కోట సామ్రాజ్యము: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19:
}}
[[File:Relief of Gandaberunda bird (two headed) in the Rameshwara temple at Keladi.jpg|thumb|right|upright|గండభేరుండం]]
చాళుక్య, చోళ సామ్రాజ్యాలు అస్తమించిన తర్వాత [[కాకతీయ సామ్రాజ్యం]] స్థాపించబడువరకూ గడచిన మధ్య కాలంలో సామంతరాజులు స్వతంత్రులైయ్యారు. అట్టి వారిలో కోట వంశీయులు ఒకరు. వీరు ధరణికోటను రాజధానిగా చేసుకొని [[ద్రాక్షారామం]] (తూర్పుగోదావరి జిల్లా), [[త్రిపురాంతకం]] (ప్రకాశం జిల్లా), [[తాడికొండ]] (గుంటూరు జిల్లా), [[యనమదల]] (తూర్పు గోదావరి జిల్లా), నటవాడి (నెల్లూరు జిల్లా) ప్రాంతాలను 12వ శతాబ్దం నుండి సుమారు 400 సంవత్సరాల పాటు పాలించారు. వీరు చంద్రవంశంలో ధనుంజయ గోత్రానికి చెందినవారు <ref name="ReferenceA">[[శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము]] - బుద్దరాజు వరహాలరాజు, 1970</ref><ref>హిస్టరీ ఆఫ్ ఆంధ్రా కంట్రీ (క్రీస్తు శకం 1000 - 1500) - శ్రీమతి యశోదా దేవి</ref>. కోట సామ్రాజ్యాన్ని తూర్పుచాళుక్య వంశస్థుడైన హరిసీమ [[కృష్ణుడు]] స్థాపించాడు<ref name="ReferenceA"/>.
 
==విశేషాలు==
కోట రాజులు మొదట్లో [[జైన మతము|జైన]] మతాన్ని ఆచరించినా తర్వాత కాలంలో చాళుక్యుల వలె [[హిందూమతము|హిందూ]] మతాన్ని కూడా ఆచరించారు. [[శైవము|శైవ]] తత్వాన్ని కూడా ప్రోత్సహించారు. వీరికి తూర్పు చాళుక్యులతోను, సూర్యవంశీయులైన కాకతీయులతోను [[వివాహం (పెళ్లి)|వివాహ]] సంబంధాలుండేవి. కాకతీయ [[గణపతి దేవునిదేవుడు|గణపతి దేవు]]<nowiki/>ని రెండవ కుమార్తె అయిన గణపాంబను కోట బేతరాజు వివాహమాడాడు. మంగళగిరి ఆనంద కవి వ్రాసిన 'విజయనందన విలాసము' లో హరిసీమ కృష్ణుడు చంద్రవంశానికి చెందినవాడని వ్రాయబడినది <ref name="ReferenceB">విజయనందన విలాసము - రచన: మంగళగిరి ఆనందకవి, ముద్రణ: 1919, రామవిలాస ముద్రాక్షర శాల, చిత్రాడ</ref>. క్రీస్తు శకము 1182 ప్రాంతంలో జరిగిన [[పల్నాటి యుద్ధంలోయుద్ధం]]<nowiki/>లో నలగామరాజుకు సహాయం చేయడానికి [[కాకతీయులు|కాకతీయ]] రుద్రదేవరాజు కొంత సైన్యాన్ని పంపాడు. ఈ సైన్యం [[ధరణికోట]]<nowiki/>ను ముట్టడించి జయించింది. కోట దొడ్డభీమరాజు మరణించాడు. ఆనాటి నుండి కోట వంశీయులు కాకతీయులకు[[కాకతీయులు|కాకతీయుల]]<nowiki/>కు సామంతులయ్యారు. 1323 వ సంవత్సరంలో మహమ్మదీయుడైన ఉయిన్ ఖాన్ కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మూలించాడు. ఆ సందర్భంలో [[కోట వంశం]] కూడా రాజ్యం కోల్పోయింది. ఈ వంశం వారు చెదిరిపోయి [[దాట్ల]], [[పాకలపాడు]], [[చింతలపాడు (పెదబయలు మండలం)|చింతలపాడు]], [[జంపన]] వంటి గ్రామాలకు వెళ్ళిపోయారు <ref>[[శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము]] - బుద్ధరాజు వరహాలరాజు, 1970</ref>.
 
కోట సామ్రాజ్యాన్ని పాలించిన రాజులు:
పంక్తి 43:
''స్వస్తి సమస్త పంచ మహా శబ్ద మహామండలేశ్వర| రాజ పరమేశ్వర| ఈశ్వర పదవీ విరాజమాన| విజయవినోద| .... మల్ల చోళ సింహ చోళ, శార్దూల| మత్త మాతంగ| హరిరాయాస్తాన గజసింహ| బౌద్ధకండకుద్దాల| పాండియరాయమగ| ధనుంజయ గోత్ర పవిత్ర| ... రాజు పేరు జగమొచ్చు గండండు| బంటు పేరు పగమెచ్చు గండండు| ఖడ్గం పేరు కాలమృత్యువు| రేవు పేరు పాప వినాశనంబు| నదిపేరు కృష్ణవేణి| దేవర పేరు అమరేశ్వర దేవుండు| పట్టణంబు పేరు ధరణాల కోట| వాటి పేరు ధన్య వాటి| వీటి పేరు గండరగండ వీడు| పడగ పేరు గండభేరుండ| .... అంబ దేవర భూపాలుండు మొదలైన శ్రీ కోట రాజుల అన్వయ ప్రశస్తి| విజయీభవ| దిగ్విజయీభవ !!'' <ref>స్టడీస్ ఇన్ సౌత్ ఇండియన్ జైనిజం, పార్ట్ 2: ఆంధ్ర - కర్ణాటక జైనిజం, బి. శేషగిరి రావు - 1922, పేజీలు 24, 25; Printers ; Hoe & Co ,</ref>
 
గండభేరుండ పక్షి బొమ్మను రాజముద్రగా చాళుక్యులు వాడినట్టే, వీరు కూడా వాడారు. [[శ్రీనాధుడు]] తాను వ్రాసిన ధనుంజయ విజయాన్ని దంతులూరి గన్నభూపాలుడికి అంకితం చేశాడు. మహాముని కావ్య కంఠ గణపతి శాస్త్రి తన పుస్తకంలో గన్నభూపాలుడు తన కుమార్తె సురంబికను [[అద్దంకి]], ధరణికోట, కొండవీడు ప్రాంతాలను పాలిస్తున్న అనవేమా రెడ్డికి ఇచ్చి వివాహం చేసాడని, ఇదే [[క్షత్రియులు|క్షత్రియ]] కులానికి మరియు [[రెడ్డి]] కులానికి మధ్య జరిగిన మొదటి వివాహమని వ్రాశాడు. సుమారు 17 వ శతాబ్దములో మంగళగిరి ఆనంద కవి తాను వ్రాసిన విజయనంద విలాసమును కోట సామ్రాజ్య వంశస్తుడైన దాట్ల వెంకటకృష్ణమ రాజును కీర్తిస్తూ వ్రాశాడు <ref name="ReferenceB"/>. [[విశాఖపట్నం జిల్లా]] [[వీరవల్లి]] తాలూకా [[చోడవరం]] గ్రామంలో ఉన్న కేశవస్వామి ఆలయ స్తంభం పై చెక్కిన శిలాశాసనం (No. 741. (A. R. No. 54 of 1912.) భూపతిరాజు వల్లభరాజు మహాపత్రమని చెబుతున్నది. ఈ సామ్రాజ్యపు రాజులు నిర్మించుకొన్న కోటల ఆనవాళ్ళు నేడు లేవు. బహుశా వీరు మట్టి కోటలు నిర్మించుకొనివుంటారని, అవి కాలక్రమేణా నేలమట్టమై కాలగర్భంలో కలిసిపోయాయని చరిత్రకారుల ఊహ. [[ఈస్టిండియా కంపెనీ|ఈస్టు ఇండియా కంపెనీ]] వారు భారత దేశాన్ని పాలించు కాలములో కోట వంశానికి చెందిన [[దాట్ల]], దంతులూరి, చింతలపాటి, [[భూపతిరాజు]] వంటి ధనుంజయ గోత్రపు గృహనామాల జమీందారులు రెవిడి, మద్గోలు, గోలుగొండ, ఉరట్ల, [[దార్లపూడి]] ప్రాంతాలను పరిపాలించారు. [[భారత దేశము|భారతదేశం]] సార్వభౌమ అధికార దేశంగా[[దేశం]]<nowiki/>గా అవతరించిన తర్వాత జమీందారీ వ్యవస్థ అంతరించింది.
 
==అపోహ==
కోట రాజులు [[కమ్మ]] కులస్తులకు పూర్వీకులని కొంతమందిలో భావం ఉంది. కోట అనే పదం [[గృహనామం]]<nowiki/>గా కమ్మ కులస్తులలో ఉండటం వల్ల ఈ భావం ఉండవచ్చును. ఇందులో వాస్తవం లేదు. కోట వంశము వారిది [[ధనుంజయ గోత్రం]]. ఈ గోత్రం కమ్మ కులస్తులలో లేదు. గృహనామాలు ఊరి పేరుని బట్టి ఏర్పడినప్పుడు ఒక కులంలో ఉన్న గృహనామం మరొక కులంలో కూడా ఉండవచ్చు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కోట_సామ్రాజ్యము" నుండి వెలికితీశారు