కె.మాలతి: కూర్పుల మధ్య తేడాలు

మొలక స్థాయి దాటిన వ్యాసం - మూస తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Malathi.jpg |right|thumb| [[ఆంధ్రపత్రిక]] ముఖచిత్రంగా కె.మాలతి]]
[[దస్త్రం:NTR and Malathi in Pathala bhairavi 1951.jpg|right|thumb|[[పాతాళ భైరవి]] చిత్రంలో [[ఎన్.టి.రామారావు]] సరసన కె.మాలతి]]
'''కె.మాలతి''' తెలుగు చలనచిత్ర నటీమణి, గాయని.'''కె.మాలతి''' 1926లో ఏలూరులో జన్మించింది.
<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=111|edition=కళా ప్రింటర్స్|accessdate=28 July 2017}}</ref>
 
మాలతి నటించిన తొలి చిత్రం [[భక్త పోతన (1942 సినిమా)|భక్త పోతన]] ఈమెకు మంచి పేరు తెచ్చింది. అందులో శ్రీనాథుని కూతురిగా నటించింది. [[పాతాళ భైరవి]] చిత్రంలో ఇందుమతి పాత్ర ఈమె నటించిన పెద్ద పాత్రలలో ప్రముఖమైనది. ఆమె మంచి గాయని కూడా, అప్పట్లో నటులందరూ తమకు తామే పాటలు పాడుకునేవారు. గాయనిగా ఆమె చివరి చిత్రం వాహినీ వారి[[గుణసుందరి కథ]](1949), అందులో [[శాంతకుమారి]]తో కలిసి ''కలకలా ఆ కోకిలేమో పలుకరించే వింటివా'', ''చల్లని దొరవేలే చందమామ'' పాటలు పాడింది. 1951లో విజయా వారి [[పాతాళ భైరవి]]లో ఆమెకు [[పి.లీల]] పాటలు పాడింది, ఆ పాటలన్నీ చాలా ప్రసిద్ధి పొందాయి. తర్వాత [[కాళహస్తి మహత్యం]] (1954)లో కన్నడ కంఠీరవ [[రాజ్‌కుమార్]]తో నటించింది. బహుశా నాయికగా అదే ఆమెకు చివరి చిత్రం. తరువాత సహాయనటిగా కొన్ని చిత్రాలలో నటించింది. ఈవిడ నటించిన చివరి చిత్రం [[ఎన్.టి.రామారావు]] తీసిన [[శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం]].
"https://te.wikipedia.org/wiki/కె.మాలతి" నుండి వెలికితీశారు