దిగవల్లి వేంకటశివరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఫిబ్రవరి 15, 1993 → 1993 ఫిబ్రవరి 15 (7), 3 ఏప్రిల్ 2015 → 2015 ఏప్రిల్ 3, స using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నుండీ → నుండి (15) using AWB
పంక్తి 40:
'''దిగవల్లి వేంకట శివరావు''' ([[ఫిబ్రవరి 14]], [[1898]] - [[అక్టోబరు 3]], [[1992]]) చరిత్ర పరిశోధకులు, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన అనేక చారిత్రికాంశాలను పరిశోధించి పుస్తకాలు రచించారు.
==జీవిత విశేషాలు==
దిగవల్లి వేంకటశివరావు గారు [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[తూర్పుగోదావరి జిల్లా]] [[కాకినాడ]]లో [[ఫిబ్రవరి 14]] [[1898]] న వెంకటరత్నం, సూర్యమాణిక్యాంబ దంపతులకు జన్మించారు. శివరావుగారు [[కాలికట్]]లో ఫస్టు ఫారం చదువుతూవుండగా వారి బావగారికి బదలీ కావడంవల్ల ఫస్టు ఫారం [[బెంగళూరు]]లో తిరిగి చదవటం ప్రారంభించారు. కాని మళ్ళీ బదిలీ అవుటవల్ల 1910 లో రాజమండ్రీ వచ్చేసి అక్కడ మళ్లీ ఫస్టు ఫారం చేరి అక్కడనుండీఅక్కడనుండి నుండీనుండి ఎస్.ఎస్.ఎల్.సి దాకా వీరెశలింగం స్కూలులో చదివారు. 1916 లో [[మద్రాసు]] ప్రసిడెన్సీ కళాశాలలో ఇంటర్మీడియట్, బి.ఎ ( 1918 -1920) తరువాత న్యాయ కళాశాలలో బి.యల్ ( 1920-1922) [[మద్రాసు]] లోనే పూర్తిచేసి 1922 నుండి [[విజయవాడ]]లో ప్రముఖ [[న్యాయవాది]]గా ప్రసిధ్ధి చెందారు. వారు న్యాయశాస్త్ర చదువులో జేరేటప్పటికే గాంధీగారు నిరాకరణోద్యమం మొదలైయుండుటయూ దేశ స్వాతంత్ర్య యోధన వారి మనస్సులో బలమైన ఆందోళన కలుగజేసినట్లునూ అతికష్టముమీద వారు న్యాయశాస్త్ర చదువు బి.యల్ పూర్తిచేయట జరిగినట్లు వారు 1966 లో తనకు జరిగిన సన్మాన సభలో చెప్పారు.
 
== వ్యక్తిగత జీవితం ==
ఆయన తల్లిగారు [[ద్రాక్షారామం]] వాస్తవ్యులు ఆలమూరు సూరయ్య గారి కుమార్తె. శివరావుగారి సతీమణి [[విశాఖపట్టణం]]కు వాస్తవ్యులు బుధ్ధిరాజు మూర్తిరాజు గారి కుమార్తె కమల. శివరావుగారు వృత్తిరీత్యా 1922 నుండీనుండి [[విజయవాడ]]లో ప్రఖ్యాత [[న్యాయవాది]]. అంతేకాక వారు చరిత్ర పరిశోధకుడుగా గ్రంథ కర్తగా ప్రసిధ్ధి.<ref>The National Biography of Indian Literature 1901-1953 సాహిత్య ఎకాడమీ, కొత్తఢిల్లీ, వాల్యూం 4, పేజీలు 251,416,417,419</ref><ref>నా జీవితగాధ-నవ్యాంధ్రము (1959) అయ్యదేవర కాళేశ్వరరావు పేజీ155-159</ref>,<ref>మిత్రులు నేను [[గొర్రెపాటి వెంకట సుబ్బయ్య]] (1970) పేజీ 186-193</ref>, గాంధీ వాది. గాంధీ ప్రవేశపెట్టిన అనే క సత్యాగ్రహ ఉద్యమములో వారి సేవ విశేషమైనది.<ref>[[ఆంధ్రజ్యోతి]] అక్టోబరు10,1966 "నేనెరిగిన శివరావుగారు" [[కాకాని వెంకటరత్నం]]</ref>. జైలుకు వెళ్ళటానికి ఏరోజుకారోజు సంసిధులైయ్యుండికూడా [[బ్రిటిష్]] ప్రభుత్వచేసే అన్యాయమును ప్రజలకు కాంగ్రెస్సు కార్యకర్తలకు తెలిసేటట్టు ఉదృతముగా ఆనేక రచనలు కాంగ్రెస్సువాదిగను వ్యక్తిగతముగను చేశారు. నిశతమైన [[న్యాయవాది]]గా వృత్తి రీత్యా వారు ప్రముఖులైనప్పటికి నీ వారు కేవలం వృత్తికే అంకితం అయి ధన సంపాదనే లక్ష్యం చేసు కోలేదు. విద్యార్థిగా చదువుకుంటున్న రోజలనుంచే దేశ చరిత్ర, స్వతంత్ర ఉద్యమాలకు తోట్పడుటకు దోహదం మైన వారి ఉపాధ్యాయుల ప్రసంగాలు, రచనలు, వారి పై ప్రభావం చూపటంవల్లం వారు వృత్తిలో ప్రవేశిస్తూనే ఆకాలంనాటి కాంగ్రెస్సు రాజకీయల్లో పాలుపంచుకుంటూ ఇంకో ప్రక్క ఏమాత్రం సమయం వృధాచేయకుండా వారు సాహిత్యకృషిలో మునిగి తేలుతూ వుండేవారు. చరిత్రకు సంబంధించి ఇంకా వెలుగు చూడని క్రొత్త విషయాలు చదవాలి వ్రాయాలి అనేది ఆయనకు లక్ష్యంగా వుండేది. అనేక పుస్తాకాలు చదివి చారిత్రాత్మకమైన అనే క అపురూపమైన వ్యాసములు, పుస్తకములు వ్రాశారు.<ref>" ప్రామాణిక చరిత్రకారులు ",అక్కిరాజు రమాపతి రావు ఆంధ్ర ప్రభ ఫిబ్రవరి 15,1988</ref> వారు నీతి నిజాయితీకి మరోపేరు.<ref>ఆంధ్రపత్రిక నవంబరు 9, 1986 "ద్రిషణా ధురంధరుడు" ప్రకాశచంద్ర శతపధి</ref> [[అవినీతి]] ఆటగోడుతనంసహించేవారు కాదు. కల్లాకపటం వారి దరిదాపుల్లోకి రావటానికి సాహచించేవికావు. 1930–1947 మధ్యకాలంలో గాంధీ గారి స్వాతంత్ర్యోద్యమం పిలుపులో వారు [[సాహిత్యం|సాహిత్య]], [[రాజకీయాలు|రాజకీయ]], [[న్యాయవాది|న్యాయవాద]] పరిజ్ఞానంతో చేసిన కృషి అపారం. [[ఉపన్యాసాలు]] ఇవ్వటం ఉపన్యాసాలకి వెళ్ళ టం వారు అరుదుగా చేశేవారు. [[స్వాతంత్ర్య సమరయోధులు]]<nowiki/>గా ఎటువంటి గౌరవాలు సన్మానాలు స్వీకరించేవారు కాదు. తను వృత్తిరీత్య న్యాయవాదినని, జైలుకు పోలేదని కారణాలు చెప్పి నిరాకరించేవారు. వినపట్టం కొంచంగా తక్కువ కావటంతోనే 1965 లోనే కోర్టుకు వెళ్లడం మానేశారు. అప్పటికి వారికి చాల పెద్ద పెద్ద కేసులు విచారణకుండేవి. ఆత్మగౌరవం వారికి సంధిపడరాని విషయం. కోర్టు మానేసినప్పటికీ వారి సలహాకోసం కక్షిదారులు వస్తూవుండేవారు. అలాగ వారు న్యాయ సలహాలు ఇస్తూ 1980 దాకా [[విజయవాడ]]లోనే వుండేవారు. వారి సతీమణి కమల 1978 లో పరమదించారు. 1980 లో 83 ఏండ్లు పైబడ్డ తరువారు శివరావుగారు హైదరాబాదులో వారి కుమార్ల వద్ద వుండేవారు. వారు [[సాహిత్యం|సాహిత్య]] కృషి మాత్రం మానకుండా జీవితాంతం చదవుతూ వ్రాస్తూ వుండి చివరకు 95 పైబడినతరువాత 03-10-1992 న [[భోపాల్]] నగరంలో “a narrative of the campaign in India which terminated the war with Tippusultan in 1792” అనే పుస్తకం చదువూతూనే వారి కుమారుని వద్ద చివరి శ్వాస వదిలారు. వారి సాహిత్య కృషే వారి జీవిత చరిత్రలో చాల పెద్ద పర్వం. వారు దాదాపుగా 40 పుస్తాకాలు, 400 వ్యాసాలు వాశారు. వారు వ్రాసిన వ్యాసాలు అనేక పత్రికల్లో ప్రకటితమయ్యేవి అనేక చారిత్రక విషయములు ఎక్కడెక్కడనుంచో త్రవ్వి బహువిధ కృషితో వాటిని తెలుగువారి కోసం సరళమైన తెలుగులో మంచి శైలిలో వెలుగులోకి తీసుకుచ్చారు. శివరావు గారు తన సమకాలికులు, మిత్రుల కంటే దీర్ఘ కాలం జీవించారు వారిజ్ఞాపక శక్తి అపారం. కచ్చితమైన తారీఖులు పేర్లు సంఖ్యలు వారికి కొట్టిన పిండి. వారి చేతివ్రేళ్ళమీద వుండేవి. కట్టల కట్టలుగా వ్రాసుకునియన్న నోట్సుల్లోంచి ఏ విషయంపైన కావలసినా చాల సునాయాసంగా బయటకు తీయగలిగేవారు. మొదటినుంచీ పుస్తకం చదువుతు న్నప్పుడే నోట్సు వ్రాసుకోటం వారికి చిరకాలపు అలవాటు. ఆ విధంగా వారు చరిత్ర పరిశోధన చేసి వ్రాసిపెట్టుకున్నఅనేక నోట్సుల కట్టలు చాలవిలువైన ఖజానాలాంటివి చరిత్రపరిశోధకులకు చాల ఉపయోగ పడగలవి ఇంకా ఉన్నాయి. వారి అముద్రిత గ్రంథములు, వ్యాసములు కూడా చాలవున్నవి. ముఖ్యంగా [[కథలు]] గాథలు 5 మరియ 6 భాగములు చాల విలువైనవి. వెంటనే ముద్రింప తగినవి. వారు చేసిన సాహిత్యకృషి వారి పుస్తకాలు వ్యాసాలు చెప్ప గలవు. న్యాయవాది వృత్తి, సాహిత్య కృషి, స్వాతంత్ర్యోద్యమములో [[కారాగారము|జైలు]]<nowiki/>కి వెళ్ళటం అనివార్యమైన స్థితిలో కూడా వారు వివిధరకాలుగా చేసిన కృషి విషేంచి చెప్పదగినవి. వాటిల్లో కొన్ని క్లుప్తంగా
# [[ఆంధ్ర]] [[మద్రాసు]] ప్రావిన్సల పై విపులమైన సమాచారము [[గాంధీ]]గారి హయామ్ లో కాంగ్రెసు అధిష్ఠానానికి పంపిచారు
# స్వాతంత్ర్యోద్యమములో [[కాంగ్రెసు]] కార్యకర్తలకు బోధపడేటట్లు కీలక రాజకీయ విషయములు, ప్రజాప్రభుత్వ విధానములు, బ్రిటిషవారు మనదేశంలో చేస్తున్నపక్షపాతపు పరిపాలన, వారు మనప్రజలను మన దేశ నిధులను ఏవిధంగా దోచుకుంటున్నదీ మొదలగు విషయముల గురించి అనేక కరపత్రములు వ్రాశారు
పంక్తి 56:
# ఆంధ్ర ప్రభుత్వమువారు వారి జ్ఞాపకాలను రికార్డు చేసారు. ఆవిధంగా వారు చేసిన కృషి వివరాలు వారి సాహిత్య కృషితో జతపర్చటమైనది.
“Family History and diary of chronological events” అని పేరుతో ఒక పెద్ద డైరీలో 1815 నుండీనుండి వారు తన సొంత విషయాల్తో పాటుగా ఆకాలంనాటి గోదావరి ప్రోవిన్సు, పిఠాపురం జమీందారీ ఎస్తేటు పరిసర ప్రాంతాలకు సంబంధించినవి కూడా వ్రాశారు. ఎందువలనంటే వారి పితామహులైన దిగవల్లి తిమ్మరాజుగారు ఆకాలంలో రాజమండ్రి- [[కాకినాడ]]- పిఠాపురం (ఆనాటి రాజమండ్రీ జిల్లా) లో కంపెనీ ప్రభుత్వము వారి వున్నతో ద్యోగి (1820లోఇంగ్లిషు రికార్డు కీపర్ తరువాత 1850 లో హుజూర్ సిరస్తదారు). వారి పితామహుని కాలం నాటివి గోదావరి జిల్లాకి, [[పిఠాపురం]] జమీందారీకి సంబంధించిన ప్రభుత్వ రికార్డులు, రెవెన్యూ రికార్డులు నుంచి శివరావు గారు బహుముఖ కృషితో సంపాదించి వ్రాశారు. వారి తండ్రి గారి కాలం 1850 -1908 మరియు తన జీవితకాలం 1898-1992 మధ్య కాలం లోని సంఘటనలు శివరావుగారి డైరీలో వ్రాశారు . 1923 నుండీనుండి 1947 మధ్యకాలంలో [[కృష్ణాజిల్లా]]<nowiki/>లో ముఖ్యంగా [[బెజవాడ]]<nowiki/>లో గాంధీమహాత్ముని సహాయనిరాకరణోద్యమము ఉప్పు సత్యాగ్రహము మొదలగు స్వాతంత్ర్య పోరాటమునకు సంబంధించన ఉద్యమాల సంఘటనలు చాలా విపులంగా వ్రాసుకున్నారు. ఆంతేకాక తన డైరీలో “Reminiscences” అని పేరుతో వారికి ప్రీతి కరమైన విషయాల పై విశదంగా అనుభవాలు జ్ఞాపకాలు వ్రశారు. ఉదాహరణకు వారి రాజమండ్రీలో 1910 -1916 మధ్య అనుభవాలు, మద్రాసులో 1916 - 1922 ప్రెసిడెన్సీ కాలేజీ, విక్టోర్యా హాస్టలు జ్ఞాపకాలు వ్రాసుకున్నారు. వారి సమకాలీకులు విక్టోర్యా హాస్టలలో నున్న ఇంజనీరింగ్, వైద్య, సాహిత్యము, న్యాయ విభాగపు విద్యార్థులు తెలుగువారు వారి వారి జీవితకాలాంతరమూ శివరావుగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు, రాకపోకలు వుండేవి. అటువంటివారి కొందరి పేర్లు చెప్పక తప్పదు: అడవి బాపి రాజు, [[వెలిదండ్ల హనుమంతరావు]] L.M&S, డా. చాగంటి సూర్యనారాయణ MBBS, డా. దండు సుబ్బారెడ్డి M.D, [[యల్లాప్రగడ సుబ్బారావు]] L.M&S.,Ph.D (U.S.A), [[డా గోవిందరాజుల సుబ్బారావు]], [[డా అమంచర్ల శేషాచలపతి రావు]] [[కె యల్ రావు]] (కానూరి లక్ష్మణ రావు) M.Sc., Ph.D. (కేంద్ర మంత్రిగా చేశారు) [[టి. యస్ అవినాశ లింగం]] (మద్రాసు రాష్ట్ర మంత్రి గాచేశారు), [[యమ్. భక్త వత్సలం]] ( మద్రాసు రాష్ట్ర ముఖ్య మంత్రిగా చేశారు ) [[కోకా సుబ్బారావు]] ( భారత ప్రధన న్యాయ మూర్తిగా చేశారు) [[పోతాప్రగడ శ్రీరామారావు]], (తణుకులో న్యాయవాదిగా చేశారు )
 
==వంశ చరిత్ర : పుట్టుపూర్వోత్తరాలు==
పంక్తి 66:
 
==సాహిత్య కృషి==
వృత్తి రీత్యా శివరావు గారు న్యాయ వాదైనా వారు సాహిత్యాభిలాషి. వారి జీవితం సాహిత్య కృషి కే అంకితం. శివరావు గారి సాహిత్యాభి రుచి చిన్నానాటి నుండే. పద్నాల్గెండ్ల ప్రాయంలో రెండవ ఫారంలో చదువుతుండగా 1912 లో వీరేశలింగం గారి సతీమణి గారి స్మారకోత్సవం శివరావు గారి ప్రార్థన భక్తచింతామణి పద్యాలు తోటి ప్రారంభం అయింది. అప్పట్ణుండీ [[రాజమహేంద్రవరం]]<nowiki/>లో సారస్వత సభలలో బాలుడైన శివరావు గారు చదవే భక్తచింతామణి పద్యాల ప్రార్థనతో ప్రారంభించటం పరిపాటి. వారు 3 వ ఫారంచదువతున్నప్పుడు చిలకమర్తివారి రామచంద్ర విజయమును పూర్తిగా వ్రాసినందుకు వారి క్లాస్ మాస్టారు భక్తచింతామణి (3వ సంకలనం) పుస్తకమును బహుకరించారు.. ఆరేళ్ల తరువాత, 1919 లో భక్తచింతామణి రచించిన [[వడ్ఢాది సుబ్బారాయుడు]]గారే స్వయంగా వారి చేతి దస్కత్తుతో భక్త చితామణి 8 వ సంకలన మును శివరావు గారికి బహుకరించారు. 1913 లోఆంధ్రభాషాభి వర్ధిని (చిలకమర్తి వారు స్దాపించి న సారస్వత సభ) లో సభ్యలుగా చేరారు. 1914 లో శివరావు గారి వ్యాసం “స్త్రీ విద్య” ఆలమూరు వెంకటరాజుగారి వ్యాసంతో పాటు గృహనిర్వాహకము అను చిన్నపుస్తకములో ముద్రింప బడింది. 1914 లో ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజము వార్షికోత్సనము అధ్యక్షుడుగా [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] గారు, కార్యదర్శిగా [[అద్దంకి సత్యనారాయణ శ]]ర్మగారు, సభ్యులుగా [[మైనంపాటి నరసింహ రావు]], [[అడవి బాపిరాజు]], బంధా వీరనారాయణదేవు, గుడిపాటి సూర్యనారాయణ, బోడపాటి సత్యనారాయణ, ఈరంకి నరసింహము, సూరంపూడి కనకరాజు, దిగవల్లి వెంకట శివరావు, పోణంగిపల్లి సత్యనారాయణ, చింతపెంటవెంకట రమణయ్య, వాసిరెడ్డి వీరభద్ర రావు, [[కవికొండల వెంకటరావు]] తదితరులు. ఆ వార్షికోత్సవాల సమావేశాలకు అనేక ప్రసిధ్ధ పురుషులు అధ్యక్షత వహించారు. వారిలో కొందరి పేర్లు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు, [[శ్రీపాద కృష్ణమూర్తి]] గారు, [[చిలుకూరి వీరభద్రరావు]] గారు, [[వంగూరి సుబ్బారావు]] గారు, [[చెలికాని సుబ్బారావు]] గారు, [[నాళం కృష్ణారావు]]గారు, వడ్డాది సుబ్బారావుగారు,[[కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి]] గారు అలా 1914 లో జరిగిన సమావేశం లోశివరావు గారు స్త్రీ విద్య మీద ప్రసంగించారు. ఇంకో సారి “హిందూమహా జనులమతసభ, అనబడిన సమావేశం లో కందుకూరి వీరేశలింగం గారు కూడ హాజరైవున్నప్పుడు శివరావు గారు రామానుజాచారి పాత్ర వహించి తను రచించిన పద్యం చదవగా వీరేశలింగం గారు చాల ప్రసన్నులైయ్యారు. 1915-1916 సంవత్సరం లో SSLC క్లాసులో ఇంగ్లీషు పరీక్షలో ఉన్నత మార్కలుతో4 సెక్షన్ల మీద మొదటి స్దానం లో నిలిచినందుకు వారి క్లాస్ మాస్టారు గజవల్లి రామచంద్రరావు M.A గారు Life of Gladstone by John Morley 3 volumes బహుకరించారు. రాజమండ్రీ జ్ఞాపకాల్లో వారి డైరీ లో చిలకమర్తివారి కీ శ్రీపాద కృష్ణమూర్తిగారికి వకరిమీద వకరు ఎద్దేవపుర్వక వాదోపవాదాలు జరుగుతూవుండేవని వారి డైరీ లోరాజమండ్రీ జ్ఞాపకాలలో వ్రాసుకున్నారు. 1916 లో మద్రాసు ప్రసిడెంసీ కాలేజీ లో ఇంటర్మీడియట్ చదువుతుండగా “హత్యా ఛాయ” అను నవల తెలుగులో వ్రాశారు. ఆ నవల ఆధారంగానే 1929 లో నీలాప నింద అను పుస్తకము ప్రచురించారు. 1918 లో[[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్]] ఫైనల్ వుడగా [[మద్రాసు]] రాజధాని కాలేజీ తెలుగు విద్యార్థుల ఆంధ్ర భాషావర్ధని సమాజం తరఫున శివరావు గారు ఆంధ్ర వాణి అనేటివంటి చేతివ్రాత పత్రికకి సంపాదకులుగా వుండేవారు ఆపత్రికలో “ విడువము” అనే పేరుతో వ్రాశిన సంపాదకీయ ప్రచురణను చాలమంది అభనందించారు శ్రీ నూతక్కి రామశేషయ్య గారు (తదుపరి జయపూరు దివాన్ గాచేశారు ) చాల అభినందించారు. భహ్మశ్రీ వావిలకొలను సుబ్బారావు గారు ఆ చేతివ్రాత పత్రిక అభిమానులు. అదే కాలంలో 1918 లో శివరావు గారికి మద్రాసు సాధు సంఘం వారు శివరావు గారు వ్రాసిన “ రాజ భక్తి” అను వ్యాసమునకు రజత పతాకం బహుకరించారు. ఆ పతకం మద్రాసు జిల్లా కలెక్టురు గారు ప్రోగ్రెసివ్ యూనియన్ హాలు జరిగిన బహిరంగ సభలో బహుకరించారు. 1919 లో శివారవు గారు బి.ఏ చదువుతుండగా శ్రీ కృష్ణదేవరాయలు మీద వ్రాసిన వ్యాసం ఎమ్.పి శర్మ గారు మద్రాసులో సంపాదకులు గావున్న విద్యావిశాఖ పత్రికలో ప్రచురించ బడింది. 1919–1920 సంవత్సరంలో శివరావుగారు వ్రాసిన ఆత్మ విశ్వాసము అను వ్యాసమునకు [[చెన్నై|మద్రాసు]] రాజధాని కాలేజీ వారు చిరకాలంగా ప్రతీఏటా 1875 నుంచీ ఇస్తూవచ్చిన రూ 20 బౌరదల్లన్ బహుమతి 1919 సంవత్సలో శివరావుగారికి వచ్చింది. అంతకు పూర్వం ఆ బౌరదల్లన్ బహుమతిని పొందినవారిలో 1875 లో [[తల్లాప్రగడ సుబ్బారావు]] ( 1850-1890) ( సుబ్బారావు గారు మద్రాసు థియోసఫికల్ సొసైటీకి శక్రటరీ చేశారు, అనిబిశంటు కన్నా ముందు ). తరువాత 1891 లో వేపారామేశం గారికి ( వేపారామేశం గారు మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ చేశారు ) పానుగంటి రామారాయణింగారికి in 1892, పెద్దిభొట్ల వీరయ్యగారికి 1894 and [[దాసు విష్ణురావు]] గారికి 1895 లోను వచ్చినట్లుగా శివరావు గారి డైరీ లోవ్రాసుకున్నారు. చిన్ననాటినుండీచిన్ననాటినుండి వారు గాంధీగారి సత్యాగ్రహ ఉద్యమం, స్వాతంత్ర్యపోరాటానికి వారి ఉపాధ్యాయుల ప్రేరేపణ వారి మనస్సుకు బాగా నాటుకున్నాయ. 1913- 1914 సంవత్సరం స్కూలు విద్యార్థిగానుండగనే రాజమండ్రీలో వారు గాంధీగారు [[దక్షిణాఫ్రికా]]లో చేసే [[సత్యాగ్రహం|సత్యాగ్రహ]] ఉద్యమసహాయానికి నిధులు పోగుచేశి పంపిచారు. 1920 లో లాకాలేజీలో జేరేట్టప్పటికే గాంధీగారి సహాయనిరాకరణోద్యమము కొనసాగుతుండటం వారి మనస్సు ఆందోళనకు గురై స్వాతంత్ర్యపోరాటంలో తను కూడా పాలు పంచుకోవాలనే ఒక గట్టి సంకలనం రావటం జరిగింది. వారు ఎలాగో లాకాలేజీ చదువు పూర్తిచేసుకుని బయట పడుతూనే కాంగ్రెస్ రాజకీయాల్లో తన శక్తికొలది బాధ్యతలు నిర్వహించారు. లాకాలేజీలో జేరబోయే ముందు 1919 సంవత్సరం ఎండా కాలపు శలవలకి శివరావుగారు బొంబాయికి వెళ్లారు . అవి రౌలట్ బిల్లు తిరస్కారానికి తీవ్ర ఆందోళన చెస్తున్న రోజులు. ఆక్కడ బోంబే క్రానికల్ పత్రిక (బి.జి హర్నిమన్ సంకలనంచేసే పత్రిక ) సత్యాగ్రహ ఉద్యమాన్ని చాల అనుకూలంగా ప్రచురించేటటువంటి పత్రిక (ఆకారణంగా హర్నిమన్ నుకు దేశాంతర శిక్ష విధించారు deported ) శివరావు గారు ఆ పత్రికలో ప్రచురించిన వ్యాసాలు, విశేషాలు కత్తిరించి ఒక ఫైలలో అతికించుకుని తిరుగు ప్రయాణంలో బెజవాడకు వస్తుండగా ఒక సి ఐ ఢి పోలీసు రైలు బండి లోకి వచ్చి ఆ ఫైలు తనతో అట్లా తీసుకును వెళి తే తంటాల్లో పడతావని హెచ్చరించాడుట. మద్రాసులో లా చదువుతూవుండగనే 1920 నవంబరులో లియో టాల్సాయి, రంబీంద్రనాధ్ రచించిన 23 కథలు “కోడి గృడ్డంత వడ్లగింజ , మేము మీకు పట్టముగట్టితిమి, పధ్నాలుగేండ్ల ప్రాయము” అను 23 కథలు వారు తెలుగులో వ్రాసిన వ్యాసాలు ఆంధ్ర పత్రికలో ప్రచురితమైనవి. 1891 లో దాసు కేశవరావు గారు బెజవాడలో నడుపుచున్న జ్ఞానోదయము అను వార పత్రికలో1922 ఆ ప్రాంతములో శివరావు గారు రచించిన వ్యాసములు హైందవ నాటకరంగము, హైందవ వనోద కథలు అను రెండు వ్యాసములు చురితమైనవి
[[దస్త్రం:చళ్ళ పిళ్ళ వెంకటశాస్త్రి గారు.pdf|thumbnail|కుడి|దిగవల్లి వేంకటశివరావు చెళ్ళపిళ్ళ వేంకటశివరావుకు వ్రాసిన ఉత్తరం]]
1922 నుండీనుండి న్యాయవాది వృత్తితోపాటు సాహిత్యం, స్వాతంత్ర్యపోరాటం
 
1922 లో న్యాయవాది వృత్తిలో ప్రవేశిస్తూనే వారు ఒకప్రక్క [[మహాత్మా గాంధీ|గాంధీ]]<nowiki/>గారి ఆధర్వాన జరిగే జాతీయ ఉద్యమాల ఆందోళనల దిశానిర్ధేశాల ప్రకారం కృష్ణా జిల్లాలో జరిగే ఆందోళనకు మదత్తుగా కృషి చేయటం ఇంకొక ప్రక్క ఏమాత్రం సమయం వృధా చేయకుండా సాహిత్య కృషి చేయటం న్యాయవాది వృత్తితోపాటు గణ నీయం. వారు చేసిన సాహిత్య కృషి ప్రశంసనీయము బెజవాడలో నున్న రామమోహన లైబ్రరీలో నున్న చరిత్ర సాహిత్యమీద వున్న అనేక పుస్తకాలు చదవటమే కాక మద్రాసులోని కొన్నెమరా లైబ్రరీ నుండి తనకు కావలసి న పుస్తకాలు ఇంటికి తెప్పించుకునే ఏర్వాటు రామమోహన లైబ్రరీ వారి ద్వారా చాలా సంవత్సారలుగా శివరావుగారికి వుండేది. ఆ విధంగా వారు అనే క పుస్తకాలు మద్రాసునుండి తెప్పించుకును బహు విధ కృషి చేసి అనేక చారిత్రాత్మక విషయాలు తెలుగు వారికోసం అనేక పుస్తకాలు వ్యాసాలు వ్రాయగలిగారు. 1922 బి యల్ ఆఖరి సంవత్సరంలో వుండగనే ఆంధ్రుల సం స్క్రుతిక చరిత్ర అనే వారి వ్యాసం బొంబాయి లోని తెలుగు సమాచార్ అనే పత్రికలో ప్రచిరుతమైనది. పట్టాపుచ్చుకుని జూన్ 1922 లో బెజవాడలో న్యాయవాది వృత్తిలో ప్రవేశించి న తరువాత శ్రీ [[కురుగంటి సీతారామయ్య]] గారు M.A (was Head Master) నడుపుచున్న విద్యార్థి అను పత్రికలో శివరావు గారి వ్యాసములు (1) భారతీయుల లలిత కళలు (2) జాతీయవిద్య ప్రచురితమైనవి. 1923-24 లో “చిన్న కథలు”, “మన దారిద్య్రము”, “ తెల్మా ([[నార్వే]] దేశపు నవలాధార కధ) అను వ్యాసములు శ్రీ [[దుగ్గిరాల రాఘవచంద్రయ్య]] గారు బెజవాడనుండి పచురించే స్వరాజ్య పత్రికలో ప్రచురించ బడినవి. 1922 లో ప్రెసిడెంసీ కాలేజీ లో వ్రాసిన పోటీ వ్యాసము పోతన-వేమనుల వారి కాలము, కృతులు నకు శివరావుగారికి 1924 పొవెల్ మోరహెడ్ ప్రాదేశిక భాషల బహుమతి రూ 150 ఇచ్చారు. ఈ వ్యాసము నే ఆధారంగా చేసు కు ని 1924 లో పోతన వేమనలయుగము అనే పుస్తకము ను ప్రచురించారు. ఆ పుస్తకము[[వావిలకొలను సూరయ్య]] గారు, [[కొడాలి ఆంజనేయులు]] గారు నడిపేటటువంటి శారదాభాండారు ప్రెస్సు లో ముద్రితమైనది. 1923 లో కాకినాడ కాంగ్రెస్సు సదస్సుకు శివరావరు గారు కూడ వాలంటరీ భాద్యత లో వెళ్లారు. 19/08/1922 టంగుటూరు ప్రకాశం గారు ఉత్తరంవ్రాసి వారి స్వరాజ్య పత్రికకు స్పెషల్ కరెస్పాండెంటు గా వుండమని వ్రశారు అందు కు అంగీకరించిన శివరావు గారు 1922 కాకినాడ కాంగ్రెస్సు కు వచ్చిన [[దుగ్గిరాల గోపాల కృష్ణయ్య]] గారిని ఇంటర్వ్యూ చేసి స్వరాజ్యకి పంపిన రిపోర్టు ప్రచురితమైనది. 1925 లో [[వేలూరి సత్యనారాయణ]] గారి పుస్తకం బౌధ్ధమహా యుగం లో శివరావుగారి గారి సాహిత్యకృషి ని గూర్చి చెప్పారు. ఆదే సంవత్సరం లో [[కాశీనాధుని నాగేశ్వరరావు]] గారు [[సింగరాజు వెంకట సుబ్బారావు]] గారింట్లో వుండగా డా [[ఘంటసాల సీతారామ శర్మ]]గారు శివరావుగారికి మొదటిసారిగా [[కాశీనాధుని నాగేశ్వరరావు]] గారిని పరిచయం చేయగా వారు శివరావుగారిని తమ భారతి మాస పత్రిక కు వ్యాసాలు వ్రాస్తు వుండమని అప్పట్ణుంచీ భారతి ని శివరావుగారికి కాంప్లిమెంటరీ గా పంపిచే ఏర్పాటు కూడా చేశారు. రాజమండ్రీలోని హితకారణి స్కూలుకు పూర్వవిధ్యార్ధుల సంఘం కోరిక పై 1925 వార్షికో త్సవం కు శివరావు గారు అధ్యక్షత వహించారు. [[అయ్యదేవర కాళేశ్వరరావు]] గారి ప్రేరేపణపై శివరావుగారు 1927 లో “దక్షిణాఫ్రికా” అనే పుస్తకం ప్రచురించారు. ఆ పుస్తకమును మహామత్మా గాంధీ గారికి అంకితమివ్వడానికి గాంధీ గారి అనుమతి కోరుతూ వ్రాయగా గాంధీ గారు శివరావు గారికి స్వయంగా చేతో జవాబు వ్రాశిన పోస్టు కార్డులో వ్రాసిన వాక్యాలు ఈ క్రింద ఇవ్వబడినవి .
పంక్తి 87:
</poem>
 
శివరావు గారి సాహిత్య, రాజకీయ రంగాలలో అభిరుచి కలగడానికి విద్యార్థి దశనుండే వారి అధ్యాపకుల బోధనలు, గొప్ప పుస్తకాలు వారి జాతీయ భావాలను చిగుర్చి స్వతంత్ర పోరాటానికి దోహ దం చేశాయి. 1920 లో వారు లా కాలేజీలో జేరిన సంవత్సరం గాంధీగారి సహాయనిరాకరణోద్యమం అప్పటికే జోరుగా సాగుతున్న రోజులు వారి మనసు కలవర పరచ సాగింది. న్యాయ వాది చదువు దైవాధీనంగా పూర్తిచేసుకుని బయటపడుతూనే స్వతంత్ర పోరాటసమరాటం అనేక విధాలుగా తనపాలు పంచారు. 1966 లో వారి సన్మాన సభలో మాట్లాడుతూ ఇట్లా చెప్పారు “ I read Savarkar’s war of Independence in 1929 and had no sleep for three nights” ఆ విధంగా అనేక సందర్భాలలో వారి మనస్సు మీద స్వతంత్ర పోరాటానికి ప్రేరణ కలిగింది. 1927 డిశంబరు 2 న భహ్మశ్రీ [[వేదం వెంకట రామశాస్త్రి]] గారు అప్పటికి బెజవాడలో నున్న ఆంధ్రవిశ్వవిద్యాలయ కాన్వోకేషనుకు వచ్చియుండగా బెజవాడ మ్యునిసిపల్ కౌన్సిల్ వారు శాస్త్రి గారిని సన్మానించటానిక సభ ఏర్వాటు చేసి శివరావుగారిచే వ్రాయించిన సన్మాన పత్రం శాస్త్రి గారికి ఇచ్చారు, 1929 లో కోఆపరెటివ్ సొసైటీ న్యూస్ అను పత్రికలో శివరావుగారు ‘ భారతదెశ దారిద్యము’ అను వ్యాసము వ్రాశారు. ఆవ్యాసమును ఆధారము చేసే “ నిరభాగ్య భారతము” అను వ్యాసము కృష్ణా పత్రికలో ప్రచురించారు. 1930 లో పశ్చమ కృష్ణా జిల్లా న్యూస్ వారు శివరావుగారు రచించిన అనేక చిన్న పుస్తకములను ప్రచురించారు. పశ్చమ కృష్ణా జిల్లా మాహా సంఘం వారు రాజకీయ పరి జ్ఞానము అను పేరుతో చాల చిన్నపుస్తకములను ప్రచురించారు వాటిలో శివరావు గారు వ్రాసిన వి ఆరు పుస్తకములు ప్రచురించారు ఆంధ్ర గ్రంథాలయం వారు ముద్రించారు. అందులో మొదటిది “సత్యాగ్రహ చరిత్ర” 12/03/1930 తేదీనా డు వెలువడింది. రెండవది “నిర్భాగ్య భారతము” 6/04/1930 నాడు వెలువడింది. అలాగ మిగత నాలుగూ దరిద్ర నారాయణీయము, సత్యాగ్రహ భూమి, సత్యాగ్రహ విజయము, పంచాజ్ఞాయుగము ఒకదానితరువాత ఒకటిగా వెలువడ్డాయి. ఈ “రాజకీయపరిజ్ఞానము” అను ప్రచురణలను బ్రిటిష్ ప్రభుత్వము వారు1933 నవంబరులో నిషేధిచారు. 1933 లో సహకార వస్తు నిలయము, [[అధినివేశ స్వరాజ్యము]] (Dominion Status ), and భారతదేశ స్థితిగతులు ” అను చిన్న చిన్న పుస్తకములను ప్రచురించారు. వారి అధినివేశ స్వరాజ్యము చాల ప్రఖ్యతి గాంచింది. 1934 లో ఆచార్య ఎన్ జి రంగా గారు [[నిడుబ్రోలు]] లో రైతు బడినొక దానిని స్తాపించారు. ఆ రైతు బడిలో శివరావు గారి పుస్తకాలు ను పాఠ్య పుస్తకాలు గా పెట్టారు. రంగా గారు శివరావు గారిని నిడుబ్రోలు వచ్చి అందులో విజ్ఞాన సాధనకై వచ్చే రైతాంగానితో సంభోదించమని ఆహ్వానించారు. కానీ శివరావు గారు వెళ్లటానికి వారి సమయం చాలలేదు. శివరావు గారు 1939 నుండీ బ్రిటిష్ యుగ చరిత్ర మీద పరిశోధన ప్రారంభించి తీవ్ర కృషి సల్పి అనేక వ్యాసములు వ్రాయటం ప్రారంభిచారు అలా వారు వ్రాసిన వ్యాసాలు అమృత సందేశము [immortal Message] లో ప్రచురించారు. ఆ పత్రిక బెజవాడలో సి వి రెడ్డి మరియు డి.యస్ శర్మ గార్లు సంకలనం చేశావారు అదే పత్రికలో శివరావు గారివి ఇంకో రెండు వ్యాసాలు—“ Christianization of India” మరియు “Hindu Muslim Civilization” అనే రెండు ఆంగ్ల భాషలో వ్రాసిన వ్యాసములను 1939- 1940 లో అమృత సందేశంలో ప్రచురించారు.. ఆంధ్ర మహా సభ వారు ఆంధ్రదేశ చరిత్ర వ్రాయించటానికి రచయితల సంఘం ఏర్పరిచారు. అందులో శివరావుగారని సభ్యులుగా నియమించారు . అట్లా నియమించినట్లుగా ఆంధ్రపత్రికలో వెల్లడైనది కూడా. 04/11/1943 తారీఖునాడు చిలకమర్తి వారు శివరావుగారికి జాబు వ్రాస్తూ వీరి సాహిత్య కృషి ప్రశంసించారు. 13/04/1945 తేదీన శ్రీ ప్రణవానంద స్వామి వారు శివరావు గారికి స్వయముగా గాయత్రీ మంత్రార్ధ వివిరము తెలియ పరిచారు. ఆరోజులలో 1930 నుండీనుండి -1947 దాకా వారికి చాల ప్రముఖు ల వుత్తరాలు వ్రాసియున్నారు. అప్పట్లోవారి కన్నా చాల పెద్దవారు వ్రాసిన ఉత్తారలలో గజవల్లి రామచంద్ర రావు,[[వడ్డాది సుబ్బారాయడు]],[[చిలకమర్తి లక్ష్మీ నరసింహం]], [[వావిలకొలను సుబ్బారావు]], [[చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి]], [[వేటూరి ప్రభాకర శాస్త్రి]], [[వేలూరి శివరామశాస్త్రి]], [[మాడపాటి హనుమంతరావు]],[[అయ్యదేవర కాళేశ్వర రావు]] మొదలగు ప్రముఖులు. వారి సమకాలీకులైన సాహిత్యవేత్తలు ఇంకా చాలా మంది వారితో తరుచు ఉత్తర ప్రత్తుత్తరాలు జరిపినట్లుగా తెలుస్తున్నది. ఇక్కడ వారి పేర్లివ్వటం సాధ్యమైన విషయం కాదు. 1930 -40 మధ్యకాలంలో వారు సహకార సంస్ధలకు సంబందిచిన పని కూడా చేశారు. కృష్ణా జిల్లా సహకార బ్యాంకు, సహకార సంస్ధ నిబంధనలు, ఉప ప్రబంధనలు ఏప్రిల్ 1935 లోను, మరియు గోదావరి జిల్లా సహకార బ్యాంకు ఉపప్రబంధనలు 1935 మే నెలలోను, తెలుగులో వ్రాశారు వాటినే ఆయా సంస్దలవారు రిజస్టరు చేయంచి 1935 మేనెలలో ముద్రించారు. 1935 లో బెజవాడలో కృష్ణా సహకార స్టోర్సు పేరుతో వున్న సంస్ధకు కార్యదర్శిగా కూడా చేశారు. చెరుకుపల్లి వెంకటప్పయ్యగారు అధ్యక్షుడు గానుండేవారు తరువాత ఆంధ్ర కోఆపరేటివి ఇనసేటిట్యూట్ కు డైరెక్టరుగా పనిచేశారు.. 17/06/1937 శివరావు గారు Resignation and dismissal of ministers” అని హిందూ దిన పత్రికలో ఉత్తరం వప్రచురించారు. 01/02/1938 న హిందూ పత్రికలో శివరావు గారు సేకరించిన భారత దేశ రాజ్యాంగ విధానము (constitution) లో నున్న విషయాలు కొన్నిటిని ప్రచురించారు. [[సి యఫ్ యాండ్రూస్]] గారు కాంగ్రెస్ అగ్రగణ్యడుగా వ్రాశిన ‘rise and growth of Congress’ అను పుస్తకము నకు మద్రాసు & ఆంధ్ర ప్రావిన్సుల పరిస్థితులను శివరావుగారు సేకరించి వ్యాసరూపంలో వారికి పంచారు.యాండ్రూస్ గారు 23/05/1939 శివారవూగారికి కృత్రజ్ఞతాపూర్వకమైన లేఖ వ్రాశారు 09/08/1942 తేదీన క్విట్ ఇండియా ఆందోళన ప్రారంభించినట్లుగా కాంగ్రెస్సు అగ్రనాయకులు ఉద్ఘోషించగానే గాంధీ గారిని అరెస్టుచేసిన కోన్ని నిముషములో ఆంధ్రలో ప్రొవెన్సియల్ కాంగ్రెస్సు వారు క్విట్ ఇండియా వుద్యమం ప్రారంభిచటానికి ఆంధ్ర కాంగ్రెస్సు నాయకుడైన [[కళా వెంకట్రావు]]గారి 29/07/1942 తేదీన ప్రకటన కర పత్రం సరళమైన తెలుగులో రేడియోలో ప్రసార నిమిత్తము వ్రాసిపెట్టమని [[నూకల వీరరాఘవయ్య]]గారు (వారి మరో పేరు శ్రీమతే) శివరావుగారిదగ్గరకు రాగా శివరావుగారు తెలుగులో వ్రాసిన పత్రం ముద్రించి యావధ్ధాంధ్ర దేశం పంచపె ట్టటం క్విట్ ఇండియా ఆందోళనలో జరిగిన విషయాలు. శివరావుగారు ఆంధ్రీకరించిన ఆ ప్రకటన పత్రం ఆనాటి కాంగ్రెస్సు కార్యకర్తలో చాల ప్రఖ్యాతి గాంచింది. 1946 లో మద్రాసునుండి ప్రచురితమైయ్యే [[న్యూ టైమ్స]] అనే పత్రికలో సంపాదకుడు యమ్ తిరుమలరావు సంపాదకుని మాటల్లో టంగుటూరి ప్రకాశంగారి జీవత చరిత్రని విషమంగా వ్యాఖ్యానించి వ్రాశారు. దానికి స్పందనముగా శివరావు గారు 12/08/1946 తేదిన ఆ పత్రిక సంపాదకునికి బహిరంగ లేఖ ఘాటుగా “Stop this disgraceful vilification of Prakasam” అని వ్రాసి పంపిచారు. ఆలేఖ ముద్రించి దానిమీద బెజవాడ పౌరులు న్యాయవాదులు సంతకాలు చేసి గాంధీగారికి పంపిచారు. ఆకాశవాణి ఢిల్లీలో [[వారణాశి సుబ్రమణ్యం]] గారు ప్రోగ్రమ్ డారెక్టరుగానున్నారు. వారు ఒక ఉత్తరంలో అప్పట్లో ఆంధ్ర ప్రొవిన్సియల్ కాంగ్రెస్సుకు అధ్యక్షుడుగానున్న [[ఆచార్య రంగా]]గారు టెక్నికల్ టెరమ్సు ట్రాన్సలేషన్ నిమిత్తము కమిటీనేర్పాటు చేస్తున్నారన్నీ ను, దానికి శివరావుగారిని అధ్యక్షనిగా వేస్తున్నారని దానికి శివరావుగారిని వద్దనకుండా స్వీకరించమని వారణాశి సుబ్రమణ్యంగారు వ్రాశారు. 1947 లో [[కొండా వెంకటప్పయ్య]] గారు తాను రచించిన వేంకటేశ్వర శతకం శివరావుగారికి బహుకరించారు. అదే సంవత్సరంలో బెజవాడ మునిసిపాలిటీ ఎన్నికలు జరిగినవి అధ్యక్ష పదవికి డా ఘంటసాల సీతారామశర్మ గారు పోటీ చేయ నిశ్చయించగా, వారికి ఎన్నికలు మానిఫస్టో శివరావుగారు తయారు చేశారు. [[కొమర్రాజు లక్ష్మణరావు]]గారు రచించిన పుస్తకం శివాజీ 3 వ సంకలనం 11/09/1947 తేదీన ప్రకటితమై న పుస్తకమునకు పరిచయ వాక్యాలు శివరావుగారు వ్రాశారు. అలే గే 4 వ సంకలనానికి కూడా డా [[కొమర్రాజు అచ్చమాంబ]]గారి తమ్ముడు [[కొమర్రాజు వినాయకరావు]] గారు కోరినమీదట మరల పరిచయవాక్యాలు శివరావుగారే వ్రాశారు. 1955 లో [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశ]] సమితి వారు పెట్టబోయే సమితికి శివరావుగారి సలహాలు కోరారు. [[కంభంపాటి సత్యనారాయణగారు]] 1957 లో విశాలాంధ్ర పబ్లిషింగ్ సంపాదకలుగానున్నప్పడు శివరావుగారు పెట్టిన షరత్తుల ప్రకారం ఏమాత్రం మార్పులు చేయకుండా 1857 పూర్వరంగములు అను పుస్తకమును విశాలాంధ్ర వారు ప్రచురించారు. 1957 లోనే నవోదయా పబ్లిషింగ్ హౌసు శివరావు గారు రచించిన సన్యాసుల స్వాతంత్ర్య సమరములు, ఆదిమనవాసుల యుధ్ధములు, మధుర నాయకులు అను మూడు పుస్తకములను ముద్రించుటకు నిశ్చయించి మొదటి రెండిటినీ వెంటనే ముద్రించారు.[[కాటూరి వెంకటేశ్వరరావు]]గారు అప్పట్లో (1957) కృష్ణా పత్రికకు సంపాదకుడుగానున్న [[కాటూరి వెంకటేశ్వరరావు]] గారు శివరావు గారిని తమ పత్రికకు వ్యాసములువ్రాయమని కోరారు.
శివరావుగారి సాహిత్య పరిశోధన, రచనలు క్రమ క్రమంగా 1922 నుండీనుండి శర వేగంతో వృధ్ది అవుతూవచ్చి 1940 నుండీనుండి 1950 మధ్యలో అత్యదికంగావున్నవని చెప్పవచ్చును. వారు వ్రాసిన వ్యాసములు పది ఇరవై కాదు, ఒకటి రెండు పత్రికల్లో అనికాదు. అనేక వ్యాసాలు, వరుసగా శీర్షికలుగా వివిధ పత్రికల్లో, బెజవాడలోని పత్రికలే కాక ఆంధ్ర దేశంలో మారుమూలల నుండి ప్రచురితమైన పత్రికలవారు శివారువూగారి వ్యాసాలు కావలని కోరటం కొన్ని కొన్ని వ్యాసాలు అటువంటి కొన్ని చిన్న చిన్న పత్రికలకూడా పంపించి ప్రచురింటం కనబడుతున్నది. ఉదాహరణకు [[జ్ఞానోదయము]] [[ప్రజామిత్ర]], [[కొరడా]], [[అమృతసందేశము]], [[సమదర్శిని]], [[గ్రంథాలయసర్వస్వము]], [[వసుమతి]], [[ప్రభాతము]], [[మాత్రు భూమి]],[[గ్రామోద్యోగి]],[[సహకారమిత్ర]] [[సమదర్శిని]], [[విజయవాణి]], [[జామీను రైతు]],[[ఆంధ్ర లాజర్నల్]], [[సమాలోచన]] ఇత్యాదులు. ఇంక మద్రాసునుండి ఆతరువాత బెజవాడనుండి ఇంకాతరువాత హైదరాబాదునుండీహైదరాబాదునుండి క్రమ క్రమంగా వచ్చిన అనేకం రోజూవారి, వీక్లీ, పక్ష మాస పత్రికలు శివరావుగారి వ్యాసాలు ప్రచురించని పత్రికంటూ లేదనటం అతిశయేక్తి గదేమో. వారి వ్యాసాల సూచీ చివరలో పత్రికవారి, సంవత్సరం వారిగా సాధ్యమైనంతవరకూ తయారుచేసి చివరలో జతపరచడమైనది.
===శివరావుగారి వద్ద కల అరుదైన పత్రికల ప్రచురణ ప్రతులు, పుస్తకాలు===
"మన మణిమాక్యాలు" అని 1993 ఫిబ్రవరి 15 నాటి ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో డాక్టరు అక్కిరాజు రమాపతిరావుగారు రచించిన వ్యాసములో దిగవల్లి వేంకట శివరావుగారి వద్ద ఎన్నేన్నో అపురూపమైన అరుదైన, అలభ్యైన పత్రికల ప్రచురణలు, పుస్తకాలు వుండేవని వ్రాశారు.1871 లో ప్రారంభిచబడిన ఆంధ్ర భాషాసంజీవని, 1872 లో బందరు నుండి ప్రచురించబ డే పురుషార్ధ ప్రదాయనీ, పురాతన కృష్ణాపత్రిక ప్రచురితమైన వ్యాసముల ప్రతులు, 18- 19 వ శతాబ్ధ ప్రచురితమైన కొన్ని అలభ్యమైన పుస్తకములు 1833 లో ప్రచురించబడ్డ "ఏనుగుల వీరస్వామయ్య గారి కాశీయాత్రచరిత్ర" మొదటి సంకలనము, 1862 లో ప్రచురించ బడ్డ స్వామినీన నరసింహ్మ గారి "హితసూచనీ" పుస్తకము మొదలగు కొన్ని ఉదాహరణంగా చెప్పడమైనది. వారు ఏ విషయమునైన వ్రాశారంటే ములాధారము లేకుండా వుండదు.<ref name= "మన మణి మాక్యాలు">"మన మణి మాక్యాలు" డా అక్కిరాజు రమాపతి రావు ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక ఫిబ్రవరి 15,1993</ref>
పంక్తి 105:
==శివరావరు గారు బెజవాడ బార్ యసోసియేషన్ కి అధ్యక్షుడుగా==
 
1947 లో శివరావుగారు 31-01-1947 న [[బెజవాడ బార్ యసోసిఏషన్]]కు అధ్యక్షునిగా ఎన్నికైయ్యారు. న్యాయవాదిగనూ, ఆ సంస్ధ అధ్యక్షునిగనూ ఆకాలంలో వారు చేసినపని గణనీయము. వారి కృషితో కొన్నిచిరకాల సమశ్యలను పరిష్కారమైఏట్లుగా చేశారు. అప్పటివరకూ న్యాయవాదులకు బార్ రూమ్ లో ఎండాకాలంకూడా మంచినీళ్ళిచ్చే జీతగాణ్ణి పెట్టుకోటానికి ప్రభుత్వఅనుమతి లేకపోటంవల్ల చాల ఇక్కట్టైన పరిస్తి తి వుడేది. వీరి అధ్యక్షతన మద్రాసు హైకోర్టు అనుమతికై ప్రయత్నంచేయటం చిట్టచివరకు లభించటం జరిగింది. ఆ ప్రయత్నానికి జిల్లాకోర్టు జడ్జిగారు ఆట్టే అభిరుచిచూప్పిచలేదు. అప్పటిదాక జిల్లాకోర్టుకుకూడా ఆ వ్యవస్థ వుండేది కాదు. వీరి ప్రయత్నంతో జిల్లాకోర్టువారుకు కూడా లబ్ధి పొందారు. బెజవాడ సివిల్ కోర్టుకు దగ్గరలో నున్న మునిసిపల్ ఉన్నత పాఠశాల బహిరంగ మైదానంలో ఒక మూల మునిసిపల్ పాహిఖానా బహిరంగంగా కుదువబెట్టేవారు (storing of night soil). ఆది ఆ స్కూలు వారికే కాక ఆవేపునుంచి కోర్టుకు వచ్చే ప్రతి వారికి చాల అసహ్యకరమైన భరించరాని దుర్వాసన కలిగేది. కానీ అప్పటిదాకా ఎవ్వరూ ఏమీ చేయగలిగినట్లులేదు. శివరావు గారి అధ్యక్షతన బార్ యసోసియేషన్ వారు ఈ విపరీత పధ్ధతిని అరికట్టడానికి పట్టణ హెల్తాఫీసర్ కి వ్రాయగా వారు అలాంటిదేమీ మునిసిపాలిటీ వారు చేయటంలేదని దబాయింపు జవాబు చెప్పగా శివరావు గారు వదిలే మనిషికానందున వారు మద్రాసులోనున్న డైరెక్టరు ఆప్ పబ్లిక్ హెల్త్ కు వ్రాసి తగుచర్యకై కృషిచేయగా చివరకు ఆ సమస్య తీరింది. [[మునిసిపాలిటీ]] వారు ఆప్రదేశము చుట్టూ గోడ కట్టి తగు లోతుగా గొయ్యలు చేసి మూసి పెట్టివుచటం మొదలగు చర్యలు తీసుకునట వల్ల. బార్ యసోసేఏషన్ లో ఏ విషయానైనా పరిష్కారం కేవలం గవర్నింగ్ కమిటీయే చయాల్సివచ్చేది., దీనికి చాల కాలం వృధాగా వేచియుండాల్సి వచ్చేది. శివరావుగారి అధ్యక్షతన ఒక ఫోరాన్ని ఘటన చేయటం తత్కకాల పరిష్కార నిర్ణయాలను తీసుకుని వాటిని గవర్నింగ్ కమిటీ తదుపరి ఆమోదించేటట్టుగా చేయటం జరిగింది. ఆ కాలంలోనే టంగుటూరి ప్రకాశంగారు విజయడ వచ్చి సుభాష చంద్రబోసు విగ్రహావిష్కరణచేశారు, ఆమీటింగులో కొన్ని వర్గములవారి ఆందోళన వల్ల పోలీసులు జోక్యంచేసుకోటం జరిగింది. ఆసందర్భములో పోలీసులవారు లాఠీ చార్జీ చేశారని ఫిర్యాదుమీద ప్రభుత్వమువారు జిల్లాకలెక్టరుచే విచారణజరిపించారు. ఇరుపక్షములవారి కోరికపైన జిల్లకలెక్టరు శివరావుగారినీ, వారి సహచరుడైన వెంకటప్పయ్యగారినీ విడివిడిగా పిలచి జరిగిన విషయం చెప్పమని కోరారుట. శివరావుగారి సమధర్మనిస్పక్షపాత న్యాయ దృష్టి ఆవిధంగా అందరికీ అవగతిలో నుండేది. ఇంక జడ్జీల ప్రవర్తన వల్ల ఇటు న్యాయవాదులకు, అటు కక్షిదారులకూ గూడా కష్టతరంగా నున్న పరిస్థితులో ధైర్యంగా శివరావుగారు వారితో యదురుబడి సరైన దోవపట్టమని కోరిటం పై అధికారులకు వ్రాయటం మొదలగు చర్యలు: ఒక సారి 1947 లో జేసుదాసన్ అనే ఒక జాయింట్ మేజస్ట్రేట్ గారు కక్షిదారులతోనూ అనభవజ్ఞులైన న్యాయవాదులతో కూడా దురుసుగా వ్యవహరించేవారు. ఆపరిస్థితులో శివరావు గారు జిల్లాజడ్జిగారితో మాట్లాడినపిదర జేసుదాసన్ గారిని బదలీ చేయటం జరిగింది. ఇంకో సారి ఆర్ సి జోషి ఆనే సబ్ కలెక్టరు ఐ సి యస్ గారు తమ కోర్టును వారికనుకూలమైన సమయాలలోను, ఇంటిదగ్గరా సాయంత్రం పోద్దుపోయినా కూడా కోర్టును నిర్వహించటం వల్ల కక్షిదారులుకు న్యాయవాదులకు చాల ఇబ్బంది గలుగతూవుండేది. ఆపరిస్థితుల్లో శివరావుగారు జోషీ గారితో పరిస్థితి చెప్పి వారిని సరిగా నిర్నీత సమయాల్లో కోర్టును నిర్వహించమనికోరగా ఆ జోషీ గారు “నాతో ఇట్లాగ ఎవ్వరూ మాట్లాడలేదు” అన్నారుట అంతట శివరావుగారు “ప్రతిరోజు మీ దగ్గర వారి కి పని వుంటుంది అందుకని మీతోఇలా ఎవ్వరూ మాట్లాడరు, మీదగ్గర నాకే మీ పనిలేదు” అన్నారట . అంతట జోషీగారు తమఇబ్బందులును గూర్చి, బయట రాజకీయనాయకులు వీరి పనిలో జోక్యంచేసుంటు వత్తిడి తేవడంవంటి సాకులు చెప్పగా శవరావు గారు “మీరు చేసేది ఐ సి యస్ సర్వీసు, రాజకీయనాయకులతో ఎట్లా వ్యవహరించేదీ మీకు ఇప్పటికే తెలిసి వుండాలి” అని చెప్పారట. దాంతో జోషీగారు తమ దినచర్యలో మంచి మార్పుతో వ్యవహరించారట. కానీ, జోషీ గారి కష్టాలు వత్తిడిలు దృష్టిలోవుంచుకుని శివరావుగారు 20-07-1948 లో హిందూ పేపరులో లేఖ వ్రాయగా కాంగ్రెస్సు నాయకులు తప్పుపట్టి కొండావెంకటప్పయ్యగారిని పంపించి మాట్లాడించగా శివరావు గారు వారికి జోషీగారు పడే ఇబ్బందుల గురించి చెప్పారుట. ఇంకోసారి గోనేళ్ల కృష్ణ అనే ఫస్ట క్లాస్ మేజస్ట్రేట్ గారు కూడా చాల పొద్దుపోయినాకూడా కోర్టు నడిపిస్తుంటే పలువురు న్యాయవాదులు ఇబ్బంది గురించి శివరావుగారికి చెప్పుకోగా వారు కృష్ణాగారికి వ్రాయగా మేజస్ట్రేటుగారు వారి కోర్టును నిర్ణీత సమయాల్లో నడపటం జరిగింది. మద్రాసు హైకోర్టువారు బెజవాడ బార్ యసోసియేషన్ వారిని కోర్టుకేసుల త్వరిత గతిన విచారించటానికి మార్గాలనుకోరగా బెజవాడలో అప్పట్లో అతి అనుభవజ్ఞుడై రిటైరైపోయు న పెద్ది భొట్ల వీరయ్యగారి అమూల్య సలహలను పంపించటం జరిగింది. . న్యాయవాదిగనే కాక శివరావుగారు బార్ యసోసియేషన్ కు సాహిత్యమైన రూపుగూడా ఇచ్చారు. తిరుపతి దేవస్తానమువారికి వ్రాసి గొప్ప ఆధ్యాత్మకమైన తామ్రశాసనములు, సంస్కృతాంధ్ర గ్రంథాలు తెప్పించి బార్ యసోసియేషన్లో నుంచారు. శివరావు గారి హయములోనే భారతదేశ మొట్టమొదటి స్వాతంత్ర్య దినేత్సవం అతి వైభవంగా గడుపుకోటం జరిగింది. ఆఉత్సవ విందు వైభవాలలో వివధ వుద్యోగస్తులు పెద్దా చిన్నా అని విచక్షణ లేకుండా, అలాగే అన్నివర్గాలవారు, హిందూ, ముస్లిం ఇసాయిల నాయకులు అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులు పాలుపంచుకోటం విశేషణీయమైనది. కాని ఆరోజున జరిగిన వేడుకలో బెజవాడ న్యాయస్దాన సబ్ జడ్జిగానున్న అలీ రజా బైగ్ గారు మాత్రం పాలుపంచుకోకుండా వారి ఛేంబరులోంచి బైయటక్కూడా రాకుండా వుండటం ఒక సంఘటన అని శివరావు గారు వారి జ్ఞాపకాలలో వ్రాసుకున్నారు. భారతదేశ స్వాతంత్ర్యానంతరము కూడా న్యాయ స్థానములోలను ఇతర ప్రభుత్వ కార్యస్తళాలలోనూ ఇంకా ఆంగ్ల రాజుల చిత్రపఠాలు యధా తదంగా వుంచటం చూసి శివరావుగారు హిందూ పత్రికకు 07/08/1947 లేఖ వ్రాయటం జరిగింది. బెజవాడ బార్ యసోసియేషన్ లో న్యాయవాదు ల పేర్ల రిజస్టరును పెట్టి అందులో బెజవాడలో న్యాయవాదులందరినీ మొదటినుండీమొదటినుండి జతచేశారు. శివరావు గారు అధ్యక్షుడుగానున్నకాలంలో జిల్లాజడ్జి పర్యవెక్షణ కై వచ్చినప్పుడు పార్టీలు చేశేవారు కాదు. అది ఆకాలంలో నున్న ఒక జిల్లాజడ్జి కె.వి.యల్ నరసింహంగారు. ఒకసారి బెజవాడ సబ్ జడ్జీలు వెంకటెశ్ అయ్యర్ బి.సి హెచ్ నారాయణ మూర్తిలు జిల్లా జడ్జికి టీ పార్టీ ఇస్తు శివరావుగారిని కూడా ఆహ్వానించారు. ఆపార్టీలో జిల్లాజడ్జి నరసింహంగారు శివరావుగారితో చాలవిషయాలు మాట్లాడారు. డిసెంబరు1947 లో బారయసోసియోషన్ డే జరుపారు. 1951 లో డా కె యల్ రావుగారి సూచన ప్రకారం విజయవాడకు వచ్చిన కృష్ణా రివర్ కమిషన్ ఖోసలా కమిటీకి బెజవాడ బార్ యసోసియోషన్ వారు శివరావుగారి ఆధ్యక్షతన నందికొండ ప్రజక్టు మొదలు పెట్టడానికి సమర్ధనగా ఒక మెమొరాండం సమర్పించారు. శివరావుగారు ప్లీడర్ వృత్తిలో కూడా నీతి నిబంధనలతో పనిచేశేవారు. ఎటువంటి గొప్ప వారి వత్తిడికీ లొంగకుండా తన కక్షిదారుని పట్ల బాధ్యతో చేశేవారు దానికి నిదర్శనాలు చాల ఉన్నాయి. 1960 లో డా టి వి యస్ చలపతి రావు గారు ఆంధ్ర పత్రికపై వేసిన కేసులో ఆంధ్ర పత్రిక తరఫున శివరావుగారు పనిచేస్తున్న సమయంలో, యసెంబ్లీ ఎలక్షన్ల ల సమయం రాగా కాంగ్రెస్ పార్టీవారు కెయల్ రావుగారిని గొట్టిపాడి భ్రహ్మయ్య గారినీ శివరావుగారి దగ్గరకు పంపించి ఆకేసు రాజీకై ప్రయత్నంచేసి చివరకు కోర్టులో చలపతిరావుగారి తరఫునుంచి ఒక రాజీ పెటిషన్ పెట్టి శివరావుగారిని ప్రతివాది తరఫన సంతంకం చేయమనగా వారు తన కక్షిదారు అనుమతిలేదని అభ్యంతరంతెలిపి అలాచేయలేదు. ఆంధ్రపత్రిక అధిపతైన [[శివలంక శంభూ ప్రసాద్]] గారు వప్పుకుంటేగానీ ఎంత వత్తిడి వచ్చినా ఆకేసు రాజీ చేయలేదు.
 
1933 లో శివరావుగారిని ఆంధ్ర కోఆపరెటివ్ ఇన్సుటుట్యూటికి డైరక్టరుగానియమించబడ్డారు. తరువాత 1935 లో కృష్ణా జిల్లా కోఆపరెటివ్ స్టోర్సుకు కార్యదర్శిగాను చెరుకుపల్లి వెంకటప్పయ్య అధ్యక్షుని గాను పనిచేశారు. న్యాయవాదిగా శివరావుగారు కోఆపరెటివ్ సొసైటీ అధ్యక్షుడుగానున్న సింగరాజు సుబ్బారావుగారి తరఫున [[అయ్యంకి వెంకటరమణయ్య]] గారికి ప్రతికూలంగా కూడా పనిచేశారు. శివరావుగారు స్వాతంత్ర్య సమరయోధులైన [[ఘంటసాల సీతారామ శర్మ]], [[ఆచార్య ఎన్ జి రంగా]] గారి తరఫున న్యాయవాదిగా వారి తరఫున కేసులు చేశారు. డా శర్మగారిని ఎన్నికలు కమిషన్ వారు అభ్యంతరాల కేసులో వారి తరఫున వాదన చేశారు. ఎన్ జి రంగాగారు జైలునుండి తన రీసెటల్మెంటు కేసులో 108 సి ఆర్ పి సి క్రింద వచ్చిన కేసులో తన తరఫున పనిచేయమని శివరావుగారిని కోరారు
పంక్తి 202:
* 1977: అక్కిరాజు రమాపతి రావుగారు సమీక్షించారు
* 11/07/1980: [[తిరుమల రామచంద్ర]] గారు ఆంధ్రపత్రిక సచిత్రవార పత్రికలో * 1981 లో మాలతీ చందూర్ గారు ఏనుగల వీరస్వామయ్య గారి కాశీయాత్ర చెరిత్ర సమీక్షించారు స్వాతి అనే పత్రికలో * 26/01/1986: న్యూస్ టైమ్సు పత్రిక శివరావుగారి పుస్తకము వీరేశలింగం వెలుగు నీడలను ఆంధ్రప్రభ సంపాదకుడు [[పొత్తూరు వెంకటేశ్వర రావు]]గారు సమీక్షించారు
శివరావు గారి పుస్తకములన్నిటిలో వారి కథలు గాథలు ( 1,2,3,4 భాగములు) చాల సార్లు పునర్ముద్రించబడి చాలమంది చే సమీక్షింపబడినది 1941 నుండీనుండి అనేక ప్రముఖ రచియతలు కళాకారులు విద్యావేత్తలు సమీక్షించారు. ఆ పుస్తమును శివరావుగారి పెద్ద కుమారుడు కీర్తి శేషులు వెంకటరత్నంగారు 2010 లో విశాలాంద్ర వారిచే పునః ముద్రింపిచారు. ఈ 2010 సంకలనం చాల జనప్రియమైన పుస్తకం. పుస్తకం డాట్ నెట్ అను వెబ్ పత్రికలో 2011 జూన్ నెలలో అమెరికా షికాగో వైద్యకళాశాలలో సైకియట్రీ ప్రోఫెస్సర్ గానున్న డా జంపాల చౌదరి గారు ఆన్ లైన్ పత్రికలో సమీక్షించారు. చిన్న వయస్సులో నే నార్తు అమెరికా తెలుగు యసోసిఏషన్ (TANA =TELUGU ASSOCIATION OF NORTH AMERICA) కు ప్రసిడెంటైన చౌదరిగారు వైద్య నిపుణేలాగాక సాహిత్యభిలాషులవటం తెలుగువారికి గర్వకారణం
 
==శివరావు గారు 1922 నుండీ స్వతంత్ర పోరాట ఉద్యమాల జ్ఞాపకాల వాగ్మూలం రికార్డింగు==
 
12/11/1974 తేదీన Dr. పి సత్యనారాయణ రావు, డైరెక్టరు, రీజనల్ సెక్రటరీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సు రీశర్చి ఉస్మానియాయూనివర్సటీ కాంపస్ నుండి వచ్చి శివరావు గారి అనుభావలు జ్ఞాపకాల మీద ప్రశ్నావళికి జవాబులు ఆడియో రికార్డ చేశారు. తరువాత మళ్ళీ 26/02/1979 తారీఖన ప్రొఫెస్సర్ సరోజినీ రెగాణి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంవారి స్వతంత్రపోరాటలలో హూ ఈజ్ హూ (who is who of freedom during freedom fighting) అను ప్రాణాలిక కోసం ఒక ప్రత్యేక సిబ్బందిని శివరావు గారి వద్దకు పంపిచారు. కానీ శివరావుగారు తాము స్వతంత్ర సమరయోధుడిని కానని జైలు కెళ్ల లేదని, న్యాయవాది వృత్తి లోనే స్వతంత్రవుద్యమాలలోపాలు పంచుకున్నాని చెప్పి తనవాగ్మూలం రికార్డు ఇవ్వటానికి వప్పు కోలేదు. కానీ సరోజనీ రేగాణి గారు మరల సిబ్బందిని పంపిచి ప్రభుత్వ ప్రణాళిక ఉద్యమంలో పాలు పంచుకున్న హూ ఈజ్ హూ అని బహు ఓరిమితో శివరావుగారిని వప్పించి వారి జ్ఞాపకాలు అనుభావుల వాగ్మూలం 1922 నుండీనుండి స్వతంత్రం వచ్చేవరకూ జరిగిన అనే క కార్య కలాపాలు గురించి ఆడియో క్లిప్ రికార్డు చేశారు ప్రభుత్వము వారే కాకుండా వ్యక్తి గతంగా వచ్చి శివరావుగారి వాక్మూలం 18/07/1986 న రికార్డు చేసిన వారిలో త్రిపురనేని వెంకటేశ్వరావు గారు, నర్రా కోట.య్య గారు ఆగస్టు 1980 లో ఇండియన్ ఎక్సప్రెస్సు పత్రిక ఉప సంపాదకుడు నీలంరాజు మురళీధర్ వారి స్టాఫ్ ఫొటోగ్రఫర్ ను తీసుకుచ్చి శివరావుగారి ఛాయా చిత్రము తీసి ఆ పత్రిక వారి ఆర్కైవ్సులో వుంచారు.
 
==సన్మానాలు, సత్కారాలు==
పంక్తి 248:
 
==85 ఏండ్లపైబడినతరువాత చేసిన సాహిత్య కృషి==
ఆయన 1990 వరకు చురుకుగా 85 యేండ్లు దాటిన పిమ్మట కూడా యధావిధిగా చదువుతూ వ్రాసుకుంటూ వుండి సాహిత్యకృషి చేశారు. ఆయన 1985 నుండీనుండి 1990 మద్యకాలంలో వ్రాసిన 55 వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. వాటిలో 32 వ్యాసాలు [[రాజమండ్రి]] నుంచి ప్రచురింపబడే "సమాలోచన" పత్రికలోనూ, 3 వ్యాసాలు నెల్లూరు నుండి ప్రచురించబడే "జామీను రైతు" పత్రికలోనూ, 8 వ్యాసాలు "ఉదయం" పత్రికలోనూ, 10 వ్యాసాలు "ఆంధ్రప్రభ" దినపత్రికలోనూ మరియు 2 వ్యాసాలు "ఆంధ్రప్రభ" వారపత్రికలోనూ ప్రచురించారు. [[ఏప్రిల్ 25]] [[1983]] న ఆయన అప్పటి [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] ముఖ్యమంత్రి అయిన [[నందమూరి తారక రామారావు|నందమూరి తారకరామారావు]] గారికి [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] పరిపాలనలో దిగజారిన సాహిత్య పోషన గూర్చి బహిరంగ లేఖ వ్రాసారు.
 
అక్టోబరు 1981 లో ప్రముఖ రచయిత డా.ఎన్ గోపి గారు తమ రచనలను శివరావు గారికి బహుకరించారు. డా గోపి గారు 1988 లో వారు రచించిన పుస్తకం ఒక దానిని శివరావుగారికి అంకితం చేశారు. నవంబరు 1981 లో ప్రముఖ రచయిత ఆరుద్ర శివరావుగారిని సాహిత్య గోష్ఠి జరిపారు. [[మే 4]] [[1983]] న కావలి జవహర్ భారతి సంస్ద అధిపతి ఎం.పి.ఆర్.రెడ్డి గారు శివరావుగారి బహిరంగ లేఖని అభినందిస్తూ వ్రాశారు. [[ఫిబ్రవరి 26]] [[1983]] న కాట్రగడ్డ మధుసూదనరావు గారు తమ మిత్రులు మాజీ మంత్రితో కలసి వారు తలపెట్టిన "కృష్ణాజిల్లా కాంగ్రెస్సు చరిత్ర"కు సలహా నివ్వమని శివరావుగారిని కోరారు. అటుతరువాత డిశంబరు లో ఆ పుస్తకము విడదలవటం చూసిన శివరావుగారు విచారం వ్యక్తంచేశారు.