నరిశెట్టి ఇన్నయ్య: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), కి → కి (3), గా → గా , తో → తో , వున్నాడు. → ఉన్నా using AWB
→‎పత్రికలలో పని: Brother of Innaiah was arrested and not Innaiah.
పంక్తి 40:
ఇన్నయ్య ఉన్నత పాఠశాలలో చదువుతుండగా, వారి నాన్న రాజయ్య [[ఆంధ్రప్రభ]], [[భారతి]] తెప్పించేవాడు. మద్రాసు నుండి [[నార్ల వెంకటేశ్వరరావు]] సంపాదకత్వాన వచ్చే పత్రిక కోసం రోజూ ఎదురు చూచి చదివేవాళ్ళు. అప్పట్లో అన్నా [[ప్రగడకామేశ్వరరావు]] గారి అంకుశం, [[బండి బుచ్చయ్య]] గారి ములుకోల, [[సూర్యదేవర రాజ్యలక్ష్మి]] గారి తెలుగుదేశం, వాహిని చదువుతుండే వాడు. రాజకీయ హడావుడి ఎక్కువగా ఉండేది. తెనాలినుండి [[జ్యోతి పక్షపత్రిక]], [[రేరాణి]], [[అభిసారిక]] వచ్చేవి. [[ధనికొండ హనుమంతరావు]] సంపాదకత్వాన అభిసారిక యువతను పెద్దలను ఆకట్టుకున్నది. మద్రాసు నుండి [[తెలుగు స్వతంత్ర]] వచ్చేది. ఆ విధంగా ఉన్నత పాఠశాలలోనే వివిధ పత్రికలు చదువుతుండడం వలన, ఆయన ప్రజావాణిలో వ్రాయడానికి అలవాటుపడ్డాడు.
==పత్రికలలో పని==
ఇన్నయ్య విద్యాభ్యాసం చేస్తున్నపుడు అనగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో [[ప్రజావాణి]]లో ఉద్యోగంలో చేరాడు.1954 నుండి పదేళ్ళ పాటు "[[ప్రజావాణి]]"కి రాశాడు. అనేక అనువాదాలు కూడా చేశాడు. ఇన్నయ్య హఠాత్తుగాసోదరుడు విజయరాజకుమార్ కల్లు గీత సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టు కాగా, [[రాజమండ్రి1954లో జైలు]]కుకాలేజీ పంపారుచదువు ఒక సంవత్సరం వాయిదా వేసుకుని ఇంటి పోషణకు ప్రజావాణిలో ఉద్యోగం చెయ్యవలసి వచ్చింది. లచ్చన్న నాయకత్వంలో జరిగిన గీత సత్యాగ్రహం, రాష్ట్రంలో మధ్య నిషేధం తొలగించాలని పోరాడి గెలిచింది. ఈ నేపథ్యంలో ఆయన ఉద్యోగం చేశాడు. తొలుత గుంటూరువారి తోటలో అద్దెకుండేవాళ్ళు. ఇన్నయ్య తండ్రి రాజయ్య పొలాలు పోగొట్టుకుని, జబ్బు పడ్డాడు. ఇన్నయ్య ఉద్యోగం చేస్తూ జబ్బుపడ్డాడు. అయినా వారి అన్న జైలు నుండి తిరిగి వచ్చే వరకూ [[ప్రజావాణి]]లో ఉద్యోగం చేశాడు. అప్పుడు రచయితలతో, రాజకీయవాదులతో పరిచయమైంది. ప్రజావాణి రాజకీయ వారపత్రికగా ప్రభావం చూపెట్టింది. కమ్యూనిస్టు వ్యతిరేకత పత్రికలో ఉండేది. ప్రజావాణి విమర్శలకు రాష్ట్ర కమ్యూనిస్టు నాయకులు స్పందించారు. [[మద్దుకూరి చంద్రశేఖరరావు]] వంటి వారు ప్రతి విమర్శల్ని వారి పత్రికలలో రాశారు.<ref>{{cite web|last1=నరిసెట్టి|first1=ఇన్నయ్య|title=వివిధ పత్రికలు, పాత్రికేయులతో అనుభవాలు (part-1)|url=https://web.archive.org/web/20160321102716/http://telugumedianews.blogspot.in/2007/05/part-1.html|website=http://telugumedianews.blogspot.in/2007/05/part-1.html|accessdate=21 March 2016|ref=http://telugumedianews.blogspot.in/2007/05/part-1.html}}</ref>
 
ఆయన అన్న విజయరాజ కుమార్ తొలుత ఫార్వర్డ్ బ్లాక్ లో, తరువాత కృషి కార్ లోక్ పార్టీలో ఉండడం వలన, ఆయనకు ఆ పార్టీల వారితో పరిచయాలు కలిగాయి. జైలు నుండి విడుదలై ఆయన అన్న రాగానే, మళ్ళీ కాలేజీ చదువులు కొనసాగించగలిగాడు. అయినా రచనలు మానలేదు. ఎం.ఎన్. రాయ్ రచనలు కొన్ని అనువదించి ప్రజావాణిలో ప్రచురించాడు. 1964 వరకూ రాశారు. తరువాత ప్రజావాణికి మానేశాడు. [[వట్టి కొండ రంగయ్య]] కొన్నేళ్ళ తరువాత ప్రజావాణి నిలిపేశాడు. పార్టీలు అధికారం రాజకీయాలు అనే [[ఎం.ఎన్. రాయ్]] వ్యాస సంపుటి, మెన్ ఐ మెట్ అనే వ్యక్తిత్వ అంచనాల రచన ప్రజావాణిలో అనువదించాడు. ఆయన రచన లేవీ సెన్సార్ కాకుండా రంగయ్య ప్రచురించి ఆయన్ని ప్రోత్సహించాడు.
"https://te.wikipedia.org/wiki/నరిశెట్టి_ఇన్నయ్య" నుండి వెలికితీశారు