాపాక రామచంద్రారెడ్డి వద్గా ఉద్యోగి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అబ్బాస్అలీ విసూనూర్ దేశ్ముఖ్కు నమ్మినబంటుగా మారాడు. 1941లో బందాగీకి అతని పెదానాన్న కుమారుడు అబ్బాస్అలీకి భూసంబంధామైన వివాదాం తలెత్తింది. జ్యేష్టభాగంగా తనకు లభించిన ఎనిమిది ఎకరాల పొలాన్ని అమ్ముకున్న అబ్బాస్అలీకి తన దాయాదాులు అనుభవిస్తున్న మిగతా భూమిని
==గ్రామాలలో==
గ్రామాలలో ఎవరైనా ఎక్కడైనా మేకనో, గొర్రెనో కోస్తే దానిలో కొంత ఆ ఊరి దొరకు పంపాలి. 1940లో విస్నూర్ గ్రామములో దేశ్ముఖ్బంగ్లా నిర్మాణానికి వెట్టి కొరకు మనుషులనే కాక బండి నడిపే కోడెలను (పశువులను) నిర్బంధగా తోలుకెల్లినారు. చందాలు వసూళ్ళు చేయించాడు. ఆనాటి కాలములో పంటచేను, పాడిఆవు, పడుచు బిడ్డ, నడిచేగొడ్డు, నాలుగు కాసులు ఇవన్ని దేశ్ముఖ్దౌర్జన్యానికి బలి అయ్యేవి. గ్రామాలలో గొడవలు ఏర్పడితే వాటిని దేశ్ముఖ్గడిలో పరిష్కరించడం అనవాయితి. దేశ్ముఖ్ఆధీనములో గల గ్రామాలలో సివిల్, క్రిమినల్కేసులతో సహా స్వంత పోలీసు బలగాలతో సర్వాధికారాలు చెలాయించాడు. అనాడు అతనిని ఎదిరించడం అంటే మృత్యువును ఆహ్వనించినట్టే. తన 60 గ్రామాలలోని ధానిక, భూస్వామ్య మక్తిదారులపై విసూనూర్ దేశ్ముఖ్పెత్తనం చెలాయించాడు. తన ఆధిపత్యాన్ని అంగీకరించని వారి ఆస్తి-పాస్తులిన్ని సర్వనాసనం చేయించేది. ఆతడు సాగించిన దౌర్జన్యాలు ఒక ఎత్తు అయితే, అతని ఏజెంట్లు, గూండాలు సాగించుకున్న పాశవిక నికృష్టాలు, చేసిన హత్యలు మరొక ఎత్తు' (బందాగీ కోర్టుబాట- తెలంగాణా పోరుబాట (1928-40), పేజి.216) అటువంటి భయానక దేశ్ముఖ్ప్రాపకం సంపాదించిన అబ్బాస్అలీకి తమ్ముళ్ళ భూమిని కాజేయడం ఏమాత్రం కష్టం అన్పించలేదు.
==బందాగీ కోర్టులో==
ఈ కేసు వేసి గెలుపొందడం ఆరోజుల్లో మాములు విషయంకాదు.దేశ్ముఖ్ ఫకీర్ ఆహ్మద్కు భూమి ఇవ్వాలని బందగీని బెదిరిస్తూ వచ్చాడు. బందగీ ససేమిరా ఇవ్వనంటూ జనగామ కోర్టులో సివిల్ కేసు వేశాడు. అయితే
==వీర మరణం==
జనగామ-సూర్యాపేట రహదారిలోని బస్టాండ్కు నడుచుకుంటూ వెళుతున్న బందగీని అంతకు ముందే మాటు వేసిన దేశ్ముఖ్ గూండాలు గొడ్డళ్లతో దాడి చేసి, కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. నమ్మిన న్యాయం కోసం ఏ సంఘం అండలేకుండా ప్రాణాలకు తెగించి, రజాకార్ నాయకుడైన విస్నూర్ దేశ్ముఖ్పై విజయం సాధించి వీర మరణం పొందిన బందగీ తెలంగాణ బిడ్డలకు చిరస్మరణీయుడైనాడు.
|