ఆనాటి వాన చినుకులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, కి → కి , → (2), , → , using AWB
పంక్తి 31:
అవును. నిజమే. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు వంశీయే ఈ కథల [[రచయిత]].
 
'''ఆనాటి వానచినుకులు ''' పుస్తకాన్ని '''[[ఎమెస్కో]]''' వారు మొదట పదహారు కథలతో ఫిబ్రవరి 2003లో ప్రచురించారు.తిరిగి మార్చి 2008లో మరికొన్ని కథలను చేర్చి 23 కథలతో '''ఆనాటి వానచినుకులు''' అనే పేరుతో 2008లోద్వితీయ ముద్రణ చేశారు.పుస్తకము అట్ట మీది [[బొమ్మ]]<nowiki/>లను '''[[బాపు]] '''గారు గీయ్యగా, లోపలి కథలకు '''అన్వర్ ''', '''ఎన్.వి.వివేక్‍ఆనంద్ ''' లు అందించారు.ఈ పుస్తకాన్ని రచయిత వంశీ ...'''ఔను..వీళ్లిద్దరికీ ఇష్టంగా''' అంటూ శ్రీ వేమూరి బలరామ్, శ్రీ వేమూరి సత్యనారాయణ గార్లకు అంకితమిచ్చాడు.తిరిగి అక్టోబర్అక్టోబరు 2010లో మరికొన్ని కథలను చేర్చి 32కథలతో '''ఆకుపచ్చని జ్ఞాపకం''' అనే పేరుతో ముద్రణ చేశారు
 
'''వంశీ రాసిన ఈ కథల గురించి..'''అంటూ '''[[ఇంద్రగంటి శ్రీకాంత శర్మ|ఇంద్రగంటి శ్రీకాంతశర్మ]] '''గారు చక్కని ముందుమాటలను రాసారు.
పంక్తి 52:
 
===బాచి===
'''బాచి:'''బాచి రచయితకు మిత్రుడు.బాచి తత్వమేమిటో వూర్లో వారికే కాదు, రచయితకు కూడా పూర్తిగా తెలియదు.అతడుచేసే పనులు అలాంటివి.ఒకసారి నిద్రపోతున్న వాళ్ల నాయనమ్మ బంగారపుమురుగుని సబ్బుబిళ్లరుద్ది లాగేసి [[ద్రాక్షారామం|ద్రాక్షారామ]]<nowiki/>మ్లోని బేబి అనే టీచరుకిచ్చాడు.ఆమేకు భర్తలేడు.ఇద్దరు పిళ్లలు.పేళ్ళాడతానని కొన్నాళ్ళు వెంటతిరిగాడు.మరోసారి ఆదిరెడ్డిగారి కోడలికి దయ్యం పవిడిపించటానికొచ్చిన భూతవైద్యుని పళ్ళూడకొట్టాడు.మురమళ్ళలోని బాలింతరాలికి కాంపు కష్టమైతే రాజమండ్రి తీసికెళ్లి వైద్యం చేయించాడు.మరోసారి చిట్తిపంతులుగారింటి వెనుక పడిపోయిన గోడలలో పాము చేరితే దాన్ని పట్తుకొని, సాయంత్రం వరకు గుడి అరుగు మీద ఆడించి ఆతరువాత వూరిచివర సమాధి వద్ద వదలి వేశాడు.వూరివాళ్ళ దృష్టిలో తింగర మనిషి.బాచి స్నేహితుడు/రచయిత మద్రాసు వెళ్ళిపోయి, 20 సంవత్సరాల తరువాత ఆ వూరువచ్చినప్పూడు బాచి గురించి ఆరా తీస్తాడు.కపాలేశ్వరుడు గుడి వుద్యోగి చెల్లెల్తో ఊరువిడచి వెళ్ళిపోయడని వూర్లోజనంచెప్తారు.ఆలా ఎందుకు చేసాడని అడగగా 'ఆ మదపిచ్చోడి గురించి చెప్పెదేముందంటారు.ప్రస్తుతం బాచి యానాం రేవుకు పదిమైళ్ల దూరంలోని పిచ్చుకల లంకలో వుంటున్నట్లు తెలుసుకొని రచయిత అక్కడికి వెళ్తాడు.అక్కడ తిప్ప అంచున వుంది బాచి ఇళ్లు. రచయిత మాటల్లో'''....ఆ ఇసుక తిప్ప మధ్యలో నిలబడి ఎటుచూసినా గోదావరే కనిపిస్యున్నది.పచ్చి ఇటుకల గోడల్ని పేడతో అలికి సున్నం ముగ్గులు పెట్టి, పైన రెల్లు గడ్దితో నేసిన కుటీరం ఒకటి తిప్ప అంచుననే ఉంది.పచ్చి వెదుళ్లతో చుట్టూ కట్టిన దడికి ఒక మూల చుక్కుడుపాదూ, ఇంకోమూల పుచ్చ పాదూ పాకి వున్నాయికుటీరం వెనకాల తులసికోటా, దానికి కాస్త దూరంలో గోరింటాకు మొక్కా, కరివేరపూలమొక్క ఉన్నాయి.'''కుటిరంలో వున్న ఆడు మనిసి నల్లబోర్డరున్న బూడిదరంగు చీరకట్తుకుంది.అడ్డపాపిటతీసి, జడవేసుకొని పెద్ద కుంకుమ బొట్తు పెట్తుకునివుంది.ఆమెకు కుడికాలు లేదు.బాచి మిత్రున్ని [[సంతోషం]]<nowiki/>గా ఆహ్వనించి అథితి సత్కారంచేసాకా, ఇలా ఎందుకు జరగిందని అడుగుతాడు.బాచీ జరిగింది చెప్పాడు.ఉళ్ళో కొవ్వూరి రాములు, సంఛారతెగకు చెందిన వెంకటలక్ష్మిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి, వాళ్ల పొలంలోని పాకలో వుంచి, బిడ్దపుట్టగా, ఆబిడ్డనోట్లో వడ్లగింజలు వేసి చంపగా, అదితెలుసుకున్న బాచీ పంచాయితి పెట్టించి, వెంకటలక్ష్మి మెళ్ళో రాములు చేత మూడు మూళ్లు వేయించాడు.ఆ విధంగా వూర్లోని అగ్ర కులాలవారి కోపానికి గురైనాడు.రెండు మూడ దపాలు చంపించాడానికి ప్రయత్నింఛారు.అదృష్టవశాత్తు ఆచి తప్పించుకున్నాడు.కపాలేశ్వరస్వామి [[దేవాలయం]]<nowiki/>లో ఈ వుద్యోగి చెల్లెలికి షుగరు వ్యాధి వచ్చి కాలు తీసెస్తే భర్త వదిలేశాడమెని.బాచి మీద పగ పెంచుకున్న వూరిజనం ఏ ఆధారంలేని వుద్యోగి చెల్లెల్ని పెళ్ళిచేసుకొని దారి చూపించు అని బాచిని రెచ్చ గొట్టారు.ఆలోచించిన బాచి, ఆమెదగ్గరకు వెళ్లి మాట్లాడక, ఆమెను రాములవారి [[గుడి]] కి తీకెళ్లి పెళ్ళి చేసుకున్నాడు.ఈ విషయం తెలిసిన ఇంటివాళ్లు వెలి వెయ్యగా, ఇక్కడకు వచ్చి, తనకు నచ్చిన వాతావరణన్ని నిర్మించుకుని వుంటున్నాని చెప్పుటాడు.రచయితకు మిత్రున్ని మనస్సెమిటో తెలుస్తుంది.రచయిత తిరుగు ప్రయాణమైతున్నప్పుడు
 
బాచీ'''"నాలాంటి వాణ్ణి చూడ్డానికి చాలా దూరం వచ్చావు నువ్వు"'''అంటాడు.
పంక్తి 87:
''"ప్రాణమున్న శిల్పంలా నిలబడి పోయాడు పతంజలి....ఆ [[భాష]]<nowiki/>లో భావాలు భాస్వరంలా వెలుగుతున్నాయి.ఏ ప్రేయసి కరుణిస్తే హర్షించాయో ఆవాన చినుకులు.ఏ ప్రేయసి మరణిస్తే వర్షించాయో ఆవాక్యాలు.ఏ ఉర్వశి నిర్ధయతో నిందింస్తే నిర్మింపబడ్దయో ఆవాన చినుకులు.ప్రకృతి పరవశించినప్పుడా?విరహం వికటించినప్పుడా?గజ్జెలు కట్టిన లేగదూడ ఘలం ఘలించినప్పుడా?''
 
ఆనాటి వానచినుకులు-ఎన్ని అర్ధాలు నిక్షిప్తమైఉన్నాయి ఆ వాక్యంలో.ఎంతమంది బైరన్‍లూ, [[దేవులపల్లి కృష్ణశాస్త్రి|కృష్ణశాస్ర్తులూ]] దాక్కుని ఉనారు ఆ వాక్యంలో....ఈ మారుమూలనున్న ఒక అజ్ఞాని గుండెల్లోంచి వెచ్చగా వెలుపకొచ్చిందా వాక్యం.
 
ఒక మనిషి భావుకుడు కావాలంటే ఏవీ చదవక్కరలేదు.ఏదీ వినక్కరలేదు.భావుకుడు తయారుకాడు.జన్మిస్తాడు.మనిషిలో స్పందన.ప్రకృతిలో ఘనీభవించిన ఆ స్పందన జ్ఞానం.''
"https://te.wikipedia.org/wiki/ఆనాటి_వాన_చినుకులు" నుండి వెలికితీశారు