ఆదిరాజు వీరభద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
'''ఆదిరాజు వీరభద్రరావు''' ([[నవంబరు 16]], [[1890]] - [[సెప్టెంబరు 28]], [[1973]]) [[తెలంగాణ]] ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప బాషా శాస్త్రవేత్త.
 
== జననం - విద్యాభ్యాసం ==
== జీవిత విశేషాలు ==
ఇతను [[1890]] [[నవంబరు 16]]న [[ఖమ్మం జిల్లా]], [[మధిర]] మండలం, [[దెందుకూరు]] గ్రామంలో ఒక [[బ్రాహ్మణ]] కుటుంబంలో జన్మించాడు. చిన్న వయస్సులో ఉన్నప్పుడే తండ్రి లింగయ్య మరణించాడు. తల్లి వెంకమాంబ ఇతన్ని మంచి చదువు చదివించాలని తలచి దూరపు బంధువైన [[రావిచెట్టు రంగారావు]] ను ఆశ్రయించింది. రావిచెట్టు ప్రోత్సాహం, సహాయంతో ఆదిరాజు చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలనుండి విద్యనభ్యసించి, [[రావిచెట్టు రంగారావు]] ఇంట్లో నెలకొల్పిన [[శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం]] గ్రంథాలయానికి తొలి గ్రంథపాలకుడిగా ఆదిరాజు వీరభద్రరాజు నియమితులైనాడు.<ref>చరితార్థులు మన పెద్దలు, మల్లాది కృష్ణానంద్ రచన, 2012 ప్రచురణ, పేజీ 64</ref>
 
== రచనా ప్రస్థానం ==
1908లో కొమర్రాజు లక్ష్మణరావు యొక్క విజ్ఞాన చంద్రికా మండలి [[హైదరాబాదు]] నుండి [[మద్రాసు]]కు తరలి వెళ్ళవలసి వచ్చిన తరుణంలో, లక్ష్మణరావు విజ్ఞప్తి మేరకు వీరభద్రరావు కూడా మండలిలో పనిచేయటానికి మద్రాసు వెళ్ళాడు. మండలిలో పనిచేస్తున్న సమయంలో అనేక ప్రసిద్ధ [[రచయితలు]], [[కవులు]], పండితులు మరియు పరిశోధకులతో పరిచయం ఏర్పడింది. లక్ష్మణరావుచే ప్రభావితుడై, ఆయన మార్గదర్శకత్వంలో చక్కని పరిశోధకునిగాను, బాధ్యతాయుత రచయితగాను శిక్షణ పొందాడు. 1914లో హైదరాబాదుకు తిరిగివచ్చి మహబూబ్ కళాశాలలో [[తెలుగు]] ఆచార్యునిగా నియమితుడయ్యాడు. ఆ తరువాత ఛాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలలోనూ, నారాయణ గూడలోని బాలికోన్నత పాఠశాలలోనూ తెలుగు పండితునిగా పనిచేశాడు. [[మర్రి చెన్నారెడ్డి]] ఇతని శిష్యులలో ప్రముఖుడు.<ref>[http://www.vepachedu.org/adiraju.html వేపచేదు.ఆర్గ్‌లో ఆదిరాజు వీరభద్రరావుపై వ్యాసం]</ref>