గండికోట యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దేశమునకు → దేశానికి using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గండికోట యుద్ధం''': [[తెలుగు]] వారి శౌర్య ప్రతాపాలకు, దేశాభిమానానికి, [[హిందూధర్మ]] సంరక్షణా తత్పరతకు ప్రతీక [[గండికోట]]. [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యానికి]] వెన్నెముకగా నిలచి, [[విజయనగర]] రాజులకు విశ్వాసపాత్రులై, పలు యుద్ధములలో[[యుద్ధము]]<nowiki/>లలో తురుష్కులను ఓడించి, ప్రసిద్ధి గాంచిన [[పెమ్మసాని నాయకులు|పెమ్మసాని కమ్మ నాయకులకు]] నెలవు [[గండికోట]].
 
==గండికోట==
 
[[గండికోట]] [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[కడప జిల్లా]] [[జమ్మలమడుగు]] తాలూకాలో [[పెన్నా]] నది ఒడ్డున గల ఒక [[దుర్గం]]. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే [[పెన్నా నది]]<nowiki/>కి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు [[గండికోట]] అనే పేరు వచ్చింది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. దట్టమైన అడవుల మధ్య ఎంతటి బలమైన శతృవు దాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది. చుట్టూ లోతైన [[లోయ]]లతో, ఎర్రటి గ్రానైట్ [[గ్రానైట్రాయి|శిల]] శిలలతో<nowiki/>లతో ఏర్పడిన దుర్బేధ్యమైన కొండలతో, 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే [[పెన్నా నదితోనది]]<nowiki/>తో, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచములాంటిది.
 
==పెమ్మసాని చినతిమ్మానాయుడు==
 
విజయనగర సామ్రాజ్య స్థాపకుడు [[మొదటి బుక్క రాయలు|బుక్క రాయలు]] క్రీ. శ. 1356లో మిక్కిలినేని రామానాయుడను యోధుని గండికోటలో సామంతునిగా నియమించాడు. ఈతని అల్లుడు పెమ్మసాని తిమ్మానాయుడు. [[ధరణికోట]] సమీపమున గల [[బెల్లంకొండ]] వాస్తవ్యుడు. మగ సంతానములేని కారణమున రామానాయుని తదుపరి తిమ్మానాయునికి అధికారము సంక్రమించింది. కలుబురిగె ([[గుల్బర్గా]]) యుద్ధములో తిమ్మానాయుని సాహసానికి సంతసించి [[రెండవ ప్రౌఢ దేవరాయలు]] క్రీ. శ. 1422లో [[యాడికి]] పరగణా వ్రాసి ఇచ్చాడు. తిమ్మానాయుడు క్రమముగా తన రాజ్యాన్ని [[గుత్తి]], [[తాడిపత్రి]], [[జమ్మలమడుగు]] ప్రాంతాలకు విస్తరించాడు. ఈతని తదుపరి వరుసగా [[పెమ్మసాని రామలింగ నాయుడు]], పెదతిమ్మ, బలిచిన్న, అరతిమ్మ, నారసింహ, బొజ్జతిమ్మ మొదలగు వారు పాలించారు. చివరి పాలకుడు చినతిమ్మా నాయుని కాలములో [[గండికోట]] ముస్లిముల వశమయ్యింది.
 
==మీర్ జుమ్లా==
 
మీర్ జుమ్లా పారశీక ([[ఇరాన్]]) దేశానికి చెందిన ఒక తైల వర్తకుని కుమారుడు. [[గోలకొండ]] రాజ్యముతో [[వజ్రం|వజ్రాల]] వ్యాపారము చేస్తున్న ఒక వర్తకుని వద్ద గుమాస్తాగా పనిచేసి, వజ్రాల గురించి జ్ఞానము సంపాదించి [[భారతదేశము]] చేరాడు. స్వయముగా వజ్రాలవ్యాపారిగా మారి, గనులు సంపాదించి, ఎన్నో [[ఓడ]]లు సమకూర్చుకొని గొప్ప ధనవంతుడయ్యాడు. తదుపరి గోలకొండ సుల్తాను [[అబ్దుల్లా కుతుబ్ షా]] ప్రాపకము సంపాదించి దర్బారులో [[వజీరు]] స్థానానికి ఎదిగాడు. [[మచిలీపట్టణము]]లో స్థావరము ఏర్పరచుకొని [[తెలుగు]] దేశములోని వజ్రసంపదపై గురిపెట్టాడు<ref>The Life of Mir Jumla, J. N. Sarkar, Rajesh Publications, Delhi, 1979, pp. 4-5</ref>.
 
[[విజయనగర]] సామ్రాజ్యంలో వజ్రాల గనులున్న [[రాయలసీమ]]పై ఈతని కన్ను పడింది. విజయనగర రాజులకు విశ్వాసపాత్రులైన [[పెమ్మసాని నాయకులు]] పాలిస్తున్న [[గండికోట]], జుమ్లా ఆశలకు పెద్ద అడ్డుగా నిలచింది. [[గోలకొండ]] దర్బారులో మంత్రిగానున్న పొదిలి లింగన్న ప్రోద్బలంతో క్రీ.శ. 1650లో పెద్ద సైన్యంతో మీర్ జుమ్లా గండికోటపై దండెత్తాడు. అతనికి సహాయముగా ఆధునిక యుద్ధతంత్రం తెలిసిన మైల్లీ అను [[ఫ్రెంచ్]] ఫిరంగుల నిపుణుడు ఉన్నాడు<ref>The French in India, Rose Vincent, 1990, Popular Prakashan, p.9, ISBN 0861322592</ref>.
 
==యుద్ధం==
పంక్తి 19:
అనేక దినాల భీకరయుద్ధం తరువాత కూడా కోట వశము కాలేదు. ఫ్రెంచివారి ఫిరంగుల ధాటికి కోట గోడలు బీటలు వారాయి. [[గండికోట]] అప్పగిస్తే [[గుత్తి]] దుర్గానికి అధిపతి చేస్తానని జుమ్లా బేరసారాలు చేశాడు. [[మంత్రి]] చెన్నమరాజు సంధి చేసుకొమ్మని సలహా ఇచ్చాడు. కాని తిమ్మా నాయుడు అంగీకరించలేదు. విజయమో వీరస్వర్గమో రణభూమిలోనే తేలగలదని నాయుని అభిప్రాయం<ref>Dr Ghulam Yazdani Commemoration Volume, H. K. Sherwani, 1966, Dr Abul Kalam Azad Oriental Research Institute, Delhi</ref>. క్లాడ్ మైలీ అతి కష్టముమీద మూడు భారీ ఫిరంగులను కొండ మీదికి చేర్చాడు. ఈ ఫిరంగుల ధాటికి కోట గోడలు బద్దలయ్యాయి. యుద్ధం మలుపు తిరిగింది.
 
వేలాది యోధులు కోటను పరిరక్షిస్తూ ఫ్రెంచ్ ఫిరంగుల దాడిలో మరణించారు. తిమ్మానాయుని బావమరిది శాయపనేని నరసింహ నాయుడు వీరోచితముగా పోరాడుతూ కోట సంరక్షణ గావిస్తూ అసువులు బాశాడు. చెల్లెలు [[పెమ్మసాని గోవిందమ్మ]] [[సతీసహగమనం|సతీసహగమనము]] చేయకుండా, అన్న వారిస్తున్నా వినకుండా కాసెగట్టి, అశ్వారూఢయై తురుష్క, ఫ్రెంచ్ సైనికులతో తలపడింది. భర్త మరణానికి కారకుడైన అబ్దుల్ నబీ అను వానిని వెదికి వేటాడి సంహరించింది. అదే సమయములో నబీ వేసిన కత్తి వేటుకు కూలి, వీరమరణము పొందింది. కోటలో వందలాది [[స్త్రీలు]] అగ్నిప్రవేశము చేసారు. ఎండు మిరపకాయలు పోగులుగా పోసి నిప్పుబెట్టి ఆందులో దూకారు. హతాశుడైన చినతిమ్మ రాయబారానికి తలొగ్గక తప్పలేదు. గండికోటకు బదులుగా [[గుత్తి కోట]]ను అప్పగించుట ఒప్పందం కుదిరింది. కోట బయటకు వచ్చిన నాయునికి పొదిలి లింగన్న కుతంత్రముతో [[విషం]] ఇప్పిస్తాడు. అదే సమయములో గుత్తికోటకు బదులు హనుమనగుత్తి అను చిన్న గ్రామానికి అధిపతినిచేస్తూ ఫర్మాను ఇవ్వబడింది. మోసము తెలుసుకున్న చినతిమ్మ ఫర్మాను చింపివేసి బాలుడైన కొడుకు పిన్నయ్యను బంధువుల కప్పగించి రాజ్యము దాటిస్తాడు. తిమ్మానాయుడు విషప్రభావము వల్ల మరణించాడు.<ref>గండికోట యుద్ధం, కొసరాజు రాఘవయ్య, 1977, కమ్మజన సేవాసమితి, గుంటూరు</ref>
 
యుద్ధం ముగిసిన ఎనిమిది రోజులకు ప్రముఖ వజ్ర వ్యాపారి టావెర్నియర్ గండికోటలోనున్న[[గండికోట]]<nowiki/>లోనున్న మీర్ జుమ్లాను కలిశాడు. ఆ సందర్భమున తిమ్మానాయుని శౌర్యపరాక్రమము గురించి విని తన పుస్తకములో[[పుస్తకము]]<nowiki/>లో వ్రాశాడు<ref>Ball, V. and Crooke,W., Tavernier's Travels in India, 2001, Asian Educational Services, ISBN 8120615670</ref>.
 
==పతనం==
 
మీర్ జుమ్లా గండికోటలోని మాధవస్వామి ఆలయాన్ని ధ్వంసం చేసి పెద్ద మసీదు నిర్మించాడు. [[దేవాలయానికి]] చెందిన వందలాది [[గోవులను]] చంపించాడు<ref>District Gazetteer, Cuddapah, C. F. Brackenbury, 1915, Government Press, Madras, ISBN 8120614828</ref>. కోటను ఫిరంగుల తయారీకి స్థావరంగా మార్చాడు.<ref>గండికోట కైఫీయత్</ref> గండికోటపై సాధించిన విజయంతో మీర్ జుమ్లా [[మచిలీపట్నం]] నుండి శాంథోం (చెన్నపట్టణము) వరకు అధికారి అయ్యాడు<ref>Asia in the Making of Eurpe: A Century of Advance, Book 2, South Asia, D. F. Lach and E. J. Van Kley, 1998, University of Chicago Press, p. 1077; ISBN 0226467678, 9780226467672</ref>. ఈ సమయములోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వజ్రాల వర్తకుడు టావర్నియెర్ గండికోటను సందర్శించాడు.
 
బంధువుల సాయముతో [[మైసూరు రాజ్యము]] చేరిన పిన్నయ నాయుణ్ణి తమిళదేశానికి తరలించారు. గండికోటలోని అరవయ్యారు ఇంటిపేర్లు గల [[కమ్మ]] వంశాలవారు చెల్లాచెదరైపోయి పలు ప్రాంతాలలో స్థిరపడ్డారు. వారిలో చాలామంది [[గంప]]లలో వస్తువులు పెట్టుకొని అడవులూ, కొండలు దాటుతూ కావేటిరాజపురం, [[మధుర]], [[గుంటూరు]], [[తిరుచినాపల్లి]] మొదలగు ప్రాంతాలకు పోయారు. వీరికే '[[గంపకమ్మవారు]]', '[[గండికోట కమ్మవారు]]' అనే పేర్లు వచ్చాయి. మధుర చేరిన పెద వీరప్ప నాయుడు, నాయకుల ఆస్థానములో పదవులు పొంది తదుపరి సింహళ దేశ యుద్ధములలో విజయాలు సాధించి పెట్టాడు. వీరి వారసులు [[మధుర]] సమీపములోని కురివికులం, నాయకర్‌పట్టి మొదలగు జమీందారీలకు అధిపతులయ్యారు.
 
మూడు శతాబ్దాలు విజయనగర రాజులకు సామంతులుగా పలు యుద్ధములలో తురుష్కులపై విజయాలు సాధించి, [[హిందూధర్మశాస్త్రాలు|హిందూధర్మ]] రక్షణకు, దక్షిణభారత సంరక్షణకు అహర్నిశలు శ్రమించి, రాయలవారి ఆస్థానములో పలుప్రశంశలు పొంది, చరిత్ర పుటలలోనికెక్కిన యోధానుయోధులు గండికోట నాయకులు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గండికోట_యుద్ధం" నుండి వెలికితీశారు