ప్రధాన వ్యాసం [[నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ]] చూడగలరు. <br />
<small>పై ప్రకటనకు లోబడి [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం [[ప్రపంచబ్యాంకు|ప్రపంచ బ్యాంక్]] ఋణంతో ''ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృధ్ది'' పేరుతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులను చేపట్టింది. 2010, [[ఆగస్టు 14వ14]]వ తేదిన ప్రపంచ బ్యాంక్ తో దీనిపై ఒప్పందం కుదిరింది. 10.9.2010 నుండి ఈ పథకం అమలు లోకి వచ్చింది. ఈ పధక కాల పరిమితి ఆరు సంవత్సరాలు. ఈ పథకం 31.7.2016 తో ముగుస్తుంది. ఒప్పందం జరిగేలోగా, చర్చలు కొనసాగుతుండగానే ప్రభుత్వం ఆధునీకరణపనులను ప్రారంభించింది. ఈ పథకం అంచనా వ్యయం రూ.4444.41 కోట్లు. ఇందులో 48 శాతం ప్రపంచ బ్యాంక్ ఋణం. రాష్ట్రప్రభుత్వ్తం వాటా 52 శాతం. ఒప్పందానికి సంవత్సరం ముందునుండి నిబంధనలకు లోబడి జరిగిన వ్యయంలో ప్రపంచ బ్యాంకు ఋుణం వాటా రిట్రోఏక్టివ్ ఫడింగ్ ద్వారా చెల్లిస్తుంది</small>.<br />