'''ముందడుగు విజయ్గుప్తా''', మత్స్య సాగుల పరిశోధకులు, జీవ శాస్త్రవేత్త. ఆయనకు 2005 లో "వరల్డ్ ఫుడ్ ప్రైజ్" లభించింది<ref>[http://timesofindia.indiatimes.com/world/us/MV-Gupta-given-World-Food-Prize-for-2005/articleshow/1268978.cms MV Gupta given World Food Prize for 2005]</ref>. ఆయన తక్కువ వ్యయంతో మంచినీటి చేపల వ్యవసాయం గూర్చి చేసిన అభివృద్ధికి గానూ ఈ బహుమతి ఆయనకు లభించింది.<ref>[http://www.tribuneindia.com/2005/20050612/nation.htm Indian Gets World Food Prize - The Tribune, Chandigarh, India - Nation]</ref> ఈయన ఈ అవార్డు అందుకున్న ఆరవ భారతీయుడు.<ref>[http://www.thehindu.com/2005/07/30/stories/2005073014341400.htm World Food Prize for M.V. Gupta]</ref> ఈ అవార్డు పొందిన తొలి ఆంధ్రుడిగా చరిత్ర పుటలకెక్కారు.
==జీవిత విశేషాలు==
ఆయన [[గుంటూరు జిల్లా]], [[బాపట్ల]] పట్టణంలో [[1939]], [[ఆగష్టు 17]]న జన్మించారు. ఎం.ఎస్.సి డిగ్రీ అందుకున్న తరువాత [[చీరాల]] కాలేజీలో అధ్యాపకునిగా కొంతకాలం పాటు పనిచేసారు. ఆ తరువాత ఆస్సాం రాష్ట్రంలో ఒక కళాశాలలో "జంతు శాస్త్ర శాఖాధిపతి"గా కూడా పనిచేసారు. ఆ కాలంలో ఆయన పరిశోధనలపై దృష్టి సారించారు. పరిశోధనలు చేస్తూ ఆయన మరింత అభివృద్ధి సాధించడానికి కలకత్తా వెళ్ళి "ఫిషరీస్ రీసెర్చి"లో ప్రవేశించారు.<ref>[http://www.abfindia.org/PeopleECMMVGupta.aspx Agri Biotech Foundation (ABF)]</ref>