శ్రీమన్నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
శ్రీమన్నారాయణ (నందమూరి బాలకృష్ణ) ధైర్యవంతుడు, ఆవేశపరుడు అయిన జర్నలిస్టు. అతను ఎప్పుడూ న్యాయం కోసం పోరాడుతూంటాడు. కొందరు దుర్మార్గులు చేస్తున్న కుంభకోణాలను బయటపెట్టి, వారి అవినీతి డబ్బు నష్టపోవడానికి కారణమవుతాడు. కల్కి నారాయణమూర్తి (విజయకుమార్) శ్రీమన్నారాయణ తండ్రి, జైకిసాన్ ట్రస్టు ఏర్పాటుచేసి రైతుల సంక్షేమం కోసం పోరాడుతూండే వ్యక్తి. రైతుల సంక్షేమం కోరుతూ నారాయణమూర్తి చేసిన విజ్ఞప్తికి ప్రజలు స్పందించి భారీ విరాళాలు ఇవ్వగా, ఆ మొత్తం రూ.5వేల కోట్లు అవుతుంది. కానీ విరాళం ఉపయోగించే సమయం వచ్చేసరికి నారాయణమూర్తి బ్యాంకులో అనూహ్యమైన పరిస్థితుల్లో చనిపోతాడు. 5వేల కోట్ల సొమ్ము మాయమవుతుంది. అదే సమయంలో శ్రీమన్నారాయణ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడన్న నింద పడుతుంది. శ్రీమన్నారాయణను ఈ పరిణామాలన్నిటికి కారకుడిగా అనుమానించి అరెస్టు చేస్తారు. జైలు నుంచే శ్రీమన్నారాయణ తన అమాయకత్వం నిరూపించుకుని, పోయిన సొమ్ము కనిపెట్టాల్సి వస్తుంది.
 
ఛానెల్ రిపోర్టర్ అయిన స్వాప్నిక (పార్వతి మెల్టన్) శ్రీమన్నారాయణ నిర్దోషిగా నిరూపించుకునేందుకు సహాయం చేస్తూంటుంది. వాళ్ళిద్దరూ అవినీతిపరుడైన మంత్రి బయల్ రెడ్డి, అతని బావమరిది బ్యాంకు జనరల్ మేనేజర్ రాజన్, డాక్టర్ శ్రీకర్, ఐజీ మార్తాండ్, మలేషియాకు చెందిన హవాలా డీలర్ హర్షద్ భాయ్ ఈ కుట్ర వెనుక ఉన్నారని కనిపెడతారు. ఈ ఆరుగురు అవినీతిపరుల వద్ద ఒక్కో అంకె ఉండేలా ఆరు అంకెల పాస్ వర్డు ఏర్పాటుచేసి దాంతో తన తండ్రి అక్కౌంట్ లాక్ చేశారన్న విషయం తెలుసుకుంటాడు శ్రీమన్నారాయణ. తన తెలివితోనూ, జైలర్ శంకర రెడ్డి (ఆహుతి ప్రసాద్) సహకారంతోనూ వారిలో ఒక్కొక్కరినీ చంపుకుంటూ పోతూ వారి వద్ద వారి పాస్ వర్డ్ అంకె తీసుకుంటూంటాడు. విలన్లు జైలు సెల్ లో సీసీటీవీ కెమెరా పెట్టి తమను తాము కాపాడుకునేందుకు, శ్రీమన్నారాయణ కార్యకలాపాలు కనిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. కానీ జైలర్ తప్పుడు ఫుటేజీ పంపి మోసం చేస్తాడు. సీబీఐ ఆఫీసర్ (జ్ఞానేశ్వర్ (వినోద్ కుమార్) కేసును పరిష్కరించడానికి నియమితుడవుతాడు.
 
ఐదుగురు దుర్మార్గులను చంపాకా, శ్రీమన్నారాయణ హర్షద్ ని చంపడానికి ప్రణాళిక వేస్తాడు, తనను తాను కాపాడుకోవడానికి శ్రీమన్నారాయణ కుటుంబ సభ్యుల్ని హర్షద్ బంధిస్తాడు. శ్రీమన్నారాయణ కుటుంబాన్ని చంపకుండా వదిలిపెట్టాలంటే పాస్ వర్డ్ టైప్ చేయాలని హర్షద్ బెదిరిస్తాడు. దాంతో అతను పాస్ వర్డులో తనకు తెలిసిన 4, కె, ఐ, ఎ, ఎన్ అక్షరాలు టైప్ చేస్తూంటాడు. ఐకి, ఎకి మధ్య ఉన్న అక్షరం హర్షద్ వద్ద ఉంటుంది. హర్షద్ పాస్ వర్డ్ తెలియడంతో సొమ్ము అంతటినీ ట్రాన్స్ ఫర్ చేసుకునే ప్రయత్నాల్లో ఉండగానే జ్ఞానేశ్వర్ శ్రీమన్నారాయణ కుటుంబాన్ని కాపాడతాడు. హర్షద్ వద్ద ఉన్న అక్షరం కూడా తెలిసిపోవడంతో 4 KISAN (ఫర్ కిసాన్) అన్నది పాస్ వర్డ్ అని శ్రీమన్నారాయణ ప్రకటిస్తాడు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ మీదికి విసిరి హర్షద్ ను చంపుతాడు. రైతుల డబ్బు రైతులకు ఖర్చుపెట్టడంతో కథ ముగుస్తుంది.
 
==సినిమా బృందం==
===నటీనటులు==
సినిమాలో నటులు వారు పోషించిన పాత్రలు ఇలా ఉన్నాయి:
* [[నందమూరి బాలకృష్ణ]] - శ్రీమన్నారాయణ
* [[విజయకుమార్ (నటుడు)|విజయకుమార్]] - కల్కి నారాయణమూర్తి
* [[పార్వతి మెల్టన్]] - స్వాప్నిక
* [[ఇషా చావ్లా]] - శ్రీమన్నారాయణ మరదలు
* [[కోట శ్రీనివాసరావు]]
* [[సురేష్ (నటుడు)|సురేష్]]
* [[నాగినీడు]]
==పాటలు==
# ఆరడుగుల అబ్బాయి హ్యాండసం నువ్వోయి ఏడడుగులు నాతో వేసేయి
"https://te.wikipedia.org/wiki/శ్రీమన్నారాయణ" నుండి వెలికితీశారు