పిచ్చుకుంటులవారు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (3), లు వల్ల → ల వల్ల using AWB
పంక్తి 10:
దాన మొసగరే ధర్మాత్ములార.
</poem>
అని వర్ణించాడు. పై వివరణను బట్టి వారు [[అంగవైకల్యం]] కల కుంటి వారనీ, అంధులనీ తెలియటమే కాక, ''దాన మొసగరే ధర్మాత్ములార '' ఆనడాన్ని బట్టి వారు [[యాచకులు|యాచకులని]] అర్థమౌతూ ఉంది. ఆనాడు [[శ్రీశైలం|శ్రీశైల క్షేత్రానికి]] వెళ్ళే యాత్రికుల్ని యాచిస్తూ వుండే వారని తెలుస్తూ ఉంది. వీరిని కోస్తాంధ్రలో[[కోస్తాంధ్ర]]<nowiki/>లో పిచ్చి గుంటలాళ్ళని పిలుస్తూ వుంటారు. మరి కొన్ని చోట్ల పిచ్చుక కుంటల వాళ్ళనీ, - పిచ్చుకుంటలాళ్ళనీ, రక రకాలుగా పిలుస్తూ వుంటారు. వీరు భిక్షమెత్తే వారు కనుక భిక్షక శబ్దం పిచ్చకుంటులుగా మారిపోయి వుండవచ్చు. 1995 లో ఈ కులం పేరును [[వంశరాజ్]]<nowiki/>గా మార్చారు. వీరు బీ.సి.ఏ గ్రూపు లోని 18 వ [[కులం]].
 
;పద్యం
పంక్తి 20:
</poem>
 
అని వర్ణించాడు. పిచ్చుకుంటుల వారు ప్రథమంలో కాపుల గోత్రాలనూ, [[గొల్ల వారు|యాదవుల]] గోత్రాలనూ చెపుతూ వుండేవారు. కాల క్రమాన [[కమ్మ]] వారి గోత్రాలతో పాటు ఇతర కులాల వారి గోత్రాలను కూడా చెపుతూ వుండేవారు. అలా వారి వారి గోత్రాలను కూడా చెపుతూ వారినే యాచించే వారు. వీరికి పౌరోహిలులు జంగాలు. పిచ్చికుంటుల వారు తెలంగాణా జిల్లాలలో ఎక్కువగా ఉన్నారు. వీరిలో గంట - తురుక - మంద - తిత్తి - తొగరు మొదలైన ఉప జాతులు ఉన్నాయనీ, పన్నేండు తెగల వారు తెలంగాణాలో వున్నారనీ, ఒక తెగవారు సర్కాంధ్ర డేశంలో వున్నారనీ, ఈనాడు తెలంగాణా రెడ్లుగా వున్న వారు ఒకప్పుడు కాపులకు సంబంధించిన కోటి గోత్రాలనూ, [[కోస్తా]] జిల్లాలలో వున్న [[కమ్మ]] వారికి కోటి గోత్రాలనూ చెప్పి యాచించే వారు<ref>డా: బి. రామ రాజుగారు వారి జానపద సాహిత్య గ్రంథం</ref>
 
==వారు చెప్పే కథలు==
[[తెలంగాణా]] లోని పిచ్చు కుంటుల వారు రాములమ్మ, బాలనాగమ్మ, కామమ్మ, సదాశివ రెడ్డి, [[పర్వతాల మల్లార్తెడ్డ]], సూర్య చంద్ర రాజులు, హరిశ్చండ్రుడు మొదలైన కథలను చెపుతున్నారు. ఇలా [[రాయలసీమ]]లో నున్న పిచ్చుకుంటుల వారు కుంతి మల్లారెడ్డి కథను గానం చేస్తారు. [[నెల్లూరు]], [[గుంటూరు]] ప్రాంతాల్లో పలనాటి వీర గాథల్నీ, కాటమ రాజు కథల్నీ గానం చేస్తూ వుంటారు.పిచ్చుకుంటుల వారందరూ భిక్షమెత్తే వారుగా గానీ, [[అంగవైకల్యం|అంగ వైకల్యం]] కలవారుగా గానీ ఉండి వుండక పోవచ్చు. ఆనాడు సోమనాథుని శ్రీశైల యాత్రలో పై నుదహరించిన అంగ వైకల్యం కలవారు కనిపించి వుండవచ్చును.
 
==మూర్తీ భవించిన శైవం==
పిచ్చుకుంటుల వారందరూ మూర్తీ భవించిన వీర శైవ మతాన్ని ఆరాధించారు. విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా వీరు శక్తి ఉపాసనా పరులు. రేణుకా మహాత్మ్యాన్ని, పోచమ్మ, ఎల్లమ్మ, మరిడమ్మ, మూహూరమ్మ కథలను ప్రచారం చేయడమే కాక వారు నమ్మిన దేవతల కొలువులు[[కొలువు]]<nowiki/>లు కొలుస్తారు. వీరికి మూల దైవం శ్రీ శైల మల్లిఖార్జునుడే.
 
==పిచ్చుకుంటుల పేరెందుకు వచ్చింది==
అక్కడక్కడా ఈనాడు మనకు కనిపించే పిచ్చు కుంటుల వారిని గురించి అసలు మీ పుట్టు పూర్వోత్తరా లేమిటో అని ప్రశ్నిస్తే, వారీ విధంగా ఒక గాథను వివరిస్తారు. త్రిమూర్తుల వివాహ సందర్భంలో వారి వారి గోత్రాల వల్లించటానికి మూడు మట్టి బొమ్మల్ని చేసి వాటికి ప్రాణం పోశారనీ, అలా బొమ్మల నిర్మాణంలో ఒక బొమ్మ కాలు కుంటిగా వుండటం వల్ల అతని సంతాన మంతా భిక్షమెత్తే కుంటి వాళ్ళయ్యారనీ, చెపుతూ, మరో కథను కూడా చెపుతారు. ఏడుగురు యాదవ కాంతలు సంతానం కోసం భక్తి శ్రద్ధల్తో శివుని గూర్చి తపస్సు చేశారనీ వారి భక్తికి మెచ్చిన శివుడు ఒక కుంటి బాలును పెంచమని వరమిచ్చాడనీ, ఆ తరువాత వారంతా గర్బదారులై ఏడుగురు ఆడ పిల్లల్ని కన్నారనీ, ఆ ఏడుగురు పిల్లల్నీ పెద్ద చేసి ఒక కుంటి వాడి కిచ్చి [[శివుడు]] పెళ్ళి చేయమన్నాడనీ, ఆ ప్రకారం వారు చేసారనీ, ఆ తరువాత శివుడు అతనికి ఒక శంఖాన్నీ, గంటనూ, ఒక శూలాన్నీ, ఒక [[ఎద్దు]]నూ ఇచ్చి [[యాచకులు|భిక్షాటన]] చేసి జీవించమన్నాడనీ, అతని సంతానమే భిక్షకకుంటులనీ, పిచ్చు కుంటుల వారు చెపుతారు.
 
==చంద్ర శేఖరుని వర్ణన==
పంక్తి 48:
 
==రాయలసీమలో==
[[రాయలసీమ]]లో వున్న పిచ్చు కుంట్లు వీర శైవులు. రాయలసీమలో[[రాయలసీమ]]<nowiki/>లో వీరు ఎలనాగి రెడ్డి కథ ఎనిమిది రాత్రులు పాడతారు. వీరి గురువులు [[జంగాలు]], పురోహితులు కూడా. వీరు మొదట గంట, తిత్తి మాత్రమే ఉపయోగించే వారు. తరువాత జంగాల ప్రభావం వల్ల చేత [[తంబుర]], గుమ్మెతలు ఉపయోగించే వారు. [[తెలంగాణా]]లో [[జంగాలు]] ఉపయోగించే బుడిగెలు ఇటువంటివే, వీరి వేషం జంగాల వేషంలాగే నిలువు టంగీ షరాయి, నడికట్టు [[తలపాగా]] వుంటుంది.<ref>డా: తంగిరాల సుబ్బారావు గారు జానపద కళోత్సవాల సంచిక</ref>
 
==పాత కథలూ,కొత్త కథలూ==
పంక్తి 74:
</poem>
 
ఇలా ఆనాటి పరిస్థితులనూ, సమస్యలనూ ప్రజలకు ఎరుక పర్చటానికి ప్రాచీన కళా రూపమైన పిచ్చి కుంటుల కళా రూపాన్ని ప్రజా నాట్య మండలి వుపయోగించిది. పిచ్చుకుంటుల వారు ఈ నాటికీ [[గుంటూరు జిల్లా]] రెంట చింతల[[రెంటచింతల]] గ్రామంలో 70 [[కుటుంబాలు]], చెరకు పాలెంలోచెరకుపాలెంలో గ్రామంలో 70, మునిపల్లెలో 6, గామారి పాలెంలో 6, ప్రకాశం జిల్లా టంగుటూరులో 70, [[వరంగల్ (పట్టణ) జిల్లా|వరంగల్ జిల్లా]] మొగిలి చర్లలో కొన్ని కుటుంబాల వారు నివసిస్తున్నారు. అయితే నానాటికీ వీరి కథలకు ఆదరణ తగ్గటం వల్ల వేరు వేరు వృత్తుల్ని చూసు కుంటున్నారు.<ref>కె.వి .హనుమంతరావు గారు [[ఆంధ్రప్రభ]] [[దినపత్రిక]] లో వివణ</ref>
 
==వారిలో వచ్చిన మార్పు==
ఆంధ్ర దేశంలో కోస్తా జిల్లాల్లో వున్న పిచ్చుకుంటుల వారు [[భామా కలాపం]], గొల్ల కలాపం నేర్చు కున్నట్లు కూడా ఉదాహరణ లున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కుమార దేవం గ్రామ వాస్తవ్యులు పల్లం పట్ల రామయ్య గారు, కోవూరు తాలూకా బందపురంలో నున్న పిచ్చు కుంట్లకు భామా గొల్ల కలాపాలను నేర్పారు. బయ్యా పెద గంగాధరుడు, బండి చిట్టి లింగం, దేశీ లక్ష్మి నారాయణ మొదలైన వారు భామ వేష ధారణలో సిద్ద హస్తులు. 16 సంవత్సరాల వయస్సులో లక్ష్మీనారాయణ గారి భామ వేషం అద్భుతంగా వుండేదట. ఈ ఉదాహరణలను బట్టి పిచ్చు కుంటలవారి చరిత్ర అనేక మార్పులు చెందినట్లు తెలుస్తూ ఉంది.
==యివి కూడా చూడండి==
* [[తెలుగువారి జానపద కళారూపాలు]]
"https://te.wikipedia.org/wiki/పిచ్చుకుంటులవారు" నుండి వెలికితీశారు