దిగవల్లి వేంకటశివరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నుండీ → నుండి (15) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
| weight =
}}
'''దిగవల్లి వేంకట శివరావు''' ([[ఫిబ్రవరి 14]], [[1898]] - [[అక్టోబరు 3]], [[1992]]) చరిత్ర పరిశోధకులు, [[రచయిత]], [[న్యాయవాది]], [[స్వాతంత్ర్య సమరయోధుడు]]. ఆయన అనేక చారిత్రికాంశాలను పరిశోధించి పుస్తకాలు రచించారు.
==జీవిత విశేషాలు==
దిగవల్లి వేంకటశివరావు గారు [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[తూర్పుగోదావరి జిల్లా]] [[కాకినాడ]]లో [[ఫిబ్రవరి 14]] [[1898]] న వెంకటరత్నం, సూర్యమాణిక్యాంబ దంపతులకు జన్మించారు. శివరావుగారు [[కాలికట్]]లో ఫస్టు ఫారం చదువుతూవుండగా వారి బావగారికి బదలీ కావడంవల్ల ఫస్టు ఫారం [[బెంగళూరు]]లో తిరిగి చదవటం ప్రారంభించారు. కాని మళ్ళీ బదిలీ అవుటవల్ల 1910 లో రాజమండ్రీ[[రాజమండ్రి]] వచ్చేసి అక్కడ మళ్లీ ఫస్టు ఫారం చేరి అక్కడనుండి నుండి ఎస్.ఎస్.ఎల్.సి దాకా వీరెశలింగం స్కూలులో చదివారు. 1916 లో [[మద్రాసు]] ప్రసిడెన్సీ కళాశాలలో [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]], బి.ఎ ( 1918 -1920) తరువాత న్యాయ కళాశాలలో బి.యల్ ( 1920-1922) [[మద్రాసు]] లోనే పూర్తిచేసి 1922 నుండి [[విజయవాడ]]లో ప్రముఖ [[న్యాయవాది]]గా ప్రసిధ్ధి చెందారు. వారు న్యాయశాస్త్ర చదువులో జేరేటప్పటికే గాంధీగారు నిరాకరణోద్యమం మొదలైయుండుటయూ దేశ స్వాతంత్ర్య యోధన వారి మనస్సులో బలమైన ఆందోళన కలుగజేసినట్లునూ అతికష్టముమీద వారు న్యాయశాస్త్ర చదువు బి.యల్ పూర్తిచేయట జరిగినట్లు వారు 1966 లో తనకు జరిగిన సన్మాన సభలో చెప్పారు.
 
== వ్యక్తిగత జీవితం ==
ఆయన తల్లిగారు [[ద్రాక్షారామం]] వాస్తవ్యులు ఆలమూరు సూరయ్య గారి కుమార్తె. శివరావుగారి సతీమణి [[విశాఖపట్టణం]]కు వాస్తవ్యులు బుధ్ధిరాజు మూర్తిరాజు గారి కుమార్తె కమల. శివరావుగారు వృత్తిరీత్యా 1922 నుండి [[విజయవాడ]]లో ప్రఖ్యాత [[న్యాయవాది]]. అంతేకాక వారు చరిత్ర పరిశోధకుడుగా గ్రంథ కర్తగా ప్రసిధ్ధి.<ref>The National Biography of Indian Literature 1901-1953 సాహిత్య ఎకాడమీ, కొత్తఢిల్లీ, వాల్యూం 4, పేజీలు 251,416,417,419</ref><ref>నా జీవితగాధ-నవ్యాంధ్రము (1959) అయ్యదేవర కాళేశ్వరరావు పేజీ155-159</ref>,<ref>మిత్రులు నేను [[గొర్రెపాటి వెంకట సుబ్బయ్య]] (1970) పేజీ 186-193</ref>, గాంధీ వాది. [[మహాత్మా గాంధీ|గాంధీ]] ప్రవేశపెట్టిన అనే క సత్యాగ్రహ ఉద్యమములో వారి సేవ విశేషమైనది.<ref>[[ఆంధ్రజ్యోతి]] అక్టోబరు10,1966 "నేనెరిగిన శివరావుగారు" [[కాకాని వెంకటరత్నం]]</ref>. జైలుకు వెళ్ళటానికి ఏరోజుకారోజు సంసిధులైయ్యుండికూడా [[బ్రిటిష్]] ప్రభుత్వచేసే అన్యాయమును ప్రజలకు కాంగ్రెస్సు కార్యకర్తలకు తెలిసేటట్టు ఉదృతముగా ఆనేక రచనలు కాంగ్రెస్సువాదిగను వ్యక్తిగతముగను చేశారు. నిశతమైన [[న్యాయవాది]]గా వృత్తి రీత్యా వారు ప్రముఖులైనప్పటికి నీ వారు కేవలం వృత్తికే అంకితం అయి ధన సంపాదనే లక్ష్యం చేసు కోలేదు. విద్యార్థిగా చదువుకుంటున్న రోజలనుంచే దేశ చరిత్ర, స్వతంత్ర ఉద్యమాలకు తోట్పడుటకు దోహదం మైన వారి ఉపాధ్యాయుల ప్రసంగాలు, రచనలు, వారి పై ప్రభావం చూపటంవల్లం వారు వృత్తిలో ప్రవేశిస్తూనే ఆకాలంనాటి కాంగ్రెస్సు రాజకీయల్లో పాలుపంచుకుంటూ ఇంకో ప్రక్క ఏమాత్రం సమయం వృధాచేయకుండా వారు సాహిత్యకృషిలో మునిగి తేలుతూ వుండేవారు. చరిత్రకు సంబంధించి ఇంకా వెలుగు చూడని క్రొత్త విషయాలు చదవాలి వ్రాయాలి అనేది ఆయనకు లక్ష్యంగా వుండేది. అనేక పుస్తాకాలు చదివి చారిత్రాత్మకమైన అనే క అపురూపమైన వ్యాసములు, పుస్తకములు వ్రాశారు.<ref>" ప్రామాణిక చరిత్రకారులు ",అక్కిరాజు రమాపతి రావు ఆంధ్ర ప్రభ ఫిబ్రవరి 15,1988</ref> వారు నీతి నిజాయితీకి మరోపేరు.<ref>ఆంధ్రపత్రిక నవంబరు 9, 1986 "ద్రిషణా ధురంధరుడు" ప్రకాశచంద్ర శతపధి</ref> [[అవినీతి]] ఆటగోడుతనంసహించేవారు కాదు. కల్లాకపటం వారి దరిదాపుల్లోకి రావటానికి సాహచించేవికావు. 1930–1947 మధ్యకాలంలో గాంధీ గారి స్వాతంత్ర్యోద్యమం పిలుపులో వారు [[సాహిత్యం|సాహిత్య]], [[రాజకీయాలు|రాజకీయ]], [[న్యాయవాది|న్యాయవాద]] పరిజ్ఞానంతో చేసిన కృషి అపారం. [[ఉపన్యాసాలు]] ఇవ్వటం ఉపన్యాసాలకి వెళ్ళ టం వారు అరుదుగా చేశేవారు. [[స్వాతంత్ర్య సమరయోధులు]]<nowiki/>గా ఎటువంటి గౌరవాలు సన్మానాలు స్వీకరించేవారు కాదు. తను వృత్తిరీత్య న్యాయవాదినని, జైలుకు పోలేదని కారణాలు చెప్పి నిరాకరించేవారు. వినపట్టం కొంచంగా తక్కువ కావటంతోనే 1965 లోనే కోర్టుకు వెళ్లడం మానేశారు. అప్పటికి వారికి చాల పెద్ద పెద్ద కేసులు విచారణకుండేవి. ఆత్మగౌరవం వారికి సంధిపడరాని విషయం. కోర్టు మానేసినప్పటికీ వారి సలహాకోసం కక్షిదారులు వస్తూవుండేవారు. అలాగ వారు న్యాయ సలహాలు ఇస్తూ 1980 దాకా [[విజయవాడ]]లోనే వుండేవారు. వారి సతీమణి కమల 1978 లో పరమదించారు. 1980 లో 83 ఏండ్లు పైబడ్డ తరువారు శివరావుగారు హైదరాబాదులో[[హైదరాబాదు]]<nowiki/>లో వారి కుమార్ల వద్ద వుండేవారు. వారు [[సాహిత్యం|సాహిత్య]] కృషి మాత్రం మానకుండా జీవితాంతం చదవుతూ వ్రాస్తూ వుండి చివరకు 95 పైబడినతరువాత 03-10-1992 న [[భోపాల్]] నగరంలో “a narrative of the campaign in India which terminated the war with Tippusultan in 1792” అనే పుస్తకం చదువూతూనే వారి కుమారుని వద్ద చివరి శ్వాస వదిలారు. వారి సాహిత్య కృషే వారి జీవిత చరిత్రలో చాల పెద్ద పర్వం. వారు దాదాపుగా 40 పుస్తాకాలు, 400 వ్యాసాలు వాశారు. వారు వ్రాసిన [[వ్యాసాలు]] అనేక పత్రికల్లో ప్రకటితమయ్యేవి అనేక చారిత్రక విషయములు ఎక్కడెక్కడనుంచో త్రవ్వి బహువిధ కృషితో వాటిని తెలుగువారి కోసం సరళమైన తెలుగులో మంచి శైలిలో వెలుగులోకి తీసుకుచ్చారు. శివరావు గారు తన సమకాలికులు, మిత్రుల కంటే దీర్ఘ కాలం జీవించారు వారిజ్ఞాపక శక్తి అపారం. కచ్చితమైన తారీఖులు పేర్లు సంఖ్యలు వారికి కొట్టిన పిండి. వారి చేతివ్రేళ్ళమీద వుండేవి. కట్టల కట్టలుగా వ్రాసుకునియన్న నోట్సుల్లోంచి ఏ విషయంపైన కావలసినా చాల సునాయాసంగా బయటకు తీయగలిగేవారు. మొదటినుంచీ పుస్తకం చదువుతు న్నప్పుడే నోట్సు వ్రాసుకోటం వారికి చిరకాలపు అలవాటు. ఆ విధంగా వారు చరిత్ర పరిశోధన చేసి వ్రాసిపెట్టుకున్నఅనేక నోట్సుల కట్టలు చాలవిలువైన ఖజానాలాంటివి చరిత్రపరిశోధకులకు చాల ఉపయోగ పడగలవి ఇంకా ఉన్నాయి. వారి అముద్రిత గ్రంథములు, వ్యాసములు కూడా చాలవున్నవి. ముఖ్యంగా [[కథలు]] గాథలు 5 మరియ 6 భాగములు చాల విలువైనవి. వెంటనే ముద్రింప తగినవి. వారు చేసిన సాహిత్యకృషి వారి పుస్తకాలు వ్యాసాలు చెప్ప గలవు. న్యాయవాది వృత్తి, సాహిత్య కృషి, స్వాతంత్ర్యోద్యమములో [[కారాగారము|జైలు]]<nowiki/>కి వెళ్ళటం అనివార్యమైన స్థితిలో కూడా వారు వివిధరకాలుగా చేసిన కృషి విషేంచి చెప్పదగినవి. వాటిల్లో కొన్ని క్లుప్తంగా
# [[ఆంధ్ర]] [[మద్రాసు]] ప్రావిన్సల పై విపులమైన సమాచారము [[గాంధీ]]గారి హయామ్ లో కాంగ్రెసు అధిష్ఠానానికి పంపిచారు
# స్వాతంత్ర్యోద్యమములో [[కాంగ్రెసు]] కార్యకర్తలకు బోధపడేటట్లు కీలక రాజకీయ విషయములు, ప్రజాప్రభుత్వ విధానములు, బ్రిటిషవారు మనదేశంలో చేస్తున్నపక్షపాతపు పరిపాలన, వారు మనప్రజలను మన దేశ నిధులను ఏవిధంగా దోచుకుంటున్నదీ మొదలగు విషయముల గురించి అనేక కరపత్రములు వ్రాశారు
పంక్తి 60:
==వంశ చరిత్ర : పుట్టుపూర్వోత్తరాలు==
 
[[దిగవల్లి]] అనే గ్రామం [[కృష్ణాజల్లా]]లో [[నూజివీడు]] తాలూకా లోనున్నది. శివరావు గారి [[పితామహుడు]] [[దిగవల్లి తిమ్మరాజు]] గారి పూర్వులు దిగవల్లి దగ్గిర కొయ్యూరు గ్రామంలో వుండి, బొమ్మలూరు రమణక్కపేటలో భూములు కలిగనవారు. వారి వంశీయులు సంప్రతీ కరణాలు. అంటే చుట్టుప్రక్కల గ్రామ కరణ సమూహమునకు పెద్ద కరణంగా మిరాస్మీ అనే హక్కు కలిగి గ్రామంలో జరిగే కార్యకలాపై లావజ్మల్ అనబడే ఫీజు వసూలు చేసుకునే హక్కు గల కరణాలు. తిమ్మారాజు గారి జీవిత కాలం 1794 - 1856. వారు చిన్ననాటనే 1807 సంవత్సర ప్రాంతంల్లో [[కొయ్యూరు]] గ్రామం వదలి [[ఏలూరు]] లోకొంతకాలం వుండి [[ఇంగ్లీషు]], [[పార్సీ]] భాషలు చదువుకుని అక్కడనుండి ఉద్యోగాన్వేషణలో [[రాజమండ్రీ]]కి చేరి [[ఇంగ్లీషు]] వారి [[ఈస్టుఇండియా]] కంపెనీ ప్రభుత్వంలో మొట్టమొదలుగా 1811 లో రాజమండ్రి డిస్ట్రి క్టు కోర్టులో ‘ఇంగ్లీషు రికార్డు కీపర్’కు అసిస్టెంటుగా ప్రవేశించి తరువాత 1820 లో [[కాకినాడ]]లో [[కలెక్టరు]] కార్యాలయంలో ఇంగ్లీషు రికార్డు కీపర్ గా చేశారు. ఆ తరువాత పిఠాపురంలో[[పిఠాపురం]]<nowiki/>లో శిరస్తదారుగా నియమింపబడ్డారు. వారికి కలేక్టరు రాబర్టసన్ గారు 1922 లో నివాసగృహ నిమిత్తము 8640 చదరవు గజములస్తళమును కాకినాడలో రాబర్టసన్ పేటలో ఇచ్చినట్లు గోదావరి జిల్లా రికార్డులలో ఉంది. ఆస్దలములో తిమ్మారాజుగారు రెండుమండువాల పెద్ద ఇంటిని నిర్మిచుకన్నారు. తిమ్మరాజుగారు 1828 లో [[కాకినాడ]]<nowiki/>లో శ్రీ భీమేశ్వరాలయ గోపురం, 1931 లో ఆ గుడి పూర్తిగా కట్టించి నట్టుగా ఆ గుడిలోని [[శిలాశాసనం]] వల్ల తెలుస్తున్నది.
1850 లో తిమ్మరాజు గారు కంపెనీ ప్రభుత్వంలో హూజూర్ సిరస్తాదారుగా నెలకి రూ 250 జీతంపై పనిచేస్తున్నారు. వారు చేసిన పెద్ద ఉద్యోగాల కారణంగా రాజమండ్రీ జిల్లా (తదుపరి గోదావరి జిల్లా) లో ప్రభుత్వపు రికార్డులలో తిమ్మరాజుగారిని గూర్చిన రికార్టు వుంది [[పిఠాపురం]] జమీందారైన రావుసూర్యారావు గారు 1850 లో చనిపోగా తిమ్మరాజుగారిని కంపెనీ ప్రభుత్వం వారు పిఠాపురం సంస్థానంకి కోర్ట్ ఆఫ్ వార్డ్సు (Court of Wards) మేనేజరుగా నియమించారు. ఆవిధంగా వారు 1850 లో రెండు ఉద్యాగాలు నిర్వహించారు . 1834 లోవారు జొన్నలగడ్డ కొండయ్య కొత్తపల్లి అమల్దార్ల అన్యాక్రాంత లావాదేవిల వ్యవహారంలో తిమ్మరాజు గారు విచారణ జిరిపి కలెక్టరుకు పంపిన రిపోర్టు (అప్పటి రాజమండ్రీ జిల్లా )గోదావరి జల్లా రికార్డులో చేర్చబడి యున్నది.<ref>Godavari District Record Volum4484/19-23 Letterof District Collector to the Board of Revenue , page 345 Report of Colector Mr.Crawley Proceedings of the Board of Revenue dated 26/09/1835 Volune4660/703</ref>. [[ధవళేశ్వరం]] ఆనకట్ట కట్టే రోజుల్లో తిమ్మరాజు గారి పనిలో లోపం కలిగనదని ఆనకట్ట నిర్మాణ కమీషనర్ వారికి ఒక అణా జుల్మానా విధించగా తిమ్మారాజు గారి అపీలుపై [[జిల్లా కలెక్టరు కార్యాలయం|జిల్లా కలెక్టరు]] విచారణ జరిపించి వారు నిజాయతి పరులని, తెలుసుకుని జుల్మానా రద్దు చేసినట్లుగా జిల్లా రికార్డులో వున్న సంగతి శివరావు గారు బయటకు తీసి వారి కథలు గాథలు పుస్తకంలో వ్రాశారు.<ref>కధలు గాధలు (2010)1 వ భాగం దిగనల్లి వేంకట శివరావు పేజీ9-18</ref>. తిమ్మరాజుగారి పనిచేసిన పదవులు కీలకమగుట వల్ల గోదావరి జల్లా రికార్డులలో వారి ద్వారా జరిగిన ప్రభుత్వ వ్యవహారాలలో వారి గురించి ప్రత్యక్షాధారాలు కనబడ తాయని శివరావు గారు [[చరిత్ర]]<nowiki/>పరిశోధనా దృష్టితో రికార్డులన్నీ వెదకి వారి తాతగారికి సంబంధించిన అనేక సంఘటనలు సేకరించి వారి దైనిక చర్యలు, వారి కాలం నాటి విషయాలెన్నో డైరీలో వ్రాశారు. తిమ్మరాజుగారు 1856 లో మరణించారు. తిమ్మరాజుగారు 1811 ఉద్యోగంలో చేరేనాటికి కాకినాడ, రాజమండ్రీ, మొగలుతుర్రు డివజన్సు కలిపి [[మచిలీపట్టణం]] కలెక్టరు క్రింద వుడేవి. [[గోదావరి జిల్లా]] అనేది లేదు. 1820 లో [[రాజమండ్రీ]] జిల్లా అనేది వచ్చింది. ఆజిల్లా కలెక్టరు ప్రధాన కార్యాలయాలు కాకినాడలోనుండేవి. ఆసంవత్సరంనుండే వారిని జిల్లాకలెక్టరు కార్యాలయంలో ఇంగ్లీషు రికార్టు కీపరుగా నియమించారు.
 
దిగవల్లి తిమ్మరాజు గారి పెద్ద కుమారు వెంకట శివరావుగారు (1829- 1890) మన శివరావుగారికి పెద తండ్రి. వారు పిఠాపురం దివాన్ గా చేశారు. రెండవ కుమారుడు వెంకటరత్నంగారు (1850 -1908) మన శివరావుగారి తండ్రి. వారు తహసిల్దార్ గా గోదావరి జల్లాలో అనేక చోట్ల పనిచేసి కొవ్వూరులో సబ్ మేజస్ట్రేటుగా 1905 లో రిటైరైనారు. వారి రెండవ భార్య సంతానం మన శివరావుగారు, వారి అక్కగారు సీతాబాయమ్మగారు (బొడ్డపాటి పూర్ణయ్యగారి భార్య ). శివరావు గారి తండ్రి మొదటి భార్యసంతానం ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు. శివరావు గారు 14/02/1898 తేదీన కాకినాడలో వారి స్వగృహమందు జన్మిచారు. తండ్రి గారు తన ఆదాయమునకు మించి న ఖర్చులతో ఆనేక సంతర్పణలు, సమారాధనలు, దేవకళ్యాణాలు, దాన ధర్మాలు, బ్రాహ్మణ సత్కరణలతో క్రమ క్రమంగా ఆస్తినంత తాకట్టు పెట్టి అప్పుల పాలై 1908 లో పరమదించారు. అప్పటికి శివరావుగారు 10 ఏండ్ల ప్రాయం. ఆప్పటిదాక శివరావు గారికి విద్యాభ్యాసమే లేదు. శివరావు గారి సవతి అన్నగారు వీరి కన్నా 25 ఏండ్లు పెద్ద ( వారు [[ఉయ్యూరు]] జమీందారుకు 1918-1922 మధ్య దివాన్ గా చేశారు ) . కాని దురద్రుష్టవశాత్తూ అన్నగారికి వారు తమ్ముడైన శవరావుగారి మీద అప్పట్లో దయ కలుగలేదు. అందువల్ల ఏడాదిక్రితమే పెళ్ళి అయిన అక్కగారి పెనిమిటి క్యాలికట్లో టెలిగ్రాఫి మాస్టరుగా నున్న బొడ్డపాటి పూర్ణయ్యగారు శివరావుగారిని వారి తల్లినీ ఆదరించి క్యాలికట్ ([[కేరళ]] రాష్ట్రం ) తీసుకుని వెళ్ళారు.