కదిరి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 9 మార్చి 2003 → 2003 మార్చి 9 (2), వుంది. → ఉంది. (2) using AWB
పంక్తి 39:
అనంతపురం జిల్లాలో ఉన్న ''కదిరి'' లోఈ ఆలయం ఉంది. ఇది పాకాల-- ధర్మవరం రైల్వే మార్గంలో ఉంది. కదిరిలో స్టేషను కూడా ఉంది. అదే విధంగా బస్సు సౌకర్యంకూడ బాగా ఉంది. ఇక్కడ రైల్వే స్టేషను ఉంది. ఇది [[పాకాల]] - [[ధర్మవరం]] మార్గములో ఉంది.
 
(మూలం: ఈనాడు ఆదివారం: 92003 మార్చి 20039)
 
==మిగతా దేవాలయాలు==
* కదిరిలో వెలసిన శ్రీ [[వీరబ్రహ్మేంద్ర స్వామి]] దేవాలయము చూడచక్కగా అధ్యాత్మిక ప్రవచనాలతో విరజిల్లుతూ వుంటుంది. ఈ దేవాలయములో ప్రతి సంవత్సరం వీరబ్రహ్మేంద్ర స్వామి [[ఆరాధన]] మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.ఆరాధన మహోత్సవాల సందర్భంగా తిరునాల నిర్వహిస్తారు.ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు దేవాలయాన్ని దర్శించుకుంటారు.
* శ్రీ మరకత మహాలక్ష్మి ఆలయం:- శ్రీ మహాలక్ష్మి శ్రీ సూక్తాధి దేవత. సకల సౌభాగ్యాలకూ అధిస్టానదేవత అయిన ఆతల్లి శ్రీ మహావిష్ణువు హృదయేశ్వరి. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి స్వహస్తాలచే ప్రతిష్ఠాపితమైన ఈ ఆలయం ఇక్కడ అలరారుతోంది. కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి అతి సమీపంలో శ్రీ మరకతమహాలక్స్మి మాత కొలువై భక్తుల కోర్కెలు తీరుస్తోంది. ( మూలం:- ఈనాడు జిల్లా ఎడిషన్, 112013 అక్టోబరు 201311. 10వ పేజీ.)
 
==గణాంకాలు==
పంక్తి 57:
 
==[[చంద్రవదన మొహియార్ సమాధి]] ==
చంద్రవదన మొహియార్ ప్రేమ గాథ కదిరిలో జరిగిన యధార్ధ సంఘటన, సుమారు 200-300 సంవత్సరాలకు పూర్వం చంద్రవదన రాజకుమారి కదిరికి రాగా, మొహియార్ ఆమెను ప్రేమించాడు. వీరి ప్రేమకున్న అన్నిరకాల అడ్డంకులనూ, మత కట్టుబాట్లనూ అధిగమించి వివాహ బంధనముతో ఒకటైనారు. వేర్వేరు మతాలకు చెందిన వీరి ప్రేమ గాథ కదిరిలో మతసామరస్యనికి ప్రతీక. వీరిని గుర్తుచేసుకుంటూ కదిరి [[పురపాలక సంఘం]] ఒక ప్రాథమిక పాఠశాలను నెలకొల్పినది.15వ శతాబ్దం విజయనగర సామంత రాజు శ్రీరంగరాయులు ఏకైక పుత్రిక చంద్రవదన కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవాలకు వచ్చి పూజలు చేసి వెళుతూ పర్షియా వజ్రాల వ్యాపారి అయిన మొహియార్‌ దుకాణం ముందునుంచే వెళ్లింది.ఆమె దృష్టి వజ్రాలకన్నా వాటిని విక్రయిస్తున్న మొహియార్‌పైన పడింది.అతని ఠీవి, దర్పాన్ని చూస్తూ, ఆమె పులకితురాలైంది. అతను కూడా చంద్రవదన అందాన్ని చూసి, గుండెల్లో ముద్రవేసుకున్నాడు.పరస్పర ఆకర్షణల మధ్య మధుర ప్రేమలు పంచుకున్నారు.ఆమె బాహ్యప్రపంచంలోకి వచ్చి తనస్థితి, స్థాయినీ గుర్తుతెచ్చుకుని వేగంగా కదిలి తన నివాసమందిరానికి వెళ్లింది. కాని మనసు మొహియార్‌ చుట్టూ తిరుగుతూనే వుందిఉంది. కొన్ని నిముషాలు మెరుపులా మెరిసి తనమదిలో ముద్రపడిన చంద్రవదనని మొహియార్‌ మరవలేక పోయాడు. ఆ తరువాత రోజులన్నీ అతన్ని పిచ్చివాడిగా మార్చాయి. ప్రతీక్షణం చంద్రవదనే మదిలో తలపురేపుతూ. నిద్రాహారాలను దూరం చేసింది. అంతఃపురంలో చంద్రవదన పరిస్థితీ అలానే వుందిఉంది. కానీ తన స్థాయి వేరు మతం వేరు. తన ప్రేమకు అర్థం లేదని భావించింది. ప్రేమను మరిచిపోవడానికి మనసురాక విలవిలలాడింది.ఒకరోజు మొహియార్‌ చంద్రవదనని ఎలాగైనా చూడాలని గాఢమైన కోరికతో ఆమె అంతఃపుర భవనం ముందుకు వచ్చాడు. అక్కడ రాజభటులు అతన్ని అడ్డగించారు. అతను చంద్రవదన ప్రేమతో పిచ్చివాడిగా మారి ఆమెనే కలవరిస్తుండటంతో రాజభటులు అతని మాటలు విని పిచ్చివాడిగా భావించి బలవంతంగా అతన్ని తోసేస్తారు. అతను ప్రక్కనవున్న గోడకు తలపగిలి అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. గొడవంతా తెలిసిన శ్రీరంగనాయకులు స్వయంగా ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. చనిపోయిన వ్యకి ఫలానా అని తెలిసిన చంద్రవదన కూడా అక్కడికి వచ్చి అతని స్థితిని చూసి చలించిపోయి. ఆమె కూడా అమాంతంగా మొహియార్‌ శరీరంపై పడిపోయి ప్రాణాలు విడిచింది. ఇదంతా చూసిన శ్రీరంగనాయకులు మొదట వారిద్దరి మధ్య జరిగిన స్పందన, ప్రేమలను అర్థం చేసుకుని తన కొలువులోని గురువులు, పెద్దలను సంప్రదించి అందరి ఆమోదంతో చంద్రవదన, మొహియార్‌ల శవాలను ఒకే ప్రదేశంలో ఖననం చేయించదలచి ముస్లింల సమైక్యతను చాటుతూ వారి సమాధులను అటు హిందూ, ఇటు ముస్లిం సంప్రదాయ ప్రకారం నిర్మించాడు.ఆనాటి పాతర్లపట్నమే నేటి 'పట్నం' నేటి కదిరిని అప్పుడు ఖాద్రి అనేవారు. 13వ శతాబ్దంలో శ్రీరంగరాయల పూర్వీకుడు రంగనాతిప్పానాయుడు శ్రీఖాద్రి అనే పేరుతో పట్టణం నిర్మించాడని చెపుతారు. శ్రీ లక్ష్మీనరసింహ ఆలయం అభివృద్ధి అప్పటినుంచి జరుగుతూ వస్తోంది. సుమారు 10 ఎకరాలాలో పెద్ద ఆలయంగా ఈ ఆలయం కనిపిస్తుంది. గుడి ప్రాంగణంలో నాలుగు మండపాలు, చిన్న చిన్న ఆలయాలున్నాయి. నలువైపులా నాలుగు గోపురాలున్నాయి. ఒక గోపురాన్ని టిప్పుసుల్తాన్‌ కాలంలో ముస్లిం పాలకులు నిర్మించారు.చంద్రవదన మొహియార్‌ల సమాధి మందిరాన్ని అటు ముస్లింలు ఇటు హిందువులు, అనేక మంది సందర్శించి తమ ప్రేమలు ఫలించాలని మొక్కుకుంటారు.<ref>http://www.prabhanews.com/life/article-11750 ఆంధ్రప్రభ 6.7.2009</ref> మొహియార్ శవాన్ని అంత్యక్రియలకోసం తీసుకెళదామని ఎంతమంది వచ్చి కదిపినా అది కదలలేదనీ చివరికి ఘోర దుఖంలోఉన్న చంద్రవదన వచ్చి ఆతని శవాన్ని తాకినమీదటనే దానిని లేపగలిగారనీ, చంద్రవదనకూడా మొహియార్ తో ఎడబాటును సహించలేక అతనితోపాటు సజీవసమాధి అయ్యిందనీ,వారిది దైవికమైన అమరప్రేమగా అక్కడి ప్రజలు భావించారనీ మరో కథ ప్రచారంలో ఉంది.<ref>https://groups.google.com/forum/#!msg/telugu-unicode/ojbc5JB6weg/iCKXXouSKGQJ</ref> వీరి సమాధి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలోని ముస్లిముల శ్మశానస్థలంలో ఉంది.తాము ఆజన్మాంతమూ విడిపోకూడదనుకునే ప్రేమికులూ దంపతులు కూడా ఈ సమాధిపై ఉంచిన కుంకుమను నేటికీ భక్తిశ్రద్ధలతో తీసుకెళుతుంటారు.<ref>http://www.nethelper.com.au/article/Kadiri</ref>
 
==కదిరి ప్రాంతీయ వ్యవసాయ పరిశోదనా కేంద్రము==
"https://te.wikipedia.org/wiki/కదిరి" నుండి వెలికితీశారు