జాయప సేనాని: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'కాకతీయుల నృత్య కళాభిమానం కాకతీయ ప్రభువులు సంగీత సాహిత్యము...'
 
వ్యాసపు రూపు సవరణ, +లింకులు
పంక్తి 1:
'''జాయప సేనాని''' (జాయన) అయ్యకుల సంజాతుడు. పిన్న చోడన పుత్రుడు. ఇతని తాత ముత్తాతలది వెలనాడు లోని 'క్రోయ్యూరు'. ఈతని తండ్రి తాతలు చందవోలు రాజధానిగా తెలుగు దేశమును పరిపాలించిన వెలనాటి చోళ మహీపతులను సేవించిరి. జాయన తాత నారాయణ నాయకుడు వెలనాటి రెండవ చోళుని కాలములో, కృష్ణా నది సముద్రమున కలియు చోటనున్న దీవియందు గొప్ప నగరము నిర్మించెను. ఈ దీవి ఇంతకు ముందు జననివాసాని కయోగ్యమైనది. నాటినుండి వీరు అచటనే నివసింప సాగిరి. క్రీ. శ. 1203లో [[గణపతి దేవుడు|కాకతి గణపతిదేవ చక్రవర్తి]] ఈ దీవిపై దండెత్తి, అయ్య కులజుడైన పిన్న చోడ నాయకుడైన జాయన తండ్రిని ఓడించి దీవిని వశపరచుకొనెను. కాని, అతను అయ్యకులజుల పరాక్రమాదులను మెచ్చుకొని వారితో సఖ్యము చేసికొనెను; అంతేకాక, జాయన అక్కల నిరువురను - నారమ - పెరమ లనువారిని వివాహమాడెను (Epi. Ind. Vol. 3, Page 84). అప్పటికి జాయన చాలా చిన్నవాడు. అతని సౌమ్యాకారమును, నయ వినయ శౌర్య గాంభీర్యములను గమనించిన గణపతి దేవుడు వానికి ఆందోళీకాతపత్రాది గౌరవములను ప్రసాదించి, గజ సైన్యాధిపతిని కావించి, క్రీ. శ. 1213లో 'తామ్రపురి'ని (నేటి ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలోని చేబ్రోలు ను పరిపాలింపనిచ్చెను. (Epi. Ind. Vol. V, PP - 142, 143). అంతేకాక, కౌమార దశ నుండీ జయన ప్రతిజ్ఞాశయముల నెరింగిన, గణపతి దేవుడు స్వయముగా శ్రద్ధ వహించి, గుండా మాత్యుల వారిచే జాయనకు కళల నేర్పించెను. (1-13)
కాకతీయుల నృత్య కళాభిమానం
 
కాకతీయ ప్రభువులు సంగీత సాహిత్యములను అత్యధికముగా ఆదరించినట్లు చరిత్ర వలన తెలుస్తోంది. ప్రథమ ప్రతాపరుద్రుడు (క్రీ.శ.1158 - 1195) విద్యాభూషణ బిరుదాంచితుడు. నీతిసారాది గ్రంథకర్త. కాకతీయ చక్రవర్తులలో సుప్రసిద్ధుడు గణపతిదేవుడు. యితడు అరువది సంవత్సరములు పైగా రాజ్యమును పరిపాలించి, దేశమును సుభిక్షమొనరించెను.ఇక రెండవ ప్రతాపరుద్రుడు (క్రీ.శ.1290 - 1326) పండితులలో పండితుడు, కవులలో కవి, సంగీత రహస్య మెరిగిన గాయక శిరోమణి, చిత్ర కళావేత్త. కావుననే ఈ కాలము లలితకళలకు, ముఖ్యముగా నృత్యమునకు, నవ వసంతోదయమైనది. రాజులు, రాజబంధువులు, మహామాత్యులు, సేనానులు స్వయముగా కళావేత్త లైనారు. కాకతీయులనాటి నృత్య కళా చరిత్ర మువ్విధములుగా - శాసనములు, శిల్పములు, సాహిత్యము ద్వారా వెలుగులోకి వచ్చినది. గణపతి దేవుడు జాయపసేనాపతికి చేబ్రోలు నొసంగినట్లు తెలియజేసెడి శాసనం (Epi. Ind. Vol. VI - 38ff) లో 16 మంది దేవదాసీలను దానము చేసినట్లు ఉన్నది. శిల్పములు కూడా ముఖ్యముగా దేవాలయములకు సంబందినవి ఉన్నవి. ఈ దేవాలయములలో ప్రథానమైనవి వరంగల్ లోని వేయి స్థంబాల గుడి, పాలంపేట లోని రామప్ప గుడి, రామప్ప గుడి రుద్రేశ్వరాలయంగా పేరుపొందింది. గణపతిదేవుని సేనాని, మంత్రి రేచర్ల రుద్రదేవుడు క్రీ.శ.1213లో నిర్మించిన ఈ దేవాలయములోని ప్రతీ భాగమూ ఒక అపురూప శిల్పకళాఖండము. కాకతీయుల నృత్యకళాభిమానానికి ఇది పరాకాష్ఠ. ఇంకా సాహిత్యానికి సంబంధించిన సాక్ష్యములలో తిక్కన, పాల్కురికి సోమనాథుల తెలుగు రచనలు తెలిసినవే. ఇంక సంస్కృత భాషలో వెలిసిన ఉత్తమోత్తమ గ్రంథము జాయసేనాపతిగా పేరుపొందిన జాయపసేనాని రచించిన "నృత్త రత్నావళి". ఆంధ్రుడు రచించిన శాస్త్రమని అసందిగ్ధముగా చెప్పదగిన తొలి గ్రంథము జాయన కృతమగు "నృత్త రత్నావళి".గణపతిదేవుని బావమరిది జాయపసేనాని "నృత్తరత్నావళి"ని రచించాడు.
 
జాయపసేనాని
 
జాయన అయ్యకుల సంజాతుడు. పిన్న చోడన పుత్రుడు. ఇతని తాత ముత్తాతలది వెలనాడు లోని 'క్రోయ్యూరు'. ఈతని తండ్రి తాతలు చందవోలు రాజధానిగా తెలుగు దేశమును పరిపాలించిన వెలనాటి చోళ మహీపతులను సేవించిరి. జాయన తాత నారాయణ నాయకుడు వెలనాటి రెండవ చోళుని కాలములో, కృష్ణా నది సముద్రమున కలియు చోటనున్న దీవియందు గొప్ప నగరము నిర్మించెను. ఈ దీవి ఇంతకు ముందు జననివాసాని కయోగ్యమైనది. నాటినుండి వీరు అచటనే నివసింప సాగిరి. క్రీ.శ. 1203లో కాకతి గణపతిదేవ చక్రవర్తి ఈ దీవిపై దండెత్తి, అయ్య కులజుడైన పిన్న చోడ నాయకుడైన జాయన తండ్రిని ఓడించి దీవిని వశపరచుకొనెను. కాని, అతను అయ్యకులజుల పరాక్రమాదులను మెచ్చుకొని వారితో సఖ్యము చేసికొనెను; అంతేకాక, జాయన అక్కల నిరువురను - నారమ - పెరమ లనువారిని వివాహమాడెను (Epi. Ind. Vol. 3, Page 84). అప్పటికి జాయన చాలా చిన్నవాడు. అతని సౌమ్యాకారమును, నయ వినయ శౌర్య గాంభీర్యములను గమనించిన గణపతి దేవుడు వానికి ఆందోళీకాతపత్రాది గౌరవములను ప్రసాదించి, గజ సైన్యాధిపతిని కావించి, క్రీ.శ. 1213లో 'తామ్రపురి'ని (నేటి ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలోని చేబ్రోలు ను పరిపాలింపనిచ్చెను. (Epi. Ind.Vol. V, PP - 142, 143). అంతేకాక, కౌమార దశ నుండీ జయన ప్రతిజ్ఞాశయముల నెరింగిన, గణపతి దేవుడు స్వయముగా శ్రద్ధ వహించి, గుండా మాత్యుల వారిచే జాయనకు కళల నేర్పించెను. (1-13)
 
"ప్రేక్ష్యప్రజ్ఞామతిశ యవతీం స్వామిభక్తించహర్షాత్
Line 13 ⟶ 7:
గుండామాత్యే సకలసుమనస్సేవ్యమానేజయంతం
 
వాచాంపత్యౌ హరిరివ కలాం శ్లాఘనీయాం వ్యనైషీత్. "
 
పిమ్మట ప్రాజ్ఞుడైన జాయన గణపతి దేవుని ఆజ్ఞచే, ఆయనకు మిగుల ప్రియమగు నృత్త లీలలకు రత్నదర్పణము వంటి "నృత్త రత్నావళి" ని (క్రీ. శ. 1253-54) (కలియుగం 4355)లో రచించెను. అనగా, అప్పటికి జాయన సుమారు 60 ఏండ్ల వయసువాడై ఉండవచ్చు. ఈ గ్రంథ రచనలో జాయనకు నాటికి వెలువడిన శాస్త్ర గ్రంథములు, లోకమందు ప్రసిద్ధి వహించిన దేశి నృత్యములు మాత్రమె కాక, రామప్ప గుడి వంటి దేవాలయము లందలి నృత్య శిల్పములు తోడ్పడి యుండును.
 
== కాకతీయుల నృత్య కళాభిమానం ==
పిమ్మట ప్రాజ్ఞుడైన జాయన గణపతి దేవుని ఆజ్ఞచే, ఆయనకు మిగుల ప్రియమగు నృత్త లీలలకు రత్నదర్పణము వంటి "నృత్త రత్నావళి" ని (క్రీ.శ.1253-54) (కలియుగం 4355)లో రచించెను. అనగా, అప్పటికి జాయన సుమారు 60 ఏండ్ల వయసువాడై ఉండవచ్చు. ఈ గ్రంథ రచనలో జాయనకు నాటికి వెలువడిన శాస్త్ర గ్రంథములు, లోకమందు ప్రసిద్ధి వహించిన దేశి నృత్యములు మాత్రమె కాక, రామప్ప గుడి వంటి దేవాలయము లందలి నృత్య శిల్పములు తోడ్పడి యుండును.
కాకతీయ ప్రభువులు సంగీత సాహిత్యములను అత్యధికముగా ఆదరించినట్లు చరిత్ర వలన తెలుస్తోంది. ప్రథమ ప్రతాపరుద్రుడు (క్రీ. శ. 1158 - 1195) విద్యాభూషణ బిరుదాంచితుడు. నీతిసారాది గ్రంథకర్త. కాకతీయ చక్రవర్తులలో సుప్రసిద్ధుడు గణపతిదేవుడు. యితడు అరువది సంవత్సరములు పైగా రాజ్యమును పరిపాలించి, దేశమును సుభిక్షమొనరించెను. ఇక రెండవ ప్రతాపరుద్రుడు (క్రీ. శ. 1290 - 1326) పండితులలో పండితుడు, కవులలో కవి, సంగీత రహస్య మెరిగిన గాయక శిరోమణి, చిత్ర కళావేత్త. కావుననే ఈ కాలము లలితకళలకు, ముఖ్యముగా నృత్యమునకు, నవ వసంతోదయమైనది. రాజులు, రాజబంధువులు, మహామాత్యులు, సేనానులు స్వయముగా కళావేత్త లైనారు. కాకతీయులనాటి నృత్య కళా చరిత్ర మువ్విధములుగా - శాసనములు, శిల్పములు, సాహిత్యము ద్వారా వెలుగులోకి వచ్చినది. గణపతి దేవుడు జాయపసేనాపతికి చేబ్రోలు నొసంగినట్లు తెలియజేసెడి శాసనం (Epi. Ind. Vol. VI - 38ff) లో 16 మంది దేవదాసీలను దానము చేసినట్లు ఉన్నది. శిల్పములు కూడా ముఖ్యముగా దేవాలయములకు సంబందినవి ఉన్నవి. ఈ దేవాలయములలో ప్రథానమైనవి [[వరంగల్|వరంగల్లు]] లోని [[వేయి స్తంభాల గుడి|వేయి స్థంబాల గుడి]], [[పాలంపేట]] లోని [[రామప్ప గుడి,దేవాలయము|రామప్ప గుడి]]. రామప్ప గుడి రుద్రేశ్వరాలయంగా పేరుపొందింది. గణపతిదేవుని సేనాని, మంత్రి రేచర్ల రుద్రదేవుడు క్రీ. శ. 1213లో నిర్మించిన ఈ దేవాలయములోని ప్రతీ భాగమూ ఒక అపురూప శిల్పకళాఖండము. కాకతీయుల నృత్యకళాభిమానానికి ఇది పరాకాష్ఠ. ఇంకా సాహిత్యానికి సంబంధించిన సాక్ష్యములలో [[తిక్కన]], [[పాల్కురికి సోమనాథుడు|పాల్కురికి సోమనాథుల]] తెలుగు రచనలు తెలిసినవే. ఇంక సంస్కృత భాషలో వెలిసిన ఉత్తమోత్తమ గ్రంథము జాయసేనాపతిగా పేరుపొందిన జాయపసేనాని రచించిన "నృత్త రత్నావళి". ఆంధ్రుడు రచించిన శాస్త్రమని అసందిగ్ధముగా చెప్పదగిన తొలి గ్రంథము జాయన కృతమగు "నృత్త రత్నావళి". గణపతిదేవుని బావమరిది జాయపసేనాని "నృత్తరత్నావళి"ని రచించాడు.
 
(మూలం : జాయసేనాపతి విరచిత - నృత్త రత్నావళి - సంస్కృతం: జాయ సేనాపతి; తెలుగు: రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ)
"https://te.wikipedia.org/wiki/జాయప_సేనాని" నుండి వెలికితీశారు